Saturday, February 1, 2020

Telugu Murli 31/01/2020

31-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - యోగము అగ్నితో సమానము. అందులో మీ పాపాలన్నీ కాలిపోతాయి. ఆత్మ సతోప్రధానమైపోతుంది. కనుక ఒక్క తండ్రి స్మృతిలో (యోగములో) ఉండండి ''

ప్రశ్న :- పుణ్యాత్మలుగా అయ్యే పిల్లలు ఏ విషయంలో చాలా చాలా గమనముంచాలి ?
జవాబు :- ఎవరికైనా ధనము దానము చేయాలనే విషయంలో పూర్తిగా గమనముంచాలి. ఎవరికైనా ధనము దానమిచ్చినప్పుడు వారు పోయి సారాయి మొదలైనవి తాగితే, చెడు కర్మలు చేస్తే, ఆ పాపము మీ పైకి వస్తుంది. ఇప్పుడు మీరు పాపాత్మలతో ఇచ్చి - పుచ్చుకోవడం చేయరాదు. ఇక్కడ మీరు పుణ్యాత్మలుగా అవ్వాలి.

పాట :- వారు మాతో విడిపోరు................. ( నా వహ్‌ హమ్‌ సే జుదా హోంగే,................)  
ఓంశాంతి. దీనినే యోగాగ్ని అని అంటారు. యోగాగ్ని అనగా స్మృతి వలన వచ్చే అగ్ని. అగ్ని అని ఎందుకన్నారు? ఎందుకంటే ఇందులో పాపాలు కాలిపోతాయి. మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా అవుతామో కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సతోప్రధానమంటే పుణ్యాత్మ. తమోప్రధానమంటే పాపాత్మ. ఇతను చాలా పుణ్యాత్మ అని, ఇతను పాపాత్మ అని అంటూ ఉంటారు. దీని వలన ఆత్మనే సతోప్రధానమవుతుందని, పునర్జన్మ తీసుకుంటూ తీసుకుంటూ మళ్లీ తమోప్రధానమవుతుందని అందుకే పాపాత్మ అని అంటారని ఋజువవుతుంది. పతిత పావనులైన తండ్రిని కూడా ''మీరు వచ్చి పావనంగా చేయమనే పిలుస్తారు.'' పతితాత్మగా చేసిందెవరో ఎవ్వరికీ తెలియదు. పావనాత్మలుగా ఉన్నప్పుడు దానిని రామరాజ్యమని అనేవారు. ఇప్పుడు అందరూ పతితాత్మలే ఉన్నారు. అందువలన దీనిని రావణ రాజ్యమని అంటారు. భారతదేశమే పావనంగా, భారతదేశమే పతితంగా అవుతుంది. తండ్రే స్వయంగా వచ్చి భారతదేశాన్ని పావనంగా చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ పావనంగా అయి శాంతిధామానికి వెళ్లిపోతాయి. ఇప్పుడిది దు:ఖధామము. ఇంత సులభమైన విషయము కూడా బుద్ధిలో కూర్చోదు. హృదయపూర్వకంగా అర్థము చేసుకుంటే సత్యమైన బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే తండ్రి నుండి వారసత్వము లభించదు.
ఇప్పుడిది సంగమ యుగములోని యజ్ఞము. యజ్ఞము కొరకు బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది మృత్యులోకములో అంతిమ యజ్ఞమని మీకు తెలుసు. యజ్ఞాలు మృత్యులోకములోనే ఉంటాయి. అమరలోకములో యజ్ఞాలుండవు. భక్తుల బుద్ధిలో ఈ మాటలు కూర్చోవు. భక్తి వేరు, జ్ఞానము వేరు. మనుష్యులు వేదశాస్త్రాలనే జ్ఞానమని భావిస్తారు. వాటిలో జ్ఞానముంటే మనుష్యులు వాపసు వెళ్లేవారు. కానీ డ్రామానుసారము వాపస్‌ ఎవ్వరూ వెళ్లరు. మొదటి నంబరులోని వారే సతో, రజో, తమోలోకి తప్పకుండా రావాలని బాబా అర్థం చేయించారు. అటువంటప్పుడు ఇతరులు సతో పాత్రను చేసి వాపసు ఎలా వెళ్లగలరు? వారు మళ్లీ తమోప్రధానములోకి రావాల్సిందే. పాత్రను అభినయించాల్సిందే. ప్రతి పాత్రధారి శక్తి వేరు వేరుగా ఉంటుంది కదా. గొప్ప-గొప్ప నటులు ఎంత పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటారు! అందరికంటే ముఖ్యమైన సృష్టికర్త, డైరక్టరు, ముఖ్య పాత్రధారి ఎవరు? ముఖ్యమైనవారు గాడ్‌ఫాదర్‌ అని ఇప్పుడు మీకు తెలుసు. వారి తర్వాత జగదంబ, జగత్పిత. వారు జగత్తుకు అధికారులు, విశ్వానికి యజమానులుగా అవుతారు. వీరి పాత్ర తప్పకుండా ఉన్నతమైనది. కనుక వారి జీతము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జీతమిచ్చేది అత్యంత ఉన్నతమైన తండ్రి. నీవు నాకు ఇంత సహాయము చేస్తున్నావు కనుక నీకు జీతము కూడా అంత ఎక్కువగా లభిస్తుందని తండ్రి అంటారు. బ్యారిస్టరు చదివిస్తే, ఇంత ఉన్నతమైన పదవి ప్రాప్తి చేయిస్తున్నానని అంటారు. ఇంత ఉన్నతమైన పదవి ప్రాప్తి చేయిస్తాను. కనుక ఈ చదువు పై పిల్లలు ఎంత గమనమివ్వాలి! గృహస్థములో కూడా ఉండాలి. కర్మయోగ సన్యాసులు కదా. గృహస్థ వ్యవహారములో ఉంటూ అన్ని పనులు చేస్తూ తండ్రి నుండి వారసత్వము పొందే పురుషార్థము చేయవచ్చు. ఇందులో ఏ కష్టమూ లేదు. పని పాట చేసుకుంటూ శివబాబా స్మృతిలో ఉండాలి. జ్ఞానమైతే చాలా సహజము. ఓ పతితపావనా! రండి, మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని కూడా పాడ్తారు కదా. పావన ప్రపంచంలో అయితే రాజధాని ఉంటుంది. తండ్రి ఆ రాజధానికి కూడా అర్హులుగా చేస్తారు.
ఈ జ్ఞానములో ముఖ్యంగా రెండు సబ్జక్టులున్నాయి - 1. అల్ఫ్‌. 2. బే. స్వదర్శన చక్రధారులుగా అయి తండ్రిని స్మృతి చేస్తే మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు - నన్ను అక్కడ(పరంధామంలో) స్మృతి చేయండి. ఇంటిని కూడా స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తే మీరు ఇంటికి వెళ్లిపోతారు. స్వదర్శన చక్రధారులుగా అయినందున మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. బుద్ధిలో ఇది మంచి రీతిగా గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. సుఖధామంలో సుఖము, శాంతి, సంపద అన్నీ లభిస్తాయి. అక్కడ ఒకే ధర్మముంటుంది. ఇప్పుడు ఇంటింటా అశాంతి ఉందని మీరు చూస్తున్నారు. విద్యార్థులెంత గలాటా చేస్తున్నారో చూడండి. తమ ఉడుకు రక్తాన్ని చూపిస్తారు. ఇది తమోప్రధాన ప్రపంచము. సత్యయుగము నూతన ప్రపంచము. తండ్రి సంగమ యుగములో వచ్చి ఉన్నారు. మహాభారత యుద్ధము కూడా సంగమ యుగములోనిదే. ఇప్పుస్త్ర ఈ ప్రపంచము పరివర్తన చెందుతుంది. తండ్రి కూడా చెప్తున్నారు - నేను నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు సంగమ యుగములో వస్తాను. దీనినే పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. పురుషోత్తమ మాసము, పురుషోత్తమ సంవత్సరాన్ని కూడా ఆచరిస్తారు. కానీ ఈ పురుషోత్తమ సంగమ యుగము గురించి ఎవ్వరికీ తెలియదు. సంగమ యుగములోనే తండ్రి వచ్చి మిమ్ములను వజ్ర సమానంగా చేస్తారు. అయితే వీరిలో కూడా నంబరువార్‌గా ఉండనే ఉంటారు. వజ్ర సమానమైన రాజులుగా అవుతారు, మిగిలినవారు బంగారు సమానమైన ప్రజలుగా అవుతారు. పిల్లలు జన్మించిన వెంటనే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇప్పుడు మీరు పావన ప్రపంచానికి హక్కుదారులుగా అవుతారు. అందులో ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థము చేయాలి. ఈ సమయములో మీరు చేసే పురుషార్థము కల్ప-కల్పానికి పురుషార్థమైపోతుంది. కల్ప-కల్పము ఇలాంటి పురుషార్థమే చేస్తారని, ఎక్కువ పురుషార్థము జరగనే జరగదని తెలిసిపోతుంది. జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాలు వీరు ప్రజలలోనే వస్తారు. వీరు శ్రీమంతులైన ప్రజలకు దాస-దాసీలుగా అవుతారు. నంబరువారుగా ఉంటారు కదా. చదువు ఆధారంగా అంతా తెలిసిపోతుంది. ఈ స్థితిలో మీ శరీరము వదిలేస్తే ఏ పదవి పొందుతారో బాబా వెంటనే తెలుపగలరు. రోజురోజుకు సమయము తగ్గిపోతూ వస్తుంది. ఒకవేళ ఎవరైనా శరీరాన్ని వదిలేస్తే తర్వాత చదవలేరు. అయితే కొద్దిగా బుద్ధికి తోస్తుంది. శివబాబాను స్మృతి చేస్తారు. ఉదాహరణానికి చిన్న పిల్లలు కూడా మీరు స్మృతి చేయిస్తే, శివబాబా శివబాబా అని అంటూ ఉంటారు. వారికి కూడా కొద్దిగా లభిస్తుంది. చిన్నపిల్లలు మహాత్ముల వంటి వారు. వారికి వికారాల గురించి తెలియదు. ఎంత పెరిగి పెద్దవారౌతూ ఉంటారో అంత వికారాల ప్రభావము పడ్తూ ఉంటుంది. క్రోధముంటుంది, మోహముంటుంది.......... ఇప్పుడు ఈ ప్రపంచంలో, మీరు కనులతో ఏమేం చూస్తున్నారో వాటి పై మమకారాన్ని నశింపజేయాలి. ఇదంతా శ్మశాన గ్రస్థమైపోతుందని ఆత్మకు తెలుసు. అన్నీ తమోప్రధాన వస్తువులే. మానవులు మరణిస్తే వారి పాత వస్తువులన్నీ శ్మశాన బ్రాహ్మణులకు ఇచ్చేస్తారు. తండ్రి అనంతమైన శ్మశాన బ్రాహ్మణుడు. చాకలి కూడా వారే. మీ నుండి ఏం తీసుకుంటారు? ఏమిస్తారు? మీరిచ్చే అంతో ఇంతో ధనము కూడా సమాప్తమయ్యే తీరాలి. అయినా ఈ ధనము మీ వద్దనే ఉంచుకోండి, కేవలం దాని పై మమకారాన్ని తీసేయమని తండ్రి చెప్తున్నారు. లెక్కాచారము తండ్రికి ఇస్తూ ఉండండి. అప్పుడు మీకు ఆదేశాలు లభిస్తూ ఉంటాయి. మీ వద్ద ఉండే పనికిరానిదంతా యూనివర్సిటీలో, ఆసుపత్రి కొరకు, ఆరోగ్యము, ఐశ్యర్యాల కొరకు ఖర్చు చేస్తారు. ఆసుపత్రి జబ్బులు బాగు చేసేందుకు, యూనివర్సిటి చదివించేందుకు ఉపయోగపడ్తాయి. అయితే కాలేజి ఇదే, ఆసుపత్రి కూడా ఇదే. దీని కొరకు కేవలం 3 అడుగుల నేల చాలు. ఎవరి వద్ద ఇంకేమీ ఉండదో వారు కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలు. అందులో క్లాసు జరపండి. 3 అడుగులు అనగా కేవలం కూర్చునేే స్థలమే కదా. ఆసనము 3 అడుగులు మాత్రమే ఉంటుంది. 3 అడుగుల నేల పై ఎవరైనా కూర్చొని మంచి రీతిగా అర్థము చేసుకొని వెళ్తారు. ఎవరైనా వస్తే ఆసనము పై కూర్చోబెట్టి తండ్రి పరిచయమునిస్తారు. బ్యాడ్జిలు కూడా చాలా తయారు చేయిస్తున్నారు. సేవ కొరకు ఇది చాలా సింపుల్‌ సాధనము. చిత్రాలు కూడా బాగున్నాయి. అందులో పూర్తి వివరముంది. వీటితో సేవ చాలా బాగా జరుగుతుంది. రోజురోజుకు అనేక ఆపదలు వస్తూ ఉంటాయి. దీని వలన మనుష్యులకు వైరాగ్యము కూడా కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మనము అవినాశి ఆత్మలము. మన అవినాశి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ జన్మ-జన్మాంతరాల పాపాలన్నీ తొలగిపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని పూర్తిగా ప్రేమించాలి. దేహాభిమానములోకి రాకండి. అయితే పిల్లలు మొదలైనవారితో బాహ్య సంబంధమైన ప్రేమ కలిగి ఉండండి. కానీ ఆత్మిక సత్యమైన ప్రేమ ఆత్మిక తండ్రితో ఉండాలి. వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. బంధు-మిత్రులను, పిల్లలను మొదలైన వారిని చూస్తున్నా మీ బుద్ధిలో తండ్రి స్మృతి మెదులుతూ ఉండాలి. పిల్లలైన మీరు స్మృతి అనే ఉరితాడు పై వ్రేలాడుతున్నట్లుండాలి. ఆత్మలు తమ తండ్రి అయిన పరమాత్మను మాత్రమే స్మృతి చేయాలి. బుద్ధి పైన వ్రేలాడుతూ ఉండాలి. తండ్రి ఇల్లు కూడా పైన ఉంది కదా. మూలవతనము, సూక్ష్మవతనము, ఇది స్థూలవతనము. ఇప్పుడు మళ్లీ వాపసు వెళ్లాలి.
ఇప్పుడు మీ యాత్ర పూర్తి అయింది. ఇప్పుడు మీరు యాత్ర నుండి వాపసు వస్తున్నారు. కనుక మీ ఇల్లు ఎంత ప్రియమనిపిస్తుంది! అది అనంతమైన ఇల్లు. వాపసు మన ఇంటికి వెళ్లాలి. మనుష్యులు ఇంటికి వెళ్లేందుకు భక్తి చేస్తారు. కానీ పూర్తి జ్ఞానము లేకుంటే ఇంటికి వెళ్లలేరు. భగవంతుని వద్దకు వెళ్లేందుకు లేక నిర్వాణ ధామానికి వెళ్లేందుకు తీర్థ యాత్రలు మొదలైనవి ఎన్నో చేస్తారు, ఎంత శ్రమ చేస్తారు! సన్యాసులు కేవలం శాంతి కొరకు మాత్రమే దారి తెలుపుతారు. సుఖధామము గురించి వారికి తెలియనే తెలియదు. సుఖధామానికి దారి కేవలం తండ్రి ఒక్కరు మాత్రమే తెలిపిస్తారు. మొదట తప్పకుండా నిర్వాణధామము లేక వానప్రస్థములోకి వెళ్లాలి. దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. వారు బ్రహ్మతత్వమునే ఈశ్వరుడని భావించి ఉన్నారు. ఆత్మలమైన మనము బిందువులము. మన నివాస స్థానము బ్రహ్మాండము. మీకు కూడా పూజ జరుగుతుంది కదా. ఇప్పుడు బిందువును ఎలా పూజిస్తారు? పూజించినప్పుడు సాలిగ్రాములను తయారు చేసి ఒక్కొక్క ఆత్మను పూజిస్తారు. బిందువునెలా పూజిస్తారు? అందువలన పెద్ద పెద్దవిగా సాలిగ్రామాలను తయారు చేస్తారు. తండ్రికైతే తమ శరీరము లేనే లేదు. ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు. చిత్రాలలో కూడా మీరు పెద్ద రూపంగా చూపవలసి వచ్చింది. బిందువునెలా అర్థము చేసుకుంటారు. అందుకని నక్షత్రంగా తయారు చేయాలి. ఇటువంటి (నక్షత్రము వంటి) తిలకమును కూడా చాలా మంది మాతలు ధరిస్తారు. తెల్లవి రెడిగా లభిస్తాయి. ఆత్మ కూడా తెల్లగా నక్షత్రము వలె ఉంటుంది కదా. ఇది కూడా ఆత్మకు ఒక గుర్తు. భృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. అయితే దీని అర్థము ఎవ్వరికీ తెలియదు. ఇంత చిన్న ఆత్మలో ఎంత జ్ఞానముందో తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇన్ని బాంబులు మొదలైనవి ఎన్నో తయారు చేస్తూ ఉంటారు. అద్భుతము కదా. ఆత్మలో ఇంత పాత్ర నిండి ఉంది. ఇవి చాలా నిగూఢమైన విషయాలు. ఇంత చిన్న ఆత్మ శరీరము ద్వారా ఎంత పని చేస్తుంది! ఆత్మ అవినాశి. దాని పాత్ర ఎప్పుడూ నశించదు, మార్పు చెందదు. ఇప్పుడు వృక్షము చాలా పెద్దదిగా ఉంది. సత్యయుగములో చాలా చిన్న వృక్షముంటుంది. పాతవి ఉండవు. మధురమైన చిన్న వృక్షము ఇప్పుడు అంటు కట్టబడ్తూ ఉంది. మీరు పతితులుగా ఉండినారు. ఇప్పుడు మళ్లీ పావనంగా అవుతున్నారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది! ఇది ప్రాకృతికము. అవినాశి పాత్ర నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ సమాప్తమవ్వదు. ఆత్మ అవినాశి వస్తువు. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది అద్భుతము కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! దేహీ-అభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, ఇందులోనే శ్రమ ఉంది. ఎక్కువగా మీ పాత్రనే ఉంది. బాబాకు మీకున్నంత పాత్ర లేదు.
తండ్రి చెప్తున్నారు - మీరు స్వర్గములో సుఖంగా ఉంటే నేను విశ్రాంతిలో(శాంతిధామంలో) కూర్చుండిపోతాను. నాకు అక్కడ ఏ పాత్రా లేదు. ఈ సమయంలో ఇంత సేవ చేస్తాను కదా. ఈ జ్ఞానము ఇంత అద్భుతమైనది. మీరు తప్ప ఇతరులెవ్వరికీ కొంచెము కూడా తెలియదు. తండ్రి స్మృతిలో లేకుంటే ధారణ కూడా జరగదు. ఆహార-పానీయాలలో వ్యత్యాసము వస్తే ధారణలో తేడా వచ్చేస్తుంది. ఇందులో చాలా మంచి పవిత్రత ఉండాలి. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వము పొందాలి. అందుకే బాబా ''మీ వద్ద కూడా చిత్రాలుంచుకోండి'' అని అన్నారు. యోగమును గురించిన చిత్రాలు, వారసత్వమును గురించిన చిత్రాలు తయారుచేస్తే నషా ఉంటుంది. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాము. తర్వాత మళ్లీ మనము దేవతల నుండి క్షత్రియులుగా అవుతాము. బ్రాహ్మణులు పురుషోత్తమ సంగమ యుగానికి చెందినవారు. మీరు పురుషోత్తములుగా అవుతారు కదా. మనుష్యుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోబెట్టేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది. రోజురోజుకు జ్ఞానమును ఎంతగా అర్థము చేసుకుంటూ ఉంటారో అంత సంతోషము కూడా వృద్ధి చెందుతుంది.
బాబా మనకు చాలా కళ్యాణము చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. కల్ప-కల్పము మనకు ఉన్నతమయ్యే కళ ఉంటుంది. ఇక్కడ ఉండి శరీర నిర్వహణ కొరకు అన్ని పనులు చేయవలసి వస్తుంది. మేము శివబాబా భండారము నుండి భుజిస్తున్నామని బుద్ధిలో ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే కాలకంటకాలన్నీ(కష్టాలన్నీ) దూరమైపోతాయి. తర్వాత ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్లిపోతారు. బాబా ఏమీ తీసుకోరని పిల్లలకు తెలుసు. వారు దాత. తండ్రి చెప్తున్నారు - నా శ్రీమతాన్ని అనుసరించండి. మీరు ధనము ఎవరికి దానము చేయాలనే విషయము పై పూర్తి గమనముంచాలి. ఎవరికైనా ధనము దానము ఇస్త్తే, వారు వెళ్లి సారాయి మొదలైనవి తాగి చెడుకర్మలు చేస్తే ఆ పాపము మీ పైకి వచ్చేస్తుంది. పాపాత్మలతో ఇచ్చి-పుచ్చుకుంటూ పాపాత్మలుగా అయిపోతారు. ఎంత తేడా ఉంది! పాపాత్మలు, పాపాత్మలతో ఇచ్చి - పుచ్చుకుంటూ పాపాత్మలుగా అయిపోతారు. ఇక్కడ మీరు పుణ్యాత్మలుగా అవ్వాలి. అందువలన పాపాత్మలతో ఇచ్చి పుచ్చుకోరాదు. తండ్రి చెప్తున్నారు - ఇతరులెవ్వరికీ దు:ఖమివ్వరాదు. ఎవ్వరిలోను మోహముంచరాదు. తండ్రి కూడా శ్యాక్రిన్‌గా తయారై వస్తారు. పనికిరాని పాతదంతా తీసుకుంటారు. ఎంత వడ్డీ ఇస్తారో చూడండి. చాలా పెద్ద వడ్డీ లభిస్తుంది. ఎంత అమాయకుడు(భోలా)! రెండు పిడికెళ్లకు బదులు భవనాలు ఇచ్చేస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
పరస్పరంలో బ్రాహ్మణుల భాష అవ్యక్త భాషగా ఉండాలి. ఎవరి తప్పులైనా వినబడి ఉంటే వాటిని సంకల్పంలో కూడా స్వీకరించరాదు, ఇతరులచే స్వీకరింపజేయరాదు. సంఘటనలో పరస్పరము విశేషంగా అవ్యక్త అనుభవాలను ఇచ్చి - పుచ్చుకోవాలి.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు యాత్ర పూర్తి అయింది. వాపసు ఇంటికి వెళ్లాలి. కనుక ఈ పాత ప్రపంచము పై అనంతమైన వైరాగ్యముతో బుద్ధియోగాన్ని తండ్రి స్మృతిలో పైన వ్రేలాడదీయాలి.
2. సంగమ యుగములో తండ్రి ఏ యజ్ఞమునైతే రచించారో, ఈ యజ్ఞాన్ని సంభాళించేందుకు సత్య సత్యమైన పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి. పనిపాటలు చేసుకుంటూ తండ్రి స్మృతిలో ఉండాలి.

వరదానము :- '' మీ సర్వ ఖజానాలను ఇతర ఆత్మల సేవలో ఉపయోగించి సహయోగులుగా అయ్యే సహజయోగీ భవ ''
సహజయోగులుగా అయ్యేందుకు సాధనం - సదా స్వయాన్ని సంకల్పం ద్వారా, వాణి ద్వారా, ప్రతి కర్మ ద్వారా విశ్వములోని సర్వ ఆత్మల పట్ల 'నేను సేవాధారిని' అని భావించి సర్వస్వము సేవలో ఉపయోగించాలి. బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా ప్రాప్తించిన గుణాలు, జ్ఞానము, శ్రేష్ఠ సంపాదన చేసుకునే సమయ ఖజానాలను సేవలో ఉపయోగించండి అనగా సహయోగులుగా అయితే సహజయోగులుగా అవ్వనే అవుతారు. అయితే ఎవరైతే సంపన్నంగా ఉంటారో, వారే సహయోగులుగా అవ్వగలరు. సహయోగులుగా అవ్వడమంటే మహాదానులుగా అవ్వడం.

స్లోగన్‌ :- '' బేహద్‌ వైరాగులుగా అయితే ఆకర్షింపబడే అన్ని సంస్కారాలు సహజంగానే సమాప్తమౌతాయి. ''

No comments:

Post a Comment