Sunday, February 2, 2020

Telugu Murli 02/02/2020

02-02-2020 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 18-11-1985 మధువనము

'' భగవంతుని భాగ్యశాలి పిల్లల లక్షణాలు ''
బాప్‌దాదా పిల్లలందరి మస్తకం పై గల భాగ్య రేఖలను చూస్తున్నారు. ప్రతి పుత్రుని మస్తకం పై భాగ్యరేఖలు గీయబడి ఉన్నాయి. కాని కొంతమంది పిల్లల భాగ్యరేఖలు స్పష్టంగా ఉన్నాయి. కొంతమంది రేఖలు స్పష్టంగా లేవు. తండ్రి అయిన భగవంతుని పిల్లలుగా అయినప్పటి నుండి భాగ్యరేఖలను చూస్తున్నారు. భగవంతుడంటే భాగ్యవిధాత. భగవంతుడంటే దాత, విధాత. అందువలన వారి పిల్లలుగా అయినంతనే భాగ్యానికి అధికారులు అనగా వారసత్వము పిల్లలందరికి అవశ్యం ప్రాప్తిస్తుంది. అయితే లభించిన ఆ వారసత్వాన్ని జీవితంలో ధారణ చేయడం, సేవలో ఉపయోగించి శ్రేష్ఠంగా చేసుకోవడం, స్పష్టంగా చేసుకోవడం ఇందులో నంబరువార్‌గా ఉన్నారు. ఎందుకంటే ఈ భాగ్యాన్ని ఎంతగా స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యములో ఉపయోగిస్తారో అంత వృద్ధి చెందుతుంది అనగా రేఖలు స్పష్టమౌతాయి. తండ్రి ఒక్కరే, వారు ఇచ్చేది కూడా అందరికి ఒకే విధంగానే ఇస్తారు. తండ్రి భాగ్యాన్ని నంబరువారుగా పంచరు. కాని భాగ్యాన్ని తయారు చేసుకునేవారు ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడంలో యథాశక్తిగా అయిన కారణంగా నంబరువారుగా అయిపోతారు. అందువలన కొంతమంది రేఖలు స్పష్టంగా ఉన్నాయి. కొంతమంది రేఖలు స్పష్టంగా లేవు. స్పష్టమైన రేఖలు గల పిల్లలు స్వయం కూడా ప్రతి కర్మలో తమను తాము భాగ్యశాలురమని అనుభవం చేస్తారు. దానితో పాటు వారి ముఖము ద్వారా, నడవడిక ద్వారా భాగ్యము ఇతరులకు కూడా అనుభవమవుతుంది. అంతేకాక ఇటువంటి భాగ్యశాలి పిల్లలను చూచి వీరు గొప్ప భాగ్యశాలి ఆత్మలని అనుకుంటారు, అంటారు. వీరి భాగ్యము సదా శ్రేష్ఠమైనది. ప్రతి కర్మలో మిమ్ములను మీరు భగవంతుని భాగ్యశాలి పిల్లలమని అనుభవం చేస్తున్నామా? అని ప్రశ్నించుకోండి. భాగ్యము మీ వారసత్వము. వారసత్వము ప్రాప్తి అవ్వకుండా ఉండడం ఎప్పుడూ ఉండజాలదు. భాగ్యాన్ని వారసత్వ రూపంలో అనుభవం చేస్తున్నారా? లేక శ్రమ చేయాల్సి వస్తోందా? వారసత్వము సులభంగా ప్రాప్తిస్తుంది. శ్రమ ఉండదు. లౌకికంలో కూడా తండ్రి ఖజానాల పై, ఆస్తుల పై పిల్లలకు స్వతహాగా అధికారముంటుంది. అంతేకాక తండ్రి వారసత్వము లభించిందనే నశా ఉంటుంది. ఇటువంటి భాగ్య నశా ఉందా లేక నశా ఎక్కుతూ, దిగుతూ ఉంటుందా? ఇది అవినాశి వారసత్వము కనుక ఎంత నశా ఉండాలి! ఒక జన్మకే కాదు, అనేక జన్మల భాగ్యము జన్మ సిద్ధ అధికారంగా లభించిందని నశాతో వర్ణన చేస్తారు. సదా ఈ భాగ్య మెరుపు ప్రత్యక్ష రూపంలో ఇతరులకు కనిపించాలి. మెరుపు మరియు పొంగు (ఉత్సాహము) రెండూ ఉన్నాయా? మర్జ్‌ రూపంలో ఉన్నాయా? ఎమర్జ్‌ రూపంలో ఉన్నాయా? (గుప్తంగా ఉన్నాయా? బయటకు కనిపిస్తున్నాయా?) భాగ్యశాలి ఆత్మల గుర్తులు - వారు సదా ఒడిలో పాలింపబడ్తారు. తివాచీల పై నడుస్తారు, ఊయలలో ఊగుతారు. మట్టిలో కాలు పెట్టరు. వారి కాళ్లు ఎప్పుడూ మైల పడవు. ప్రపంచంలోని వారు తివాచీల పై నడుస్తారు, మీరు బుద్ధి రూపి కాళ్లతో సదా నేల పై కాక ఫరిస్తాల ప్రపంచంలో ఉంటారు. ఈ పాత మట్టి ప్రపంచంలో బుద్ధి రూపి కాలు మోపరు అనగా బుద్ధిని మురికిగా చేసుకోరు. భాగ్యశాలురు మట్టి బొమ్మలతో ఆడుకోరు. సదా రత్నాలతో ఆడుకుంటారు. భాగ్యశాలురు సదా సంపన్నంగా ఉంటారు. అందువలన ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిలో ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు సదా మహాదాని పుణ్యాత్మలుగా అయి ఇతరుల భాగ్యాన్ని కూడా తయారుచేస్తూ ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు సదా కిరీటము, సింహాసనము, తిలకధారులుగా ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు భాగ్యానికి ఎంత అధికారులుగా ఉంటారో అంత త్యాగధారి ఆత్మలుగా ఉంటారు. భాగ్యానికి గుర్తు త్యాగము. త్యాగము భాగ్యాన్ని స్పష్టము చేస్తుంది. భాగ్యశాలి ఆత్మలు సదా భగవంతుని సమానం నిరాకారి, నిరహంకారి, నిర్వికారి - ఈ మూడు విశేషతలతో భర్‌పూర్‌గా ఉంటారు. ఈ గుర్తులన్నీ స్వయంలో అనుభవం చేస్తున్నారా? భాగ్యశాలుర లిస్టులో అయితే ఉండనే ఉన్నారు కదా. అయితే యథాశక్తిగా ఉన్నారా లేక సర్వశక్తివంతంగా ఉన్నారా? మాస్టర్‌గా ఉన్నారు కదా. తండ్రిని ఎప్పుడూ యథాశక్తివాన్‌ లేక నంబరువార్‌ అని అనరు. సదా సర్వశక్తివంతులనే అంటారు. మీరు మాస్టర్‌ సర్వశక్తివంతులు. యథాశక్తి ఎందుకు? సదా శక్తివంతులు. యథా అనే శబ్ధాన్ని మార్చి సదా శక్తివంతులుగా అవ్వండి, ఇతరులను కూడా చేయండి. అర్థమయిందా.

ఏ జోన్‌ వారు వచ్చారు? అందరూ వరదాన భూమిలోకి వచ్చి వరదానాలతో జోలె నింపుకుంటున్నారు కదా. వరదాన భూమిలో ఒక్కొక్కరి చరిత్రలో, కర్మలో విశేష వరదానాలు నిండి ఉన్నాయి. యజ్ఞ భూమిలోకి వచ్చి కూరగాయలు తరిగినా, ధాన్యము శుభ్రము చేసినా అందులో కూడా యజ్ఞ సేవ వరదానాలు నిండి ఉన్నాయి. ఎలాగైతే యాత్రకు వెళ్లినప్పుడు మందిరాన్ని శుభ్రపరచడం కూడా ఒక పెద్ద పుణ్యంగా భావిస్తారో అలా ఈ మహా తీర్థ స్థానము లేక వరదాన భూమిలో చేయు ప్రతి కర్మలో, ప్రతి అడుగులో వరదానాలే వరదానాలు నిండి ఉన్నాయి. జోలెలో ఎంత భాగము నింపుకున్నారు? జోలెను పూర్తిగా నింపుకొని వెళ్తారా? లేక యథాశక్తి నింపుకుంటారా? ఎవరు ఎక్కడ నుండి వచ్చినా మేళా జరుపుకునేందుకే వచ్చారు. మధువనంలో ఒక సంకల్పము గానీ, ఒక సెకండు గానీ వ్యర్థంగా పోరాదు. సమర్థంగా అయ్యే ఈ అభ్యాసము మీ స్థానములో కూడా సహయోగం చేస్తుంది. చదువు మరియు పరివారము - చదువులోని లాభము కూడా తీసుకోండి, పరివారములో విశేషమైన అనుభవం కూడా చేయండి. అర్థమయిందా.

బాప్‌దాదా అన్ని జోన్ల వారికి సదా వరదానులుగా, మహాదానులుగా అయినందుకు అభినందనలు తెలుపుతున్నారు. జనుల ఉత్సవము సమాప్తమయింది కానీ మీ ఉత్సాహము నిండిన ఉత్సవము సదా ఉంటుంది. మీది సదా గొప్ప రోజే. అందువలన ప్రతి రోజు మీకు శుభాకాంక్షలే శుభాకాంక్షలు. మహారాష్ట్ర సదా మహాన్‌గా అయి మహాన్‌గా చేసే వరదానాలతో జోలెను నింపేవారు. కర్ణాటక వారు సదా తమ హర్షితముఖము ద్వారా స్వయం కూడా సదా హర్షితంగా ఉండి, ఇతరులను కూడా హర్షితంగా చేసి జోలెను నింపుతూ ఉండేవారు. యు.పి వారు ఏం చేస్తారు? సదా శీతలంగా ఉండు నదుల సమానంగా శీతలతా వరదానమునిచ్చి శీతలా దేవీలుగా అయి అందరినీ శీతలా దేవీలుగా చేయండి. శీతలత ద్వారా సదా సర్వుల అన్ని విధాలైన దు:ఖాలను దూరం చేయండి. అటువంటి వరదానాలతో జోలెను నింపండి. అచ్ఛా.

సదా స్పష్టమైన శ్రేష్ఠ భాగ్యరేఖలు గలవారు, సదా తండ్రి సమానం సర్వ శక్తులతో సంపన్న, సంపూర్ణ స్థితిలో స్థితమై ఉండేవారు, సదా ఈశ్వరీయ మెరుపు మరియు భాగ్య నశాలో ఉండేవారు, ప్రతి కర్మ ద్వారా భాగ్యవంతులై భాగ్య వారసత్వమునిప్పించే మాస్టర్‌ భాగ్యవంతులు, శ్రేష్ఠ భాగ్యవాన్‌ పిల్లలకు బాప్‌దాదా యాద్‌ప్యార్‌ ఔర్‌ నమస్తే.

పెద్ద దాదీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక -

ఆది నుండి ఇంతవరకు ఎవరైతే ప్రతి కార్యములో నా తోడుగా వస్తున్నారో వారి విశేషత ఏమంటే - ఎలాగైతే బ్రహ్మబాబా ప్రతి అడుగులో అనుభవీగా అయి అథారిటీతో విశ్వరాజ్యధికారము తీసుకుంటాడో అలా మీ అందరూ చాలాకాలము నుండి అన్ని ప్రకారాలైన అనుభవాల అథారిటి కారణంగా చాలాకాలపు రాజ్యాధికారములో కూడా సాథీలుగా అయ్యేవారు. ఆది నుండి ''ఎక్కడ కూర్చోబెడ్తారో, ఎలా నడిపిస్తారో'' అలా నడుస్తూ జతలో వస్తామని సంకల్పము చేసినవారు కనుక వెంట నడుస్తాము అనే మొదటి ప్రతిజ్ఞ బాప్‌దాదా నిభాయించవలసే వస్తుంది. బ్రహ్మబాబా వెంట వెళ్లేవారు రాజ్యములో కూడా జతలో ఉంటారు, భక్తిలో కూడా వెంట ఉంటారు. ఒకవేళ ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటే ఏదో ఒక జన్మలో దూరంగా ఉంటారు, ఒక జన్మలో దగ్గరగా ఉంటారు. కాని ఎవరైతే సదా బుద్ధి ద్వారా జతలో ఉంటారో వారు అక్కడ కూడా జతలో ఉంటారు. సాకారంలో మీరంతా 14 సంవత్సరాలు తోడుగా ఉన్నారు. సంగమ యుగంలోని 14 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలకు సమానమవుతుంది? సంగమ యుగంలోని ఇంత సమయం సాకార రూపంలో జతలో ఉన్నారు, ఇది కూడా ఎంత పెద్ద భాగ్యము. అంతేకాక బుద్ధితో కూడా జతలో ఉన్నారు, ఇంట్లో కూడా జతలో ఉంటారు. రాజ్యములో కూడా జతలో ఉంటారు. భలే సింహాసనము పై కూర్చోరు కానీ రాయల్‌ కుటుంబానికి సమీప సంబంధములో మొత్తం దినచర్యలో జతలో ఉండే పాత్రను తప్పకుండా అభినయిస్తారు. కనుక ఆదిలో జతలో ఉంటామని చేసిన ప్రతిజ్ఞ మొత్తం కల్పమంతా నడుస్తూ ఉంటుంది. భక్తిలో కూడా చాలా కాలము జతలో ఉంటారు. ఈ చివరి జన్మలో కొంతమంది కొంచెం దూరంగా కొంతమంది దగ్గరగా ఉంటారు. కాని మొత్తం కల్పమంతా ఏదో ఒక రూపంలో ఉంటారు. ఇలా ప్రతిజ్ఞ చేశారు కదా! అందువలన మిమ్ములను అందరూ ఏ దృష్టితో చూస్తారు! మీరు తండ్రి రూపాలు - దీనినే భక్తిలో వారు, వీరంతా భగవంతుని రూపాలని అన్నారు. ఎందుకంటే తండ్రి సమానంగా అవుతారు కదా! మీ రూపము ద్వారా తండ్రి కనిపిస్తారు. అందువలన తండ్రి రూపమని అంటారు. ఎవరైతే తండ్రి జతలో ఉంటారో వారి విశేషత ఇదే ఉంటుంది - వారిని చూచి తండ్రి గుర్తుకొస్తారు. వారిని స్మృతి చేయరు కానీ తండ్రిని స్మృతి చేస్తారు. వారి ద్వారా తండ్రి చరిత్ర, తండ్రి దృష్టి, తండ్రి కర్మలు అన్నీ అనుభవమవుతాయి. స్వయం వారు కనిపించరు కాని వారి ద్వారా తండ్రి కర్మలు లేక దృష్టి అనుభవమవుతుంది. అనన్యమైన సమాన పిల్లల విశేషత ఇదే. అందరూ ఇలా ఉన్నారు కదా! మీలో అయితే చిక్కుకోరు కదా! ఫలానావారు చాలా మంచివారని అనరు కదా, తండ్రి వీరిని మంచిగా చేశారని అనాలి. వీరి ద్వారా తండ్రి దృష్టి, తండ్రి పాలన లభిస్తుందని అనాలి. వీరి ద్వారా తండ్రి మహావాక్యాలు వింటామని అనాలి. ఇదే వీరి విశేషత. దీనిని ప్రియంగానూ ఉన్నారు, భిన్నంగానూ ఉన్నారని అంటారు. అందరికి భలే ప్రియంగా ఉండండి కానీ ఇరికించుకొను వారిగా ఉండకండి. తండ్రికి బదులు మిమ్ములను స్మృతి చేయరాదు. తండ్రి శక్తి తీసుకునేందుకు, తండ్రి మహావాక్యాలు వినేందుకు మిమ్ములను గుర్తు చేసుకోవాలి. దీనినే ప్రియంగానూ ఉన్నారు, అతీతంగానూ ఉన్నారని అంటారు. మీరు ఇటువంటి గ్రూపు కదా! సాకార పాలన తీసుకున్నారు. ఏదో విశేషత ఉంటుంది కదా. మీ వద్దకు వస్తే మిమ్ములను ఏమడుగుతారు - తండ్రి ఏం చేసేవారు, ఎలా నడిచేవారు...... ఇదే గుర్తొస్తుంది కదా. మీరు ఇటువంటి విశేషమైన ఆత్మలు. దీనిని డివైన్‌(దైవీ ఐకమత్యము) అని అంటారు. డివైన్‌ స్మృతినిప్పించి డివైన్‌గా చేస్తారు. అందువలన డివైన్‌ యూనిటి అని అంటారు. 50 సంవత్సరాలు అవినాశిగా ఉన్నారు. కనుక 'అవినాశి భవ' కు అభినందనలు. చాలామంది వచ్చారు, చాలామంది తిరిగి వచ్చేందుకు వెళ్లారు. మీరేమో అనాది, అవినాశిగా అయ్యారు. అనాదిలోనూ జతలోనే, ఆదిలో కూడా జతలోనే ఉంటారు. వతనంలో తోడుగా ఉంటే సేవ ఎలా చేస్తారు! మీరు కొద్దిగా విశ్రాంతి కూడా తీసుకుంటారు. తండ్రికి విశ్రాంతి కూడా అవసరం లేదు. బాప్‌దాదా విశ్రాంతి నుండి కూడా విడుదల అయ్యారు. అవ్యక్తానికి విశ్రాంతి అవసరం లేదు. వ్యక్తంలో ఉండేవారికి అవసరము. ఇందులో మీ సమానంగా చేస్తే పని సమాప్తమైపోతుంది. అయినా ఎప్పుడైనా సేవకు అవకాశం లభిస్తే తండ్రి సమానం అథక్‌గా(అలసట లేకుండా) అవుతారు, అలసిపోరు. అచ్ఛా.

దాదీగారితో - బాల్యం నుండే తండ్రి కిరీటధారిగా చేశాడు. వస్తూనే సేవ చేసే బాధ్యతా కిరీటాన్ని ధరింపజేశారు. సమయ ప్రతి సమయం ఏ పాత్ర అయితే నడిచిందో భికారి(బెగ్గరి) పాత్ర అయినా, సంతోషాల పాత్ర అయినా అన్ని పాత్రలలో బాధ్యతా కిరీటాన్ని డ్రామానుసారము ధారణ చేస్తూ వచ్చావు. అందువలన అవ్యక్త పాత్రలో కూడా కిరీటాన్ని ధరించి నిమిత్తంగా అయ్యావు. కనుక ఈ విశేషమైన పాత్ర ఆది నుండే ఉంది. సదా బాధ్యతను నిభాయించేదానివి. తండ్రి బాధ్యులుగా ఉన్నట్లు బాధ్యతా కిరీటాన్ని ధరించే విశేషమైన పాత్ర ఉంది. అందువలన అంత్యములో కూడా దృష్టి ద్వారా కిరీటము, తిలకము అన్ని ఇచ్చి వెళ్లారు. అందువలన మీ స్మృతిచిహ్నము ఏదైతే ఉందో అందులో కిరీటము తప్పకుండా ఉంటుంది. ఎలాగైతే కృష్ణునికి బాల్యము నుండే కిరీటాన్ని చూపిస్తారు కనుక స్మృతి చిహ్నములో కూడా బాల్యము నుండే కిరీటధారి రూపముతో పూజిస్తారు. మిగిలిన వారంతా జతలో ఉంటారు కానీ నీవు కిరీటధారివి. అందరూ తోడు నిభాయిస్తారు కానీ సమాన రూపంలో తోడు నిభాయించడంలో వ్యత్యాసముంది.

పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక - కుమారులతో - 1. కుమారులు అనగా నిర్బంధనులు. అన్నిటికంటే పెద్ద బంధనము మానసిక వ్యర్థ సంకల్పాల బంధనము. ఇందులో కూడా నిర్బంధనులు. అప్పుడప్పుడు ఈ బంధనము బంధించడం లేదు కదా? ఎందుకంటే సంకల్పశక్తి ప్రతి అడుగులో సంపాదన చేసేందుకు ఆధారము. స్మృతియాత్ర ఏ ఆధారముతో చేస్తారు? సంకల్పశక్తి ఆధారముతో బాబా వద్దకు చేరుకుంటారు కదా! అశరీరిగా అయి వెళ్తారు. కనుక మానసిక శక్తి విశేషమైనది. వ్యర్థ సంకల్పాలు మానసిక శక్తిని బలహీనపరుస్తాయి. అందువలన ఈ బంధనము నుండి ముక్తులవ్వండి. కుమార్లు అనగా సదా తీవ్ర పురుషార్థులు. ఎందుకంటే నిర్బంధనులుగా ఉండేవారి వేగం స్వతహాగానే తీవ్రంగా ఉంటుంది. బరువుగా ఉండేవారు నెమ్మదిగా నడుస్తారు. తేలికగా ఉండేవారు సదా తీవ్ర వేగంతో నడుస్తారు. ఇప్పుడు సమయానుసారము పురుషార్థము చేసే సమయం గతించిపోయింది. ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయి గమ్యానికి చేరుకోవాలి.

2. కుమార్లు పాత వ్యర్థ ఖాతాను సమాప్తం చేసుకున్నారా? కొత్త ఖాతా సమర్థమైనది, పాత ఖాతా వ్యర్థమైనది. కనుక పాత ఖాతా సమాప్తమైపోయింది. అక్కడ కూడా వ్యవహారములో ఎప్పుడూ పాత ఖాతాను ఉంచుకోరు. పాతదానిని సమాప్తం చేసి కొత్త ఖాతాను పెంచుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ కూడా పాత ఖాతాలను సమాప్తం చేసి సదా కొత్తగా, ప్రతి అడుగులో సమర్థంగా ఉండాలి. ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు అలా ఉండాలి. తండ్రి సమర్థులు కనుక పిల్లలు కూడా తండ్రిని అనుసరించి సమర్థంగా అవుతారు.

మాతలతో - 1. మాతలు ఏ గుణములో విశేషమైన అనుభవీలు? ఆ విశేష గుణమేది? (త్యాగము, సహనశీలత). ఇంకా ఏదైనా గుణముందా? మాతల స్వరూపము విశేషంగా దయాస్వరూపము. మాతలు దయాహృదయులు. బేహద్‌ మాతలైన మీకు బేహద్‌ ఆత్మల పట్ల దయ కలుగుతూ ఉందా? దయ కలిగినప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారు సేవ లేకుండా ఉండలేరు. దయాహృదయులుగా అయినప్పుడు అనేక ఆత్మల కళ్యాణము జరగనే జరుగుతుంది. అందువలన మాతలను కళ్యాణి అని కూడా అంటారు. కళ్యాణి అనగా కళ్యాణం చేయువారు. ఎలాగైతే తండ్రిని విశ్వకళ్యాణకారి అని అంటారో అలా మాతలకు విశేషంగా తండ్రి సమానం 'కళ్యాణి' అనే టైటిల్‌ లభించింది. ఇలా ఉత్సాహం వస్తోందా? ఎలా ఉండేవారు ఎలా అయ్యారు? స్వ పరివర్తన ద్వారా ఇతరులకు కూడా ఉల్లాస-ఉత్సాహాలు వస్తాయి. హద్దు మరియు బేహద్‌ సేవల బ్యాలన్స్‌ ఉందా? ఆ సేవలో అయితే లెక్కాచారము చుక్త అవుతుంది. అది హద్దు సేవ. మీరు బేహద్‌ సేవాధారులు. స్వయంలో సేవ చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటే అంత సఫలత లభిస్తుంది.

2. మాతలు తమ త్యాగము మరియు తపస్సు ద్వారా విశ్వకళ్యాణము చేసేందుకు నిమిత్తంగా అయి ఉన్నారు. మాతలలో త్యాగము మరియు తపస్సుల విశేషత ఉంది. ఈ రెండు విశేషతల ద్వారా సేవకు నిమిత్తంగా అయి ఇతరులను కూడా తండ్రికి చెందినవారిగా చేయడంలో బిజీగా ఉంటున్నారా? సంగమయుగ బ్రాహ్మణుల పనే - సేవ చేయడం. బ్రాహ్మణులు సేవ లేకుండా ఉండలేరు. ఎలాగైతే నామధారి బ్రాహ్మణులు తప్పకుండా కథలు చెప్తారు కనుక ఇక్కడ కూడా కథ చెప్పడం అనగా సేవ చేయడం. కనుక జగన్మాతలుగా అయి జగత్తు కొరకు ఆలోచించండి. అనంతమైన పిల్లల కొరకు ఆలోచించండి. కేవలం ఇంట్లోనే కూర్చోకండి. బేహద్‌ సేవాధారులుగా అయి సదా ముందుకు వెళ్తూ ఉండండి. హద్దులో 63 జన్మలు గడిచాయి. ఇప్పుడు బేహద్‌ సేవలో ముందుకు వెళ్లండి.

వీడ్కోలు సమయం పిల్లలందరికి ప్రియస్మృతులు - అన్నివైపుల ఉన్న స్నేహీ, సహయోగి పిల్లలు బాప్‌దాదా గారి విశేష స్నేహ సంపన్న ప్రియ స్మృతులు స్వీకరించండి. ఈ రోజు బాప్‌దాదా పిల్లలందరికి సదా నిర్విఘ్నంగా అయి విఘ్న వినాశకులుగా అయి విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే కార్యము కొరకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి పుత్రుడు సేవలో సదా ముందుకు వెళ్లాలని శ్రేష్ఠ సంకల్పము చేస్తాడు. ఈ శ్రేష్ఠ సంకల్పము సేవలో సదా ముందుకు తీసుకెళ్తూ ఉంది, ఇంకా తీసుకెళ్తూ ఉంటుంది. సేవతో పాటు స్వఉన్నతి మరియు సేవలో ఉన్నతి - రెండిటిలో బ్యాలన్స్‌ ఉంచి ముందుకు వెళ్తూ ఉండండి. అప్పుడు బాప్‌దాదా మరియు సర్వ ఆత్మల ద్వారా ఎవరి కొరకైతే నిమిత్తంగా అవుతారో వారి హృదయపూర్వక ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. కనుక సదా బ్యాలన్స్‌ ద్వారా ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి - రెండూ జత జతలో ఉన్నందున సదా సహజ సఫలతా స్వరూపులుగా అవుతారు. అందరూ తమ తమ పేర్లతో విశేషమైన ప్రియస్మృతులు స్వీకరించండి. అచ్ఛా.

వరదానము :- '' అందరికి సంతోషకరమైన వార్తను వినిపించే ఖుషీ ఖజానాతో భర్‌పూర్‌ భండార్‌ భవ ''
సదా మీ ఈ స్వరూపాన్ని ముందుంచుకోండి - ''నేను ఖుషీ ఖజానాతో నిండుగా ఉండే భండారమును.'' లెక్కలేనన్ని అవినాశి ఖజానాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఖజానాలను స్మృతిలోకి తీసుకు రండి. ఖజానాలను స్మృతిలోకి తెచ్చినందున సంతోషము కలుగుతుంది. ఎక్కడ సంతోషముంటుందో అక్కడ సదా కాలము కొరకు దు:ఖము దూరమైపోతుంది. ఖజానాల స్మృతి ద్వారా ఆత్మ సమర్థంగా అవుతుంది, వ్యర్థము సమాప్తమైపోతుంది. నిండుగా ఉన్న ఆత్మ ఎప్పుడూ ఆందోళనలోకి రాదు. వారు స్వయం కూడా సంతోషంగా ఉంటారు, ఇతరులకు కూడా సంతోషకరమైన వార్తను వినిపిస్తారు.

స్లోగన్‌ :- '' యోగ్యులుగా అవ్వాలంటే కర్మ మరియు యోగాల బ్యాలన్స్‌ ఉంచండి ''

No comments:

Post a Comment