Saturday, February 1, 2020

Telugu Murli 01/02/2020

01-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఈ శరీరమనే వస్త్రాన్ని ఇక్కడే వదిలేయాలి, కనుక దీని పై మమకారాన్ని తొలగించండి, బంధు - మిత్రులెవ్వరూ గుర్తు రాకూడదు ''

ప్రశ్న :- యోగ బలమున్న పిల్లల గుర్తులేవి ?
జవాబు :- వారికి ఏ విషయములోనూ కొద్దిగానైనా నష్టము, ఆపద సంభవించదు. దేనిపైనా మోహము, ఆకర్షణ ఉండదు. ఈ రోజు ఎవరైనా శరీరము వదిలినా, వారికి దుఃఖము కలుగదు. ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర అంతవరకే, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి, మరొకటి తీసుకుంటుందని వారికి తెలుసు.

ఓంశాంతి. ఈ జ్ఞానము చాలా గుప్తమైనది. ఇందులో నమస్కరించే అవసరము కూడా ఉండదు. ప్రపంచములో నమస్తే లేక రాం-రాం మొదలైన పదాలు అంటూ ఉంటారు. ఇక్కడ ఈ విషయాలేవీ ఉండవు. ఎందుకంటే ఇది ఒక కుటుంబము. కుటుంబములో ఒకరికొకరు నమస్తే లేక గుడ్‌మార్నింగ్‌ చెప్పడం అంత శోభించదు. ఇంటిలో అయితే ఆహార-పానీయాలు తీసుకుంటారు, ఆఫీసుకు వెళ్తారు, మళ్లీ వస్తారు మొదలైనవి జరిగిపోతూ ఉంటాయి. నమస్కారము చేసే అవసరముండదు. గుడ్‌మార్నింగ్‌ చెప్పే ఫ్యాషన్‌ కూడా యూరోపువాసుల నుండి వచ్చింది. లేకుంటే అంతకుముందు ఇవేవీ లేవు. ఏ సత్సంగములోనైనా పరస్పరము కలిసినప్పుడు నమస్కరిస్తారు, పాద నమస్కారము చేస్తారు. పాదాల పై పడడం మొదలైనవి నమ్రత కొరకు నేర్పిస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మ, ఆత్మకు ఏం చేస్తుంది? అయినా పలకరించవలసి వస్తుంది. ఉదాహరణానికి మీరు బాబాతో - ''బాబా నమస్తే'' అని చెప్తారు కదా. ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు - నేను సాధారణ బ్రహ్మ శరీరము ద్వారా మిమ్ములను చదివిస్తాను, ఇతని ద్వారా స్థాపన చేయిస్తాను. ఎలా? తండ్రి సన్ముఖములో ఉన్నప్పుడు అర్థము చేయిస్తారు. లేకుంటే ఎలా అర్థం చేసుకోగలరు. తండ్రి సన్ముఖంగా కూర్చొని అర్థము చేయిస్తుంటే పిల్లలు అర్థము చేసుకుంటున్నారు. ఇరువురికి నమస్కరించాలి - బాప్‌దాదాలకు నమస్తే. బయటివారు ఈ మాట వింటే, ఇదేమిటి వీరు బాప్‌దాదా అని ఒక్కరినే అంటున్నారే అని తికమకపడ్తారు. చాలామంది మనుష్యులకు కూడా ఒక్కరికే రెండు పేర్లు కలిసి ఉంటాయి కదా. ఉదాహరణకు లక్ష్మినారాయణ, రాధా-కృష్ణుడు,........ అని డబల్‌ పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు వింటే స్త్రీ - పురుషులు కలిసి ఉన్నట్లుంటుంది. అయితే ఇప్పుడు వీరు బాప్‌దాదా. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు. తప్పకుండా తండ్రి పెద్దవారుగా ఉంటారు. ఆ పేరు భలే డబల్‌ పేరు కావచ్చు కానీ వ్యక్తి ఒక్కరే కదా. అయితే రెండు పేర్లు ఎందుకు పెట్టారు? ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పేరు తప్పు అని తెలుసు. బాబాను ఇతరులెవ్వరూ గుర్తించలేరు. మీరు నమస్తే బాప్‌దాదా అని అంటారు. తండ్రి మళ్లీ ''నమస్తే శారీరిక, ఆత్మిక పిల్లలారా!'' అని అంటారు, అయితే ఇంత పొడవుగా ఉంటే శోభించదు. పదాలేమో రైటే. ఇప్పుడు మీరు శారీరిక పిల్లలే కాదు, ఆత్మిక పిల్లలు కూడా అయ్యారు. శివబాబా ఆత్మలందరికీ తండ్రి, అంతేకాక ప్రజాపిత కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరీ-సోదరులు. ఇది ప్రవృత్తి మార్గమవుతుంది. మీరంతా బ్రహ్మకుమార-కుమారీలు. బి.కె.లైనందున ప్రజాపిత ఉన్నారని కూడా ఋజువైపోతుంది. ఇందులో గ్రుడ్డి నమ్మకాల మాటే లేదు. బి.కె.లకు తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని చెప్పండి. బ్రహ్మ ద్వారా లభించదు, బ్రహ్మ కూడా శివబాబా కుమారుడే. సూక్ష్మ వతనవాసులైన బ్రహ్మ-విష్ణు-శంకరులు వారి రచన. వీరి రచయిత శివుడు. శివుని సృష్టించినదెవరు? అని ఎవ్వరూ అడగరాదు. శివుని సృష్టించిన వారెవ్వరూ లేరు(స్వయంభూ). బ్రహ్మ-విష్ణు-శంకరులు వారి రచన. వీరి పై ఉన్నవారు శివుడు, వారు సర్వాత్మల తండ్రి, సృష్టికర్త అయితే ఎప్పుడు సృష్టిస్తారు? అనేది తర్వాతి ప్రశ్న. అలా సృష్టించేది లేదు. ఈ సృష్టి అనాది. ఇంతమంది ఆత్మలను ఎప్పుడు సృష్టించారు? ఈ ప్రశ్నే రాదు. ఈ డ్రామా అనాది నుండి నడుస్తూనే ఉంది. అంతము లేనిది. ఇది ఎప్పుడూ సమాప్తమవ్వదు. ఈ విషయాలు పిల్లలైన మీరు కూడా నంబరువారుగా అర్థము చేసుకుంటారు, ఇది చాలా సహజము. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరి పైన ఆకర్షణ ఉండరాదు, ఎవరు పుట్టినా, ఎవరు గిట్టినా ఎలాంటి లగావ్‌(ఆకర్షణ, ఆసక్తి) ఉండరాదు. అమ్మ మరణించినా హల్వా తినండి, పత్ని మరణించినా హల్వా తినండి(అమ్మా మరే తో భీ హల్వా ఖానా, బీబీ మరే తోభీ హల్వా ఖానా,......)అను గాయనము కూడా ఉంది. ఎవరైనా మరణించారనుకోండి చింతించే విషయము కాదు, ఎందుకంటే ఇది అనాదిలో తయారైన డ్రామా. డ్రామానుసారము వారు ఈ సమయములో వెళ్లిపోవలసే ఉంది, ఇందులో మనమేం చేయగలము? కొద్దిగా కూడా దుఃఖించే విషయమే లేదు. ఇది యోగబలము వలన కలుగు స్థితి. కొద్దిగా కూడా కుదుపు దుఃఖము రాకూడదని 'లా'(చట్టము) చెప్తుంది. అందరూ పాత్రధారులే కదా. తమ-తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. పిల్లలకు జ్ఞానము లభించింది.

''ఓ పరమపిత పరమాత్మా! వచ్చి మమ్ములను తీసుకెళ్లండి'' అని తండ్రిని పిలుస్తారు. ఇన్ని శరీరాలను వినాశనము చేయించి ఆత్మలన్నింటినీ వెంట తీసుకెళ్లడం చాలా భారీ(పెద్ద) కర్తవ్యము. ఇక్కడ ఎవరైనా ఒక్కరు మరణిస్తే 12 మాసాలు ఏడుస్తూ ఉంటారు. తండ్రి అయితే ఇంతమంది ఆత్మలను కలిపి తీసుకెళ్తారు. అందరి శరీరాలు ఇక్కడే ఊడిపోతాయి. మహాభారత యుద్ధము జరుగుతే అందరూ దోమల వలె వెళ్తూ ఉంటారని పిల్లలకు తెలుసు. ప్రకృతి భీవత్సాలు కూడా రానున్నాయి. ఈ ప్రపంచమంతా పరివర్తనవుతుంది. ఇప్పుడు ఇంగ్లండు, రష్యా మొదలైన దేశాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో చూడండి. సత్యయుగములో ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ మన రాజ్యములో లేనే లేవని కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఒకే ధర్మము, ఒకే రాజ్యముండేది. మీలో కూడా బుద్ధిలో స్థిరంగా ఉంచుకునేవారు నంబరువారుగా ఉన్నారు. కొందరికి నషా చాలా కష్టంగా ఎక్కుతుంది. బంధు-మిత్రులు మొదలైనవారందరి నుండి స్మృతి తొలగించుకొని ఒకే అనంతమైన సంతోషములో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది కూడా అంతములో జరుగుతుంది. కర్మాతీత అవస్థను చివర్లో పొందుతారు. శరీరము పై కూడా అభిమానము తెగిపోతుంది. ఇక చాలు ఇప్పుడు మేము వెళ్లిపోతాము - ఈ భావము అందరిలో సాధారణమైపోతుంది. నాటకములోని పాత్రధారులు నాటకమైపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోతారు. ఈ దేహమనే వస్త్రాన్ని మీరు ఇక్కడేే వదిలేయాలి. ఈ వస్త్రాలను ఇక్కడే ధరిస్తారు, ఇక్కడే వదిలేస్తారు. ఈ నూతన విషయాలన్నీ మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి. ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేవు. అల్ఫ్‌(బాబా), బే(వారసత్వము). అందరికంటే పైనున్నవారు అల్ఫ్‌. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన అని చెప్తారు కూడా. మంచిదే. అయితే శివుని కర్తవ్యమేమి? అత్యంత ఉన్నతులైన శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇవన్నీ వారి రూపాలే అని అంటారు. ప్రపంచములోని వారందరి బుద్ధిలో ఇది పక్కా అయిపోయింది. అందుకే అందరూ తమోప్రధానమై పోయారు. తండ్రి చెప్తున్నారు - ప్రపంచమంతా దుర్గతిపాలైపోయింది. మళ్లీ నేనే వచ్చి అందరికి సద్గతినిస్తాను. ఒకవేళ సర్వవ్యాపి అయితే అందరూ భగవంతులే భగవంతులవుతారా? ఒక వైపేమో మనమంతా సోదరులమని అంటారు. మరోవైపు అందరూ తండ్రులే(భగవంతులే) అని అంటారు. అర్థమే చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమౌతాయి. మీరు ఈ దాదాను గానీ, మమ్మాను గానీ స్మృతి చేయరాదు. తండ్రి చెప్తున్నారు - మమ్మాకు గానీ, బాబాకు గానీ మహిమ ఏ మాత్రమూ లేదు. శివబాబా లేకుంటే ఈ బ్రహ్మ కూడా ఏం చేసేవారు? ఇతనిని స్మృతి చేస్తే ఏమవుతుంది(ఏం లభిస్తుంది)? అయితే వీరి ద్వారా మనము తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇతని(బ్రహ్మ) నుండి కాదు. ఇతను కూడా వారి నుండే వారసత్వము తీసుకుంటాడు. కనుక స్మృతి వారిని చేయాలి. ఇతడు మధ్యలో ఉన్న దళారి మాత్రమే. అబ్బాయికి-అమ్మాయికి నిశ్చితార్థము జరిగితే ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు కదా. వివాహము చేయించేవారు మధ్యలో దళారే కదా. ఇతని ద్వారా తండ్రి, ఆత్మలైన మీ నిశ్చితార్థము తనతో చేసుకుంటారు. అందుకే సద్గురువు దళారి(మధ్యవర్తి) రూపములో లభించారనే గాయనముంది. సద్గురువు దళారి కాదు. సద్గురువు నిరాకారులు. భలే గురు బ్రహ్మ, గురుర్విష్ణు అంటారు. కానీ వారెవ్వరు గురువులే కారు. సద్గురువు ఒక్క తండ్రి మాత్రమే. వారు సర్వులకు సద్గతినిస్తారు. తండ్రి మీకు నేర్పించారు. అందుకే మీరు ఇతరులకు కూడా దారి చూపిస్తారు. చూస్తూ కూడా చూడకండి అని అందరికి చెప్తారు. బుద్ధి శివబాబాతో జోడింపబడి ఉండాలి. ఈ కనులతో చూచేదంతా శ్మశానగ్రస్థము అవ్వనున్నది. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇతనిని స్మృతి చేయరాదు. ఇతనితో ఏ వారసత్వము లభించదని బుద్ధి చెప్తుంది. వారసత్వమైతే తండ్రితో లభించాలి. వెళ్లాల్సింది కూడా తండ్రి వద్దకే. విద్యార్థులు విద్యార్థులను స్మృతి చేయరు. విద్యార్థులు టీచరును స్మృతి చేస్తారు కదా. పాఠశాలలో తెలివిగల పిల్లలు, ఇతర పిల్లలను కూడా పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. తండ్రి కూడా ఒకరినొకరు ఉన్నతి చేసుకునేందుకు ప్రయత్నించండని చెప్తారు. కాని భాగ్యములో లేకుంటే వారు పురుషార్థము కూడా చేయరు. కొద్దిలోనే సంతోషిస్తారు. ప్రదర్శిని చూచేందుకు చాలామంది వస్తారు. వారందరికి అర్థం చేయించాలి. చాలా మందికి అర్థం చేయించడం వలన చాలా ఉన్నతి జరుగుతుంది. ఆహ్వానించి తీసుకొస్తారు. కనుక గొప్ప-గొప్ప వివేకవంతులు వస్తారు. ఆహ్వానము లేకుండా అనేక ప్రకారాలైన జనులు వచ్చేస్తారు. ఏవేవో ఉల్టా - సుల్టా మాటలు వ్యర్థ మాటలు వాగుతూ ఉంటారు. రాయల్‌ మనుష్యుల నడవడికలు కూడా రాయల్‌గా ఉంటాయి. రాయల్‌ మనుష్యులు రాయల్‌(హుందా)గా లోపలకు వస్తారు. నడవడికలో కూడా చాలా వ్యత్యాసముంటుంది. వారి నడవడికలో, మాటలలో ఎలాంటి గౌరవము ఉండదు. మేళాకు అనేక విధాలైన మనుష్యులు వచ్చేస్తారు. ఎవ్వరినీ వద్దనలేము. కనుక ఎక్కడ ప్రదర్శిని జరిగినా, ఆహ్వాన కార్డు పంపి రప్పించుకుంటే మంచి-మంచి రాయల్‌ మనుష్యులు వస్తారు. వారు పోయి ఇతరులకు కూడా తప్పకుండా వినిపిస్తారు. అప్పుడప్పుడు స్త్రీల కార్యక్రమము ప్రత్యేకంగా ఉంచండి. కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూస్తారు. ఎందుకంటే అక్కడక్కడ స్త్రీలు పర్దా చాటున బురఖాలో ఉంటారు. కనుక కేవలం స్త్రీల కొరకు మాత్రమే ప్రోగ్రాము ఉంచండి. అప్పుడు పురుషులెవ్వరూ రాకూడదు. మొట్టమొదట మీరు శివబాబా నిరాకారుడని అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఇరువురూ తండ్రులే, ఇరువురు బాబాల నుండి వారసత్వము లభించేందుకు ఇరువురు ఏకరసంగా ఉండరు, వారసత్వము లభించేది తాతగారిదా, లేక తండ్రిదా? తాతగారి ఆస్తి పై హక్కు ఉంటుంది. ఎటువంటి కుపుత్రుడైనా తాతగారి వారసత్వము(ఆస్తి) లభిస్తుంది. ఇది ఇక్కడి చట్టము, ఇతనికి ధనము లభిస్తే ఒక సంవత్సరము లోపలే పోగొడ్తాడని కూడా తెలుసు. కాని ప్రభుత్వ చట్టము(లా ) ఉన్నందున ఇవ్వవలసి వస్తుంది. ప్రభుత్వమేమీ చేయలేదు. ఇందులో ఈ బాబా అనుభవజ్ఞుడు. ఒక రాకుమారుడు, ఒక కోటి రూపాయలు 12 మాసాల లోపలే ఖర్చు చేసేశాడు. ఇటువంటివి చూచానని శివబాబా చెప్పరు, ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూచానని, ఈ దాదా చెప్తారు. ఇది చాలా మురికి ప్రపంచము. ఈ ప్రపంచమే పాతదైపోయింది. ఇల్లు కూడా పాతదైపోయింది, పాత ఇంటిని పడగొట్టవలసి వస్తుంది. ఈ లక్ష్మినారాయణుల రాజ భవనాలు ఎంత ఫస్ట్‌క్లాసుగా ఉన్నాయో చూడండి.

మీరు కూడా నరుని నుండి నారాయణునిగా అవుతారని ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థము చేసుకుంటున్నారు. ఇదే సత్యనారాయణ కథ. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. మీలో కూడా ఇంకా పూర్తి పుష్పాలుగా అవ్వలేదు, ఇందులో చాలా మంచి రాయల్టీ కావాలి. మీరు రోజు రోజుకు ఉన్నతి అవుతూ ఉంటారు. పుష్పాలుగా అవుతూ ఉంటారు.

పిల్లలైన మీరు ప్రేమగా ''బాప్‌దాదా'' అని అంటారు. ఇది కూడా మీ నూతన భాష. ఈ భాష మనుష్యులకు అర్థము కాదు. బాబా ఎక్కడికెళ్ళినా పిల్లలు ''బాప్‌దాదా నమస్తే'' అని అంటారు. అందుకు బదులుగా తండ్రి ఆత్మిక, శారీరిక పిల్లలకు నమస్తే అని అంటారు. ఇలా చెప్పవలసి వస్తుంది కదా. ఎవరైనా వింటే ఇదేదో కొత్త మాట. తండ్రి, అన్న ఇరువురూ కలిసి ఎలా ఉంటారు? అని అంటారు. తండ్రి-అన్న ఇరువురూ ఎప్పుడైనా ఒక్కరిగానే ఉంటారా? ఇరువురి పేర్లు కూడా వేరు వేరుగా ఉన్నాయి, శివబాబా, బ్రహ్మ దాదా, మీరు వీరిరువురి పిల్లలు. ఇతని(బ్రహ్మ)లో శివబాబా కూర్చొని ఉన్నారని మీకు తెలుసు. మనము బాప్‌దాదా పిల్లలము. ఇది బుద్ధిలో గుర్తున్నా ఖుషీ పాదరస మీటరు పైకెక్కి ఉంటుంది. డ్రామా పై కూడా పక్కా నిశ్చయముండాలి. ఎవరైనా శరీరము వదిలినారనుకోండి. వారు వెళ్లి మరో పాత్ర చేస్తారు. ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించి ఉంది, ఇందులో ఆలోచించే అవసరము కొద్దిగా కూడా లేదు. వారు వెళ్లి మరో పాత్ర చేయవలసి ఉంది. వాపసు పిలువలేరు. ఇది డ్రామా కదా. ఇందులో ఏడ్చే అవసరమేదీ లేదు. ఇటువంటి స్థితి కలిగినవారే అక్కడ నిర్మోహ రాజులు(మోహజీత్‌ రాజులు)గా అవుతారు. సత్యయుగంలో అందరూ నిర్మోహులుగా ఉంటారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగానో ఏడుస్తారు. తండ్రిని పొందుకున్నాము ఇక ఏడ్చే అవసరమే లేదు. బాబా ఎంతో మంచి దారి చూపిస్తారు. కన్యలకైతే ఇది చాలా మంచిది. లౌకిక తండ్రి వ్యర్థంగా, అనవసరంగా ధనము ఖర్చు చేస్తాడు, మీరు పోయి నరకములో పడ్తారు. ఇంతకంటే మేము ఈ ధనముతో ఆత్మిక యూనివర్సిటి కమ్‌ ఆసుపత్రి తెరుస్తాము అని చెప్పండి. అనేకమందికి కళ్యాణము చేస్తే మీకు పుణ్యమే, మాకు పుణ్యమే అని మీ లౌకిక తండ్రికి చెప్పండి. మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు తనువు-మనసు-ధనము అన్నీ ఖర్చు చేస్తాము అని చెప్పే ఉత్సాహము స్వయం పిల్లలైన మీలో ఉండాలి. ఇంతటి నషా ఉండాలి. మీ తండ్రితో - మీరు ధనము ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. వద్దనుకుంటే ఇవ్వకండి. మీరు మీ కళ్యాణము, ఇతర అనేకమంది కళ్యాణము చేయాలని కోరుకోరా? అని అడగండి. ఇంత మస్తీ (నశా) ఉండాలి, ముఖ్యంగా కుమారీలు చాలా దృఢంగా నిలబడాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ నడవడిక చాలా రాయల్‌గా, శ్రేష్ఠంగా ఉంచుకోవాలి. చాలా గౌరవ పూర్వకంగా మాట్లాడాలి. నమ్రతా గుణాన్ని ధారణ చేయాలి.
2. ఈ కనులకు కనిపించేదంతా శ్మశానగ్రస్థము అవ్వనున్నది. కనుక దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. ఏ దేహధారిని స్మృతి చేయరాదు.

వరదానము :- '' విశేషత అనే సంజీవని మూలిక ద్వారా మూర్ఛితులైన వారిని మేల్కొలిపే విశేష ఆత్మా భవ ''
ప్రతి ఆత్మకు శ్రేష్ఠ స్మృతులు, విశేషతల స్మృతి అనే సంజీవిని మూలికను తినిపించండి. అప్పుడు మూర్ఛితుల నుండి మేల్కుంటారు. విశేషతల స్వరూపమనే దర్పణాన్ని వారి ముందుంచండి. ఇలా స్మృతినిప్పించుట ద్వారా మీరు విశేషాత్మలుగా అవ్వనే అవుతారు. ఒకవేళ మీరు బలహీనతను వినిపిస్తే వారు దాచిపెట్తారు, పక్కకు నెట్టేస్తారు. విశేషతలు వినిపిస్తే స్వయం తమ బలహీనతను స్పష్టంగా అనుభవం చేస్తారు. ఈ సంజీవిని మూలికతో మూర్ఛితులైన వారిని మేల్కొలిపి ఎగురుతూ వెళ్లండి, ఇతరులను ఎగిరిస్తూ ఉండండి.

స్లోగన్‌ :- '' పేరు ప్రతిష్ఠలు మరియు సాధనాలను సంకల్పంలో కూడా త్యాగం చేయడమే మహోన్నతమైన త్యాగము. ''

No comments:

Post a Comment