Saturday, January 18, 2020

Telugu Murli 18/01/2020

18-01-20      ప్రాత:మురళిఓంశాంతి   "బాప్దాదా" మధువనం     ఉదయయు

యధు௠ాతి యధు௠యైఠ ఆత్యిక పి௢్௢௢కు ఏ ௥ిధయైఠ తండ్௠ి ௢భించా௠ంఠే - ௥ా௠ు ఏయీ తీ௨ుకో௠ు, ఏదీ పితాశ్రీగారి పుణ్యస్మృతి దినాన ప్రాతః(ఉదయము) క్లాసులో వినిపించేందుకు బాప్దాదాగారి మధుర అమూల్యమైన మహావాక్యాలు మధురమైన పిల్లలారా - మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి, మీరు దేవతలుగా అవుతున్నారు కనుక మీ లక్ష్యము, లక్షణాలు చెప్పడం, చేయడం సమానంగా చేసుకోండి ''
గీతము:- మిమ్ములను పొంది పూర్తి ప్రపంచాన్నే పొందుకున్నాము,......( తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా హై,........)
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఇప్పుడింకా కొంతమంది పిల్లలే ఉన్నారు. తర్వాత అనేకమంది అవుతారు. ప్రజాపిత బ్రహ్మను గురించి అందరూ తెలుసుకోవాలి కదా. అన్ని ధర్మాల వారు గౌరవిస్తారు. ఆ లౌకిక తండ్రి కూడా హద్దు బ్రహ్మయే అని బాబా అర్థం చేయించారు. వారి ఇంటి పేరుతో వారి వంశము తయారవుతుంది. కానీ ఇతను అనంతమైన బ్రహ్మ. ఇతని పేరే ప్రజాపిత బ్రహ్మ. ఆ హద్దు బ్రహ్మ పరిమిత సంఖ్యలో ప్రజలను రచిస్తాడు. కొంతమంది ఇద్దరు, ముగ్గురిని రచిస్తారు, కొంతమంది రచించనే రచించరు. ఈ బ్రహ్మకు సంతానము లేదని అనలేరు. ప్రపంచములోని వారంతా ఇతని సంతానమే. బేహద్ బాప్దాదా ఇరువురికీ మధురాతి మధురమైన పిల్లల పై చాలా ఆత్మిక ప్రేమ ఉంది. పిల్లలను ఎంతో ప్రీతిగా చదివిస్తారు. ఎంతో నీచంగా ఉండేవారిని, ఎంతో ఉన్నతంగా చేస్తారు. కనుక పిల్లలకు ఎంత సంతోష పాదరస మట్టము ఎక్కి ఉండాలి. తండ్రిని నిరంతరము స్మృతి చేస్తూ ఉంటే అపారమైన సంతోషముంటుంది. తండ్రి కల్ప-కల్పము చాలా ప్రేమగా పిల్లలను పావనంగా చేసే సేవ చేస్తారు. 5 తత్వాల సహితంగా అందరినీ పావనంగా చేస్తారు. గవ్వ నుండి వజ్రము వలె తయారు చేస్తారు. ఇది చాలా గొప్ప బేహద్ సేవ. తండ్రి తన పిల్లలకు చాలా ప్రేమతో శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలను సరిదిద్దడం తండ్రి లేక టీచరు కర్తవ్యమే. తండ్రి శ్రీమతము ద్వారా మీరు శ్రేష్ఠంగా అవుతారు. శ్రీమతమును అనుసరిస్తున్నారా లేక మన్మతమును అనుసరిస్తున్నారా? అని కూడా పిల్లలు చార్టులో చూడాలి. శ్రీమతము ద్వారానే మీరు ఆక్యురేట్గా అవుతారు. తండ్రి పై ఎంత ప్రీతి బుద్ధి కలిగి ఉంటారో అంత గుప్త ఖుషీతో నిండుగా ఉంటారు. ''మాకు ఇంత అపారమైన సంతోషముందా'' అని మనసులో ప్రశ్నించుకోండి. అవ్యభిచారీ స్మృతి ఉందా? ఏ ఇతర కోరికా లేదు కదా? ఒక్క తండ్రి స్మృతిలోనే ఉన్నారా? స్వదర్శన చక్రము తిప్పుతూ ఉన్నప్పుడు ప్రాణము శరీరము నుండి వెళ్లిపోవాలి. ఒక్క శివబాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఇదే చివరి మంత్రము.

తండ్రి తన ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు - మధురమైన పిల్లలూ! బాప్దాదాను మీ ముందు చూస్తూ ఉన్నప్పుడు మా బాబా తండ్రియే కాదు, శిక్షకుడు, సద్గురువు కూడా అని తండ్రి మమ్ములను ఈ పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచములోకి తీసుకెళ్తారని బుద్ధిలోకి వస్తుందా? ఈ పాత ప్రపంచమిప్పుడు సమాప్తమవ్వనే అవుతుంది. ఈ ప్రపంచమిప్పుడు దేనికీ పనికి రాదు. తండ్రి కల్ప-కల్పము నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. మేము కల్ప-కల్పము నరుని నుండి నారాయణునిగా అవుతాము, పిల్లలు ఈ విషయాన్ని స్మరణ చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఉండాలి! పిల్లలూ! సమయం చాలా తక్కువగా ఉంది. ఈ రోజెలా ఉంది? రేపు ఏమవుతుంది? ఇది ఈ రోజు, రేపటి ఆట. కనుక పిల్లలు అజాగ్రత్తగా ఉండరాదు. పిల్లలైన మీ నడవడికలు చాలా రాయల్గా ఉండాలి. మా నడవడికలు దేవతల వలె ఉన్నాయా ? దైవీ బుద్ధి ఉందా ? ఏ లక్ష్యముందో అలా తయారవుతున్నానా లేక కేవలం చెప్పడం వరకేనా ? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఏ జ్ఞానము లభించిందో, ఆ జ్ఞానములో మునిగి మస్త్(ఆనందము)గా ఉండాలి. ఎంత అంతర్ముఖులుగా ఉండి ఈ విషయాల పై ఆలోచిస్తూ ఉంటే అంత సంతోషం ఉంటుంది. ఈ ప్రపంచము నుండి ఆ ప్రపంచములోకి వెళ్లేందుకు ఇక కొంత సమయము మాత్రమే ఉందని కూడా మీకు తెలుసు. ఆ ప్రపంచాన్ని వదిలేసినప్పుడు మళ్లీ వెనుకకు ఎందుకు చూస్తారు? బుద్ధి యోగము అటువైపుకు ఎందుకు వెళ్తుంది? ఇది కూడా బుద్ధితో పని తీసుకోవాలి. ఆవలికి వెళ్లిపోయినప్పుడు మళ్లీ బుద్ధి వెనుకకు ఎందుకు వెళ్తుంది? గతించిన విషయాలను గురించి ఆలోచించకండి. ఈ పాత ప్రపంచము పై ఎలాంటి ఆశ ఉండరాదు. ఇప్పుడు ఒకే ఒక శ్రేష్ఠమైన ఆశను ఉంచుకోవాలి - మేము సుఖధామానికి వెళ్లాలి. ఎక్కడా ఆగరాదు, చూడరాదు. ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒకవైపే చూస్తూ ఉండండి. అప్పుడే అచంచల, స్థిరమైన, కదలని స్థితి ఉంటుంది. సమయము చాలా సున్నితమవుతూ ఉంటుంది. ఈ పాత ప్రపంచ పరిస్థితులు ఇంకా చెడిపోతూనే ఉంటాయి. మీకు దీనితో ఏ సంబంధమూ లేదు. మీ సంబంధము కొత్త ప్రపంచముతోనే ఉండాలి. ఆ కొత్త ప్రపంచమిప్పుడు స్థాపనవుతూ ఉంది. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అయ్యిందని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు ఈ ప్రపంచము సమాప్తమవ్వనే అవుతుంది. దీని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఈ సమయంలో ప్రకృతికి అందరికంటే ఎక్కువగా కోపము వస్తుంది. అందువలన అంతా సమాప్తము చేసేస్తుంది. ఇప్పుడీ ప్రకృతి తన కోపాన్ని చాలా జోరుగా చూపిస్తుందని మీకు తెలుసు. పూర్తి పాత ప్రపంచమునంతా ముంచేస్తుంది. వరదలు వస్తాయి, అగ్ని తగుల్కుంటుంది. మనుష్యులు ఆకలితో మరణిస్తారు, భూకంపాలతో ఇండ్లు, భవనాలు మొదలైనవన్నీ క్రిందపడిపోతాయి. ఈ పరిస్థితులు మొత్తం ప్రపంచానికంతా వస్తాయి. అనేక విధాలుగా మృత్యువు తాండవిస్తుంది. ఎటువంటి గ్యాస్ బాంబులు వేస్తారంటే వాటి దుర్వాసనతోనే మనుష్యులు మరణిస్తారు. ప్లానంతా డ్రామాలో తయారై ఉంది. ఇందులో ఎవరి దోషమూ లేదు. వినాశనము అవ్వనే అవ్వాలి. కనుక మీరు ఈ పాత ప్రపంచము నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించాలి. ఇప్పుడు మీరు '' వాహ్ సద్గురు '' మీరు మాకు ఈ దారి చూపించారు అని అంటారు. మన సత్య-సత్యమైన గురువు బాబా ఒక్కరే. వారి పేరు భక్తిమార్గములో కూడా కొనసాగుతూ వస్తుంది. వారి కర్తవ్యమే 'వాహ్ వాహ్' అని మహిమ చేయబడ్తుంది. పిల్లలైన మీరు 'వాహ్ సద్గురూ వాహ్! వాహ్! మా భాగ్యము వాహ్!, వాహ్! డ్రామా వాహ్! ' అని అంటారు. తండ్రి ఇచ్చిన జ్ఞానముతో మనకు సద్గతి లభిస్తోంది.

పిల్లలైన మీరు విశ్వములో శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయ్యారు. కనుక అందరికీ ఇప్పుడు కొత్త భారతదేశము, కొత్త ప్రపంచము ఎందులో లక్ష్మీనారాయణుల రాజ్యముండేదో అది మళ్లీ స్థాపనవుతూ ఉందని సంతోషము కలిగించే వార్తను అందరికి వినిపించండి. ఈ దు:ఖధామము పరివర్తనై సుఖధామముగా అవుతుంది. మేము సుఖధామానికి యజమానులుగా అవుతున్నామని లోపల ఖుషీ ఉండాలి. అక్కడ మిమ్ములను మీరు సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యము బాగుందా? అని ఎవ్వరూ అడగరు. ఈ విధంగా ఈ ప్రపంచములో అడుగుతారు. ఎందుకంటే ఇది దు:ఖ పూరిత ప్రపంచము. పిల్లలైన మిమ్ములను కూడా ఎవ్వరూ ఈ ప్రశ్నలు అడగలేరు. మేము ఈశ్వరుని పిల్లలము, మీరు మమ్ములనెందుకు క్షేమ సమాచారాలు అడుగుతారు? మేము సదా సంతోషంగా ఉన్నాము. స్వర్గము కంటే ఇక్కడ ఎక్కువ సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే స్వర్గ స్థాపన చేసే తండ్రి లభించారంటే అన్నీ లభించాయి. బ్రహ్మలోకములో ఉండే తండ్రిని గురించిన ఆలోచన ఉండేది, వారు లభించారు. ఇక మేము దేనిని గురించి ఆలోచించాలి? ఈ నషా సదా ఉండాలి. చాలా రాయల్గా, మధురంగా అవ్వాలి. మీ అదృష్టాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు ఇంకా సమయముంది. పదమా పదమ్పతులుగా అయ్యేందుకు ముఖ్య సాధనం - అడుగడుగునా జాగ్రత్తగా నడవాలి. అంతర్ముఖులుగా అవ్వాలి. మేము ఎటువంటి కర్మలు చేస్తామో, మమ్ములను చూచి ఇతరులు కూడా చేస్తారు అని సదా గమనముండాలి. దేహ అహంకారము మొదలైన వికారాల ప్రపంచము అర్ధకల్పము నుండి నాటుతూ వచ్చాము. మొత్తం ప్రపంచమంతటా ఈ బీజముంది. ఇప్పుడు దానిని మాయం చెయ్యాలి. దేహాభిమానమనే బీజమును నాటరాదు. ఇప్పుడు దేహీ- అభిమానమనే బీజాన్ని నాటండి. ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. అత్యంత ప్రియమైన తండ్రి లభించారు. వారినొక్కరినే స్మృతి చెయ్యాలి. తండ్రికి బదులు దేహమును, దేహధారులను స్మృతి చేయడం కూడా తప్పే. మీరు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు, శీతలంగా అయ్యేందుకు చాలా కష్టపడాలి.

మధురమైన పిల్లలూ! మీరిప్పుడు మీ జీవితం పై ఎప్పుడూ విసుగు చెందరాదు. ఈ జీవితం అమూల్యమైనదని మహిమ చేయబడింది. దీనిని కాపాడుకోవాలి కూడా. దీనితో పాటు సంపాదన కూడా చేయాలి. ఇక్కడ ఎన్ని రోజులుంటామో, అన్ని రోజులు తండ్రిని స్మృతి చేసి లెక్కలేనంత సంపాదిస్తూ ఉంటాము. లెక్కాచారాలు చుక్తా అవుతూ ఉంటాయి. అందువలన ఎప్పుడూ విసుక్కోరాదు. పిల్లలు '' బాబా, సత్యయుగము ఎప్పుడు వస్తుంది? '' అని అడుగుతారు. బాబా చెప్తారు - '' పిల్లలూ! మొదట కర్మాతీత స్థితిని తయారు చేసుకోండి. ఎంత సమయము దొరికితే అంత సమయము కర్మాతీతులుగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యండి.'' నిర్మోహులుగా అయ్యేందుకు కూడా పిల్లలకు చాలా ధైర్యముండాలి. బేహద్ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే నిర్మోహులుగా అవ్వవలసి ఉంటుంది. మీ స్థితిని చాలా శ్రేష్ఠంగా తయారు చేసుకోవాలి. తండ్రికి చెందినవారిగా అయినందున తండ్రికి సంబంధించిన అలౌకిక సేవలోనే లగ్నమైపోవాలి. స్వభావము చాలా మధురంగా ఉండాలి. మనుష్యులను వారి స్వభావమే చాలా విసిగిస్తుంది. జ్ఞాన మూడవ నేత్రము ఏదైతే లభించిందో, దాని ద్వారా మిమ్ములను మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ డిఫెక్టు (లోపం) ఉన్నా, దానిని తొలగించుకొని ప్యూర్ డైమండ్గా అవ్వాలి. ఏ కొంచెము దోషముండినా, విలువ తగ్గిపోతుంది. కనుక శ్రమించి స్వయాన్ని విలువైన వజ్రంగా చేసుకోవాలి.

పిల్లలైన మీతో తండ్రి ఇప్పుడు నూతన ప్రపంచ సంబంధము కొరకు పురుషార్థం చేయిస్తారు. మధురమైన పిల్లలూ! ఇప్పుడు బేహద్ తండ్రి మరియు బేహద్ సుఖ వారసత్వాలతో సంబంధము ఉంచుకోండి. బంధనాల నుండి విడిపించి మిమ్ములను అలౌకిక సంబంధములోకి తీసుకెళ్లేవారు అనంతమైన తండ్రి ఒక్కరే. మేము ఈశ్వరీయ సంబంధానికి చెందిన వారమని సదా గుర్తుండాలి. సదా సుఖమునిచ్చేది ఈ ఈశ్వరీయ సంబంధమొక్కటే. అచ్ఛా.

మధురాతి మధురమైన అతి స్నేహి పిల్లలకు మాత- పిత బాప్దాదాల హృదయపూర్వక ప్రేమతో యాద్ ప్యార్ ఔర్ గుడ్మార్నింగ్, రుహాని(ఆత్మిక) పిల్లలకు రుహాని(ఆత్మిక) తండ్రి నమస్తే .
అవ్యక్త బాప్దాదా మధురమైన మహావాక్యాలు ( రివైజ్ )

స ఫలతా మూర్తులుగా అయ్యేందుకు ముఖ్యంగా రెండు విశేషతలు కావాలి. 1. పవిత్రత 2. ఐక్యత(యూనిటి). పవిత్రతలో లోపముంటే ఐక్యతలో కూడా లోపముంటుంది. కేవలం బ్రహ్మచర్యమునే పవిత్రత అని అనరు. సంకల్పము, స్వభావము, సంస్కారములో కూడా పవిత్రత. ఒకరిపట్ల మరొకరికి ఈర్ష్య, ఘృణాల సంకల్పముంటే అది పవిత్రత కాదు. దానిని అపవిత్రత అని అంటారు. పవిత్రత నిర్వచనం - సర్వ వికారాలు అంశ మాత్రము కూడా ఉండరాదు. సంకల్పంలో కూడా ఏ విధమైన అపవిత్రత ఉండరాదు. పిల్లలైన మీరు చాలా శ్రేష్ఠమైన కార్యాన్ని సంపన్నము చేసేందుకు నిమిత్తంగా అయ్యారు. మహారథి రూపంలో నిమిత్తంగా అయ్యారు కదా. ఒకవేళ లిస్టు తీస్తే లిస్టులో కూడా సేవాధారులు లేక సర్వీసుకు నిమిత్తంగా అయిన బ్రహ్మవత్సల మహారథుల లిస్టులో లెక్కించబడ్తారు. మహారథుల విశేషత ఎంతవరకు వచ్చింది? అది స్వయం మీ అంతకు మీరు తెలుసుకోవాలి. లిస్టులో ఎవరైతే మహారథులుగా లెక్కించబడ్తారో వారు పోను పోను మహారథులుగా ఉంటారా లేక వర్తమాన లిస్టులో మహారథులుగా ఉన్నారా? కనుక ఈ రెండు విషయాల పై గమనముండాలి.

యూనిటి అనగా సంస్కార స్వభావాల మిలనంలో యూనిటి. కొంతమంది సంస్కార స్వభావాలు కలవకపోయినా ప్రయత్నించి కలపండి. దీనినే యూనిటి అని అంటారు. కేవలం సంఘటనను యూనిటి అని అనరు. నిమిత్తమైన సేవాధారి ఆత్మలు ఈ రెండు విషయాలు లేకుండా బేహద్ సేవకు నిమిత్తంగా అవ్వలేరు, హద్దు సేవకు అవ్వగలరు. బేహద్ సేవకు ఈ రెండు విశేషతలు అవసరము. ఇంతకుముందు వినిపించాము కదా - రాస్లో లయ(తాళము) కలిస్తేనే వాహ్ వాహ్ అని అంటారు. అలా ఇక్కడ కూడా లయ కలపడం అనగా రాస్ కలపడం. ఇంతమంది ఆత్మలు జ్ఞానాన్ని వర్ణన చేస్తున్నారు. అందరి నోటి నుండి వీరందరూ ఒకే మాట చెప్తున్నారు, అందరి టాపిక్ ఒక్కటే అని అంటారు కదా. అలా అందరి స్వభావ-సంస్కారాలు కలిసినప్పుడు రాస్ కలయిక అని అంటారు. అందుకు కూడా ప్లాను తయారు చేయండి. ఏదైనా బలహీనతను తొలగించుకునేందుకు విశేషంగా మహాకాళి స్వరూపులైన శక్తుల సంఘటన కావాలి. వారు తమ యోగ అగ్ని ప్రభావంతో బలహీన వాతావరణాన్ని పరివర్తన చేయాలి. ఇప్పుడైతే డ్రామానుసారం ప్రతి ఒక్కరి చలనం(నడవడిక) అనే దర్పణంలో అంతిమ రిజల్టు స్పష్టమౌతుంది. పోను పోను మహారథి పిల్లలు తమ జ్ఞాన శక్తి ద్వారా, ప్రతి ఒక్కరి మొఖము ద్వారా వారి కర్మల కథను స్పష్టంగా చూడగలరు. ఎలాగైతే తమోప్రధాన (మలేఛ్) భోజనం నుండి దుర్వాసన తెలుస్తుందో, అలా మలేచ్ఛ్(వికారి) సంకల్పాల రూపి ఆహారాన్ని స్వీకరించే ఆత్మల వైబ్రేషన్లు బుద్ధిలో స్పష్టంగా టచ్ అవుతాయి(తెలుస్తాయి). ఇందుకు యంత్రము (సాధనం) - బుద్ధి లైను క్లియర్గా ఉండాలి. ఎవరి యంత్రము పవర్ఫుల్గా ఉంటుందో వారు సులభంగా తెలుసుకోగలరు.

శక్తులు మరియు దేవతల జడచిత్రాలలో కూడా ఈ విశేషత ఉంది, అందుకే ఎటువంటి పాపాత్మ అయినా జడచిత్రాల ముందుకెళ్లినప్పుడు దాచలేరు. వారంతకు వారే మేము ఇటువంటి వారమని వర్ణన చేస్తారు. కనుక మీ జడ స్మృతిచిహ్నాలలో కూడా ఇప్పుడు అంత్యకాలము వరకు ఈ విశేషత కనిపిస్తుంది. చైతన్య రూపంలో శక్తులకున్న విశేషత ప్రఖ్యాతి చెందింది కనుకనే స్మృతి చిహ్నములో కూడా ఈ విశేషత ఉంది. ఇది మాస్టర్ సర్వజ్ఞుల స్టేజ్ అనగా జ్ఞానస్వరూపుల స్టేజ్ (స్థితి). ఈ స్థితి కూడా ప్రాక్టికల్గా అనుభవమవుతుంది. అవుతూ ఉంది, అవుతుంది కూడా. ఇటువంటి సంఘటనను తయారు చేశారా? అవ్వాల్సిందే. ఇటువంటి దీప స్వరూప ఆత్మల సంఘటన కావాలి. వారి ప్రతి అడుగు ద్వారా తండ్రి ప్రత్యక్షత జరగాలి మంచిది.
వరదానము:- '' సేవ చేస్తూ స్మృతి అనుభవాల రేస్ చేసే సదా లవ్లీన్ ఆత్మా భవ ''
స్మృతిలో ఉంటారు కానీ స్మృతి ద్వారా ఏ ప్రాప్తులు జరుగుతాయో, ఆ ప్రాప్తి అనుభూతిని పెంచుకుంటూ ఉండండి. అందుకు ఇప్పుడే విశేషమైన సమయం మరియు అటెన్షన్ ఇవ్వండి. తద్వారా మీరు అనుభవాల సాగరంలో మునిగిపోయిన లవ్లీన్ ఆత్మ అని తెలియాలి. ఎలాగైతే పవిత్రత, శాంతుల వాతావరణం అనుభవమవుతుందో అలా శ్రేష్ఠమైన యోగులని, లగ్నమలో మగ్నమై ఉండేవారని అనుభవమవ్వాలి. జ్ఞానానికి ప్రభావముంది. అయితే యోగము యొక్క సిద్ధి స్వరూపము అనుభవమవ్వాలి. సేవ చేస్తూ స్మృతి అనుభవాలలో మునిగిపోయి ఉండండి. స్మృతియాత్రలో జరిగే అనుభవాల రేస్ చేయండి.
స్లోగన్:- '' సిద్ధిని స్వీకరించడం అనగా భవిష్య ప్రాలబ్ధాన్ని ఇక్కడే సమాప్తం చేసుకోవడం. ''

No comments:

Post a Comment