Sunday, February 23, 2020

Telugu Murli 24/02/2020

24-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - మీరు చాలా పెద్ద వజ్రాల వ్యాపారులు, మీరు అవినాశి జ్ఞాన రత్నాలనే సంపదనిచ్చి అందరినీ శ్రీమంతులుగా చేయాలి ''

ప్రశ్న:- మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకునేందుకు ఏ విషయము గురించి చాలా చాలా జాగ్రత్త వహించాలి ?
జవాబు:- సాంగత్య విషయములో పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి. ఎవరైతే బాగా వర్షిస్తారో, పిల్లలు వారి సాంగత్యములోనే ఉండాలి. ఎవరు వర్షించరో, వారి సాంగత్యములో ఉండడం వలన లాభమేముంది! సాంగత్య దోషము చాలా ఉంటుంది. కొందరి సాంగత్యము ద్వారా వజ్ర సమానంగా అవుతారు, కొందరి సాంగత్యము ద్వారా రాయి సమానంగా అవుతారు. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు ఇతరులను తప్పకుండా తమ సమానంగా చేస్తారు. చెడు సాంగత్యము నుండి తమను తాము సంభాళన చేసుకుంటారు.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఈ సమస్త సృష్టి మరియు మొత్తం డ్రామాల జ్ఞానము చాలా బాగా బుద్ధిలో గుర్తుంది. వ్యత్యాసము కూడా బుద్ధిలో ఉంది. సత్యయుగములో అందరూ శ్రేష్ఠాచారులుగా, నిర్వికారులుగా, పావనంగా, సంపన్నంగా ఉండేవారని బుద్ధిలో పక్కాగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచము భ్రష్ఠాచారిగా, వికారిగా, పతితంగా, భికారిగా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమ యుగములో ఉన్నారు. మీరు ఆ తీరానికి వెళ్తున్నారు. నది, సాగరాల మిలనము ఎక్కడ జరుగుతుందో దానిని 'సంగమము' అని అంటారు. ఒకవైపు మంచినీరు, మరొక వైపు ఉప్పునీరు ఉంటాయి. ఇప్పుడిది కూడా సంగమమే. సత్యయుగములో లక్ష్ష్మినారాయణుల రాజ్యముండేది తర్వాత చక్రము ఎలా తిరిగిందో మీకు తెలుసు. ఇది సంగమ సమయము. కలియుగాంతములో అందరూ దు:ఖితులుగా ఉన్నారు. దీనిని అడవి అని అంటారు. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ల నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఈ స్మృతి పిల్లలైన మీకు ఉండాలి. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నామనే స్మృతి బుద్ధిలో ఉంచుకోవాలి. 84 జన్మల కథ చాలా సాధారణమైనది. సులభంగా అర్థము చేసుకోవచ్చు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయని మీరు అర్థము చేసుకున్నారు. మనము ఇప్పుడు సత్యయుగమనే తోటలోకి వెళ్తున్నామని మీ బుద్ధిలో తాజాగా ఉంది. ఇప్పుడు మన జన్మ మృత్యులోకములో జరగదు, అమరలోకములో జన్మ తీసుకుంటాము. శివబాబాను అమరనాథుడని కూడా అంటారు. వారు మనకు అమరకథను వినిపిస్తున్నారు. అక్కడ మనము శరీరములో ఉంటున్నా అమరులుగా ఉంటాము. సమయం వచ్చినప్పుడు సంతోషంగా శరీరాలను వదిలేస్తాము. దానిని మృత్యులోకమని అనరు. మీరు ఈ విషయాలు ఎవరికైనా అర్థం చేయిస్తే వీరిలో పూర్తి జ్ఞానముందని భావిస్తారు. సృష్టికి ఆదిమధ్యాంతాలు ఉన్నాయి కదా. చిన్న బిడ్డ కూడా యువకునిగా, వృద్ధునిగా అవుతాడు తర్వాత అంతిమ సమయము వచ్చేస్తుంది. మళ్లీ చిన్నబిడ్డగా అవుతాడు. సృష్టి కూడా మొదట కొత్తదిగా ఉంటుంది, తర్వాత 1/4 భాగము పాతదిగా, తర్వాత 1/2 భాగము పాతదిగా తర్వాత పూర్తి పాతదిగా అయిపోతుంది. మళ్లీ కొత్తదిగా అవుతుంది. ఈ విషయాలన్నీ వేరెవ్వరూ ఇతరులకు అర్థం చేయించలేరు. ఇలాంటి చర్చ ఎవ్వరూ చెయ్యలేరు. బ్రాహ్మణులైన మీకు తప్ప వేరెవ్వరికీ ఆత్మిక జ్ఞానము లభించదు. బ్రాహ్మణ వర్ణము(కులము)లో వచ్చినప్పుడే వినగలరు. ఈ విషయాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరు యథార్థ రీతిగా అర్థం చేయించగలరు, కొందరు అర్థం చేయించలేరు. కనుక వారికి ఏమీ లభించదు. వజ్రాల వ్యాపారులలో కూడా కొందరి వద్ద కోట్ల రూపాయలు విలువ చేసే రత్నాలుంటాయి. కొందరి వద్ద పది వేల రూపాయలు విలువ చేసే రత్నాలు కూడా ఉండవు. మీలో కూడా అలాగే ఉన్నారు. ఉదాహరణకు ఈ జనక్(జానకి దాది) మంచి వజ్రాల వ్యాపారి. ఈమె వద్ద అమూల్యమైన రత్నాల రాశి ఉంది. ఎవరికైనా ఇచ్చి వారిని మంచి ధనవంతులుగా చేయగలదు. కొందరు చిన్న వజ్రాల వ్యాపారులుగా ఉంటారు. వారు ఎక్కువగా ఇవ్వలేరు. కనుక వారి పదవి కూడా తగ్గిపోతుంది. మీరందరూ వజ్రాల వ్యాపారులు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల మణుల రాశి. ఎవరి వద్ద మంచి రత్నాలుంటాయో, వారు శ్రీమంతులుగా అవుతారు, ఇతరులను కూడా అలా చేస్తారు. అందరూ మంచి వజ్రాల వ్యాపారులుగా అవుతారని కాదు. మంచి-మంచి రత్నాలను ఇవ్వగలిగినవారిని పెద్ద పెద్ద సేవాకేంద్రాలకు పంపిస్తారు. గొప్ప వ్యక్తులకు మంచి-మంచి రత్నాల రాశి ఇవ్వబడ్తుంది. పెద్ద పెద్ద దుకాణాలలో మంచి వజ్రాల నిపుణులు ఉంటారు. బాబాను కూడా సౌదాగర్(వ్యాపారి), రత్నాగర్(రత్నాల వ్యాపారి) అని అంటారు. వారు రత్నాల వ్యాపారము చేస్తారు, బాబా ఇంద్రజాలికుడు కూడా అయ్యారు. ఎందుకంటే వారి వద్దనే దివ్యదృష్టి అను తాళంచెవి ఉంది. ఎవరైనా నవవిధ(తీవ్రమైన) భక్తి చేస్తే వారికి సాక్షాత్కారాలు అవుతాయి. ఇక్కడ అలాంటి విషయాలేవీ లేవు. ఇక్కడ అనాయాసంగా ఇంట్లో కూర్చొని ఉన్నా చాలామందికి సాక్షాత్కారాలవుతాయి. రోజురోజుకు సహజమవుతూ ఉంటుంది. కొంతమందికి బ్రహ్మ సాక్షాత్కారము, కృష్ణుని సాక్షాత్కారాలు కూడా అవుతాయి. ''బ్రహ్మ వద్దకు వెళ్లండి, వెళ్లి వారి వద్ద రాకుమారులుగా అయ్యే చదువును చదువుకోండి'' అని వారికి సాక్షాత్కారములో చెప్తారు. ఈ పవిత్రమైన రాకుమార-రాకుమారీలు ఉంటారు కదా. రాకుమారుని పవిత్రమైన వారు అని కూడా అనవచ్చు. పవిత్రత ద్వారా జన్మ జరుగుతుంది కదా. పతితులను భ్రష్ఠాచారులని అంటారు. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఇది బుద్ధిలో ఉండాలి. దీనిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. వీరు చాలా వివేకవంతులని మనుష్యులు భావిస్తారు. మా వద్ద ఏ శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానము లేదు, ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారని వారికి చెప్పండి. వీరు త్రిమూర్తులు అంటే బ్రహ్మ-విష్ణు-శంకరులు. వీరు కూడా వారి రచనయే. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. వారు హద్దులోని రచయితలు(తండ్రులు). కాని వీరు అనంతమైన తండ్రి, అనంతమైన రచయిత. బాబా కూర్చుని చదివిస్తారు. శ్రమపడవలసి ఉంటుంది. బాబా సుగంధ పుష్పాలుగా తయారుచేస్తారు. మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. బాబా మిమ్ములను పవిత్రంగా చేస్తారు. మళ్లీ ఒకవేళ అపవిత్రంగా అయితే కులకళంకితులుగా అవుతారు. బాబాకు తెలుస్తుంది కదా. తర్వాత ధర్మరాజు ద్వారా చాలా శిక్షలనిప్పిస్తారు. వారు తండ్రితో పాటు ధర్మరాజు కూడా. ధర్మరాజు కర్తవ్యము కూడా ఇప్పుడు పూర్తి అవుతుంది. సత్యయుగములో ఉండనే ఉండదు. మళ్లీ ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది. బాబా కూర్చొని కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తున్నారు. వీరు వెనుకటి జన్మలో అటువంటి కర్మ చేసిన కారణంగా ఇప్పుడు దానిని అనుభవిస్తున్నారు అని అంటారు కదా. సత్యయుగములో అలా అనరు. చెడు కర్మల నామ-రూపాలు కూడా అక్కడ ఉండవు. ఇక్కడ మంచి-చెడు రెండూ ఉన్నాయి, సుఖ-దు:ఖాలు రెండూ ఉన్నాయి కాని సుఖము చాలా తక్కువగా ఉంది. అక్కడ దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. సత్యయుగములో దు:ఖము ఎక్కడ నుండి వస్తుంది! మీరు బాబా నుండి నూతన ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా దు:ఖహర్త-సుఖకర్త. దు:ఖము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా మీకు తెలుసు. శాస్త్రాలలో కల్పము ఆయువును చాలా ఎక్కువగా వ్రాసేశారు. అర్ధకల్పము మన దు:ఖము హరించబడ్తుంది. మనము సుఖాన్ని పొందుతాము అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో అర్థం చేయించడం చాలా సహజము. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. లక్షల సంవత్సరాలని చెప్పడం వలన అన్ని విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి.

ఇది 5 వేల సంవత్సరాల చక్రమని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సూర్యవంశీ - చంద్ర వంశీయుల రాజ్యము ఉండేదనే విషయము నిన్నటిది. బ్రాహ్మణుల పగలు అని అంటారు కాని శివబాబా పగలు అని అనరు. బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి. బ్రాహ్మణులు తర్వాత భక్తిమార్గములోకి వస్తారు. ఇది సంగమ సమయము. పగలూ కాదు, రాత్రీ కాదు. బ్రాహ్మణులమైన మనము దేవతలుగా అవుతాము, మళ్లీ త్రేతాయుగంలో క్షత్రియులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో బాగా గుర్తుంచుకోండి. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో ఇంత ఆయువని వ్రాశారు, మీరు ఈ లెక్క ఎక్కడి నుండి తెచ్చారు? అని వారు అడుగుతారు. ఇది తయారైన అనాది డ్రామా అని ఎవ్వరికీ తెలియదు. అర్ధకల్పము సత్య, త్రేతా యుగాలు, మళ్లీ అర్ధము నుండి భక్తి ప్రారంభమౌతుందని మీ బుద్ధిలో ఉంది. అది త్రేతా, ద్వాపర యుగాల సంగమమవుతుంది. ద్వాపరంలో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి నెమ్మది నెమ్మదిగా తయారవుతాయి. వృక్షము ఎలాగైతే పెద్దదిగా, పొడవుగా ఉంటుందో అలా భక్తిమార్గ సామాగ్రి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని బీజము బాబాయే. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. మొట్టమొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మము ఉంటుంది. బాబా అర్థం చేయించే ఈ విషయాలు పూర్తి నూతనమైనవి. ఈ దేవీదేవతా ధర్మ స్థాపకుని గురించి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు చిన్న బాలుడు. జ్ఞానము వినిపించేవారు తండ్రి. తండ్రి పేరుకు బదులు కొడుకు పేరు వేసేశారు. కృష్ణుని చరిత్రను చూపించారు. లీలలు కృష్ణునివి కాదు అని బాబా చెప్తారు. ఓ ప్రభూ, నీ లీలలు అపారమని గానము చేస్తారు. లీలలు ఒక్కరివే ఉంటాయి. శివబాబా మహిమ చాలా భిన్నమైనది. వారు సదా పావనులు. కాని వారు పావన శరీరములో రాలేరు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయండి అని వారినే పిలుస్తారు. కనుక నేను కూడా పతిత ప్రపంచములోనే రావలసి ఉంటుందని, ఇతని అనేక జన్మల అంతిమములో వచ్చి ప్రవేశిస్తానని తండ్రి చెప్తున్నారు. కనుక ముఖ్యమైన విషయము - బాబాను స్మృతి చేయడం మిగిలినదంతా ప్రాముఖ్యత లేని విస్తారమని తండ్రి చెప్తారు. అందరూ ధారణ చేయలేరు. ఎవరు ధారణ చేయగలరో వారికి అర్థము చేయిస్తాను. పోతే ముఖ్యమైనది 'మన్మనాభవ' అని చెప్తాను. బుద్ధి నంబరువారుగా ఉంటుంది కదా. కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి, కొన్ని కొద్దిగా వర్షించి వెళ్లిపోతాయి. మీరు కూడా మేఘాల వంటి వారే కదా. కొందరు అసలు వర్షించనే వర్షించరు. జ్ఞానాన్ని నింపుకునే శక్తి ఉండదు. మమ్మా, బాబా మంచి మేఘాలు కదా. ఎవరు బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలో ఉండాలి. ఎవరు వర్షించరో వారి సాంగత్యంలో ఉండడం వలన ఏం జరుగుతుంది? సాంగత్య దోషము కూడా చాలా ఉంటుంది. కొందరి సాంగత్యము ద్వారా వజ్ర సమానంగా అవుతారు. కొందరి సాంగత్యము ద్వారా రాయి సమానంగా అవుతారు. మంచి వారి వెనుక వెనుకనే ఉండాలి. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు తమ సమానం పుష్పాలుగా చేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా, యోగులుగా అయ్యారో వారి సాంగత్యంలో ఉండాలి. అలాగని మేము ఫలానా వారి తోక పట్టుకొని తీరానికి చేరుకుంటామని భావించకండి. ఇలా చాలామంది అంటారు. కాని ఇక్కడ అలాంటి మాటేమీ లేదు. విద్యార్థి ఎవరి తోకనైనా పట్టుకోవడం వలన పాస్ అవుతాడా! చదవవలసి ఉంటుంది కదా. తండ్రి కూడా వచ్చి జ్ఞానాన్నిస్తారు. ఈ సమయంలో జ్ఞానమునివ్వాలని వారికి తెలుసు. భక్తిమార్గములో నేను వెళ్లి జ్ఞానాన్ని ఇవ్వాలి అని వారి బుద్ధిలో ఉండదు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. బాబా ఏమీ చేయరు. డ్రామాలో దివ్యదృష్టి లభించే పాత్ర ఉంటే సాక్షాత్కారమవుతుంది. అలాగని నేను కూర్చొని సాక్షాత్కారము చేయిస్తానని అనుకోకండి. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఎవరన్నా దేవీ సాక్షాత్కారము అవ్వాలనుకుంటే ఆ దేవి వచ్చి చేయించదు కదా. ఓ భగవంతుడా! మాకు సాక్షాత్కారము చేయించండి అని అడుగుతారు. డ్రామాలో నిర్ణయించబడి ఉంటే తప్పకుండా జరుగుతుంది, నేను కూడా డ్రామాలో బంధితుడనై ఉన్నానని బాబా చెప్తారు.

బాబా చెప్తున్నారు - నేను ఈ సృష్టిలోకి వచ్చి ఉన్నాను, ఇతని నోటి ద్వారా నేను మాట్లాడ్తున్నాను, ఇతని కళ్ల ద్వారా మిమ్ములను చూస్తున్నాను. ఒకవేళ ఈ శరీరము లేకుంటే ఎలా చూడగలను? పతిత ప్రపంచములోనే నేను రావలసి ఉంటుంది. స్వర్గములో నన్ను పిలువనే పిలువరు. నన్ను సంగమ యుగములోనే పిలుస్తారు. ఎప్పుడైతే సంగమ యుగములో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూస్తాను. నిరాకార రూపంలో ఏమీ చూడలేను. అవయవాలు లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. శరీరము లేకుండా నేను ఎలా చూడగలను, శబ్ధము ఎలా చెయ్యగలను? అని తండ్రి అంటారు. ఈశ్వరుడు అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారని వారు అంటారు. ఇది గుడ్డి నమ్మకము. మరి ఎలా చూడగలరు? ఎప్పుడైతే అవయవాలు లభిస్తాయో అప్పుడే చూడగలరు కదా. మంచి పనులు గాని, చెడు పనులు గాని అందరూ డ్రామానుసారము చేస్తారని, అంతా నిర్ణయించబడి ఉందని బాబా చెప్తారు. నేను ఇన్ని కోట్లమంది మనుష్యుల లెక్కాచారాలను చూస్తానా? నాకు శరీరమున్నప్పుడే ఏదైనా చేయగలను. చేసి చేయించేవారని కూడా అప్పుడే అంటారు. లేకుంటే అలా అనలేరు. నేను ఎప్పుడు వీరిలో వస్తానో అప్పుడే పావనంగా చేస్తాను. ఆత్మ పైన ఉన్నప్పుడు ఏమి చేస్తుంది? శరీరము ద్వారానే పాత్రను అభినయము చేస్తుంది కదా. నేను కూడా ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తాను. సత్యయుగములో నా పాత్ర లేదు. పాత్ర లేకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. శరీరము లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. ఆత్మను పిలవడం జరుగుతుంది. అది కూడా శరీరములోకి వచ్చే మాట్లాడ్తుంది కదా. అవయవాలు లేకుండా ఏమీ చెయ్యలేదు. ఇది విస్తృతమైన వివరణ. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యడమే ముఖ్యమైన విషయము. అనంతమైన తండ్రి ఇంత శ్రేష్ఠమైనవారు, వారి నుండి ఆస్తి ఎప్పుడు లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. దు:ఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి(దు:ఖహర్త-సుఖకర్త) అని పిలుస్తారు. కాని అది ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు వింటున్నారు. మేము అమరులుగా అవుతున్నాము, అమరలోకానికి వెళ్తున్నామని మీకిప్పుడు తెలుసు. మీరు అమరలోకానికి ఎన్నిసార్లు వెళ్లారు - అనేకసార్లు. దీనికి ఎప్పుడూ అంతము ఉండదు. మోక్షము లభించదా? అని చాలామంది అడుగుతారు. లభించదు అని వారికి చెప్పండి. ఇది అనాది అవినాశి డ్రామా. ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఈ అనాది చక్రము సదా తిరుగుతూనే ఉంటుంది. ఈ సమమంలో వీరు సత్యమైన సాహెబ్(ప్రభువు)ను తెలుసుకున్నారు. మీరు సన్యాసులు కదా. ఆ ఫకీరులు(బైరాగులు) కాదు. సన్యాసులను కూడా ఫకీరులని అంటారు. మీరు రాజఋషులు, ఋషులను సన్యాసులని అంటారు. ఇప్పుడు మళ్లీ మీరు ధనవంతులుగా అవుతారు. భారతదేశము ఎంత సంపన్నభరితంగా ఉండేది. ఇప్పుడు ఎలా పేదదిగా అయిపోయింది! అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వమునిస్తారు. బాబా మీరు ఏం ఇస్తారో, అది ఎవరూ ఇవ్వలేరు, మీరు మమ్ములను విశ్వాధికారులుగా చేస్తారు, దానిని ఎవరూ దోచుకోలేరు అని పాట కూడా ఉంది. ఇలాంటి పాటలను తయారు చేసేవారు అర్థమును గురించి ఆలోచించరు. అక్కడ విభజనలు మొదలైనవి ఏవీ ఉండవని మీకు తెలుసు. ఇక్కడ ఎన్ని విభజనలున్నాయి. అక్కడ భూమి, ఆకాశము అన్నీ మీవిగా ఉంటాయి. కనుక పిల్లలకు అంత ఖుషీ ఉండాలి కదా. శివబాబా అర్థం చేయిస్తున్నారని సదా గుర్తుంచుకోండి ఎందుకంటే వారు ఎప్పుడూ శెలవు తీసుకోరు. ఎప్పుడూ అనారోగ్యము పాలు అవ్వరు. శివబాబా స్మృతియే ఉండాలి. వారిని నిరహంకారులని అంటారు. నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని అహంకారము రాకూడదు. సర్వీసు చేయడం మీ కర్తవ్యము, ఇందులో అహంకారము రాకూడదు. అహంకారము వస్తే క్రింద పడిపోతారు. సర్వీసు చేస్తూ ఉండండి. ఇది ఆత్మిక సేవ. మిగిలినదంతా దైహికమైనవి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి చదివించిన దానికి ప్రతిఫలంగా సుగంధ పుష్పాలుగా అయి చూపించాలి, శ్రమ పడాలి. ఎప్పుడూ ఈశ్వరీయ కులము పేరును పాడు చేయరాదు. ఎవరైతే జ్ఞానవంతులుగా, యోగులుగా ఉంటారో వారి సాంగతములోనే ఉండాలి.
2. నేను (మై పన్/అహంకారము) త్యాగము చేసి నిరహంకారులుగా అయి ఆత్మిక సేవ చేయాలి. ఇది మా కర్తవ్యమని భావించాలి. అహంకారములోకి రాకూడదు.

వరదానము:- '' మీ ఫరిస్తా రూపము ద్వారా అందరికి వారసత్వ అధికారమునిప్పించే ఆకర్షణ మూర్త్ భవ ''
ఎటువంటి ఫరిస్తా స్వరూప చమ్కీలీ డ్రస్సును ధరించాలంటే దూర దూరాలలో ఉన్న ఆత్మలను మీ వైపు ఆకర్షించాలి. అంతేకాక అందరినీ భికారితనము నుండి విడిపించి వారసత్వానికి అధికారులుగా చేయాలి. అందుకు జ్ఞానమూర్తులు, స్మృతిమూర్తులు మరియు సర్వ దివ్యగుణ మూర్తులుగా అయి ఎగిరేకళలో స్థితమై ఉండే అభ్యాసాన్ని పెంచుతూ ఉండండి. మీ ఎగిరేకళయే అందరికి నడస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తాల నుండి దేవతా స్వరూపాన్ని సాక్షాత్కారము చేయిస్తుంది. ఇదే వరదాత స్థితి.

స్లోగన్:- '' ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ స్థితిలో స్థితమై ఉండండి.''

1 comment:

  1. Do this hack to drop 2lb of fat in 8 hours

    At least 160,000 women and men are losing weight with a simple and SECRET "liquid hack" to lose 2lbs every night as they sleep.

    It's painless and works every time.

    You can do it yourself by following these easy steps:

    1) Take a drinking glass and fill it up half the way

    2) And then follow this amazing HACK

    so you'll be 2lbs skinnier the very next day!

    ReplyDelete