Wednesday, January 29, 2020

Telugu Murli 29/01/2020

29-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి శ్రీమతము మీకు 21 తరాలకు సుఖమునిస్తుంది. ఇంత అతీతమైన మతాన్ని బాబా తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి ''

ప్రశ్న :- స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు సహజ పురుషార్థమేది ?
జవాబు :- 1. స్వయానికి రాజ్యతిలకాన్ని ఇచ్చుకునేందుకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభిస్తున్నాయో వాటిని పూర్తిగా అనుసరించండి. ఇందులో ఆశీర్వాదము, కృప చూపే మాటేదీ లేదు. 2. తండ్రినే అనుసరించండి(ఫాలో ఫాదర్‌), ఇతరులను చూడరాదు, మన్మనాభవ స్థితిలో ఉండాలి. దీని ద్వారా మీకు తిలకము తనకు తానుగా లభిస్తుంది. చదువు మరియు స్మృతియాత్ర ద్వారానే మీరు భికారుల నుండి రాకుమారులుగా అవుతారు (బెగ్గర్‌ టూ ప్రిన్స్‌).

పాట :- ఓం నమ: శివాయ,...............  
ఓంశాంతి. బాప్‌(తండ్రి) మరియు దాదా(అన్న) ఓంశాంతి అన్నప్పుడు రెండు సార్లు కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇరువురూ ఒక్కరిలోనే ఉన్నారు. ఒకరు అవ్యక్తము, రెండవవారు వ్యక్తము. ఇరువురూ కలిసి ఉన్నారు. ఇరువురి శబ్ధమూ ఒకటిగా ఉండవచ్చు, వేరు వేరుగా కూడా ఉండవచ్చు. ఇది ఒక అద్భుతము. పరమపిత పరమాత్మ ఇతని శరీరములో కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తారని, ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఇది ఎక్కడా వ్రాయబడలేదు. నేను ఈ సాధారణ తనువులో అనేక జన్మల అంత్యములో ఇతనిలో ప్రవేశిస్తాను, ఇతని ఆధారాన్ని తీసుకుంటానని తండ్రి కల్పక్రితము కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. గీతలో ఇటువంటి కొన్ని వాస్తవమైన మహావాక్యాలు(వర్షన్స్‌) కూడా ఉన్నాయి. నేను అనేక జన్మల అంతములో, ఎప్పుడైతే ఇతను వానప్రస్థ స్థితిలో ఉంటాడో అప్పుడు ప్రవేశిస్తాను అనేది వాస్తవమైన విషయము. ఈ శ్లోకము ఇతనికి సరిగ్గా వర్తిస్తుంది. సత్యయుగములో మొట్టమొదటి జన్మ కూడా ఇతనిదే. మళ్లీ చివర్లో వానప్రస్థ స్థితిలో ఉన్నాడు, ఇతనిలోనే తండ్రి ప్రవేశిస్తారు. ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో ఇతనికి తెలియదని ఇతని గురించే చెప్తారు. శాస్త్రాలలో 84 లక్షల పునర్జన్మలు అని వ్రాసేశారు. ఇదంతా భక్తిమార్గము. దీనిని భక్తి కాండము(సంప్రదాయము) అని అంటారు. జ్ఞానకాండము వేరు, భక్తికాండము వేరు. భక్తి చేస్తూ చేస్తూ క్రిందకు దిగుతూనే వస్తారు. ఈ జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తండ్రి ఒకేసారి అందరికి సద్గతినిచ్చేందుకు వస్తారు. తండ్రి వచ్చి అందరికీ ఒకేసారి భవిష్య ప్రాలబ్ధాన్ని తయారు చేస్తారు. మీరు భవిష్య కొత్త ప్రపంచము కొరకే చదువుతున్నారు. తండ్రి నూతన రాజధాని స్థాపన చేసేందుకే వస్తారు. కనుక దీనిని రాజయోగమని అంటారు. దీనికి చాలా మహత్యముంది. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని ఎవరైనా నేర్పించనీ అని అనుకుంటారు. కాని ఈ రోజులలో సన్యాసులు విదేశాలకు వెళ్ళి మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చామని చెప్పుకుంటారు. మేము నేర్చుకోవాలని విదేశీయులు కూడా అనుకుంటారు ఎందుకంటే యోగము ద్వారానే స్వర్గ స్థాపన జరిగిందని భావిస్తారు. యోగబలము ద్వారా మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. స్వర్గాన్ని స్థాపన చేసినవారు తండ్రి. కానీ ఎలా స్థాపన చేస్తారో వారికి తెలియదు. ఈ రాజయోగాన్ని ఆత్మిక తండ్రి మాత్రమే నేర్పిస్తారు. దేహధారి మనుష్యులు ఎవ్వరూ నేర్పించలేరు. ఈ రోజుల్లో కల్తీ(అడల్‌ట్రేషన్‌), మోసము(కరప్షన్‌) చాలా ఉంది కదా. అందుకే తండ్రి - నేను పతితులను పావనంగా చేసేవాడినని చెప్తారు. మళ్లీ పతితంగా చేసేవారు కూడా తప్పకుండా ఎవరో ఉంటారు. అలాగే ఉంది కదా. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి. నేనే వచ్చి సర్వ వేదశాస్త్రాలు మొదలైనవాటి సారాన్ని వినిపిస్తాను. జ్ఞానము ద్వారా మీకు 21 జన్మల సుఖము లభిస్తుంది. భక్తి మార్గములో అల్పకాల క్షణ భంగుర సుఖముంది. ఇది 21 తరాలకు సుఖము, దీనిని తండ్రియే ఇస్తారు. తండ్రి మీకు సద్గతినిచ్చేందుకు ఏ శ్రీమతాన్ని ఇస్తారో, అది అన్నిటికంటే భిన్నమైనది. ఈ తండ్రి అందరి మనసులు తీసుకునేవారు. ఆ జడమైన దిల్‌వాడా మందిరము ఎలా ఉందో అలా ఇది చైతన్య దిల్‌వాడా మందిరము. అక్కడ ఖచ్ఛితంగా మీ కర్తవ్యాల చిత్రాలే తయారు చేయబడి ఉన్నాయి. ఈ సమయంలో మీ కర్తవ్యము నడుస్తోంది. అందరికి సద్గతినిచ్చేవారు, అందరి దు:ఖాన్ని హరించి, సుఖాన్నిచ్చే దిల్‌వాలా తండ్రి లభించారు. శివబాబా మహిమ ఎంతో ఉన్నతాతి ఉన్నతమైనదని మహిమ చేయబడింది. సర్వ శ్రేష్ఠమైనది భగవంతుడైన శివుని మహిమ. చిత్రాలలో శంకరుడు మొదలైనవారి ముందు కూడా శివుని చిత్రాన్ని చూపించారు. వాస్తవానికి దేవతల ముందు శివుని చిత్రాన్ని ఉంచడం నిషేధము. ఎందుకంటే వారు భక్తి చేయరు. భక్తి దేవతలూ చేయరు, సన్యాసులు కూడా చేయరు. వారు బ్రహ్మ జ్ఞానులు, తత్వ జ్ఞానులు. ఎలా ఈ ఆకాశ తత్వముందో, అలాగే ఆ బ్రహ్మ తత్వముంది. వారు తండ్రిని స్మృతి చేయరు, వారికి ఈ మహామంత్రము కూడా లభించదు. ఈ మహామంత్రాన్ని సంగమ యుగములో తండ్రియే వచ్చి ఇస్తారు. అందరి సద్గతిదాత అయిన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవ మంత్రాన్ని సంగమ యుగములో ఇస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, దేహ సహితంగా దేహ సర్వ ధర్మాలన్నీ త్యాగము చేసి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. రావణ రాజ్యం కారణంగా మీరందరూ దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను ఆత్మాభిమానులుగా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉంటే ఆత్మలో ఏర్పడిన మలినాలు తొలగిపోతాయి. సతోప్రధానము నుండి సతోలోనికి వచ్చినందున కళలు తగ్గిపోతాయి కదా. బంగారానికి కూడా క్యారెట్లు ఉంటాయి కదా. ఇప్పుడు కలియుగాంతములో బంగారు చూచేందుకు కూడా కనిపించదు, సత్యయుగములో అయితే బంగారు భవనాలే ఉంటాయి. ఎంతటి రాత్రింబవళ్ళ వ్యత్యాసముంది! దాని పేరే స్వర్ణిమ యుగ ప్రపంచము. అక్కడ ఇటుకలు-రాళ్లు మొదలైనవాటి అవసరముండదు. భవనాలు నిర్మించినట్లయితే అందులో కూడా వెండి, బంగారు తప్ప ఇతర మురికి ఏదీ ఉండదు. అక్కడ సైన్స్‌ ద్వారా చాలా సుఖముంటుంది. ఇది కూడా తయారైన డ్రామాయే. ఈ సమయంలో సైన్స్‌ అహంకారము(సైన్స్‌ ఘమండ్‌) ఉంది. సత్యయుగములో అహంకారమని అనరు. అక్కడ సైన్స్‌ ద్వారా మీకు సుఖము లభిస్తుంది. ఇక్కడ అల్పకాల సుఖముంది, మళ్లీ దాని ద్వారానే చాలా భారీ దు:ఖము కూడా లభిస్తుంది. బాంబులు మొదలైనవన్నీ వినాశనము కొరకు తయారు చేస్తూనే ఉంటారు. బాంబులు తయారు చేయరాదని ఇతరులకు నిషేధము విధిస్తారు కానీ వారే తయారు చేస్తారు. ఈ బాంబుల ద్వారా మా మృత్యువే సంభవిస్తుందని కూడా తెలుసు. అయినా తయారు చేస్తూనే ఉంటారు అంటే బుద్ధి మరణించినట్లే కదా. ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. తయారు చేయకుండా ఉండలేరు. ఈ బాంబుల ద్వారా మా మృత్యువే సంభవిస్తుందని మనుష్యులకు తెలుసు. కానీ ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలియడం లేదు, తయారు చేయకుండా మేము ఉండలేకపోతున్నామని అంటారు. తప్పకుండా తయారు చేయవలసే ఉంటుంది. వినాశనము కూడా డ్రామాలో నిర్దేశింపబడింది. ఎవరు ఎన్ని శాంతి బహుమతులిచ్చినా (పీస్‌ ప్రైజ్‌) శాంతి స్థాపన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. శాంతిసాగరుడైన తండ్రియే శాంతి, సుఖము, పవిత్రతల వారసత్వమునిస్తారు. సత్యయుగములో అనంతమైన సంపద ఉంటుంది. అక్కడ పాల నదులు ప్రవహిస్తాయి. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు. ఈ పోలికనే చెప్పబడింది. ఆ క్షీరసాగరమెక్కడ, ఈ విషయ సాగరమెక్కడ. భక్తిమార్గములో సరోవరాలు మొదలైనవి తయారు చేసి అందులో రాతి పై విష్ణువును పరండబెట్తారు. భక్తిమార్గములో ఎంత ఖర్చు చేస్తారు. సమయాన్ని, ధనాన్ని ఎంతగానో వ్యర్థము చేస్తారు. దేవీల మూర్తులను ఎంతో ఖర్చు చేసి తయారు చేస్తారు. మళ్లీ సముద్రములో పడేస్తారు. కనుక ధనము వ్యర్థమైనట్లే కదా. ఇది బొమ్మల పూజ వంటిది. వారి కర్తవ్యాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఎవరి మందిరాలకు వెళ్ళినా మీకు వారి ప్రతి ఒక్కరి కర్తవ్యము గురించి తెలుసు. ఎక్కడకు వెళ్లేందుకైనా పిల్లలకు నిషేధము లేదు. మొదట అవివేకులుగా వెళ్ళేవారు, ఇప్పుడు వివేకవంతులై వెళ్తారు. మాకు వీరి 84 జన్మలు తెలుసని మీరు చెప్తారు. భారతవాసులకు కృష్ణుని జన్మ గురించి కూడా తెలియదు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. జ్ఞానము సంపాదనకు ఆధారము(నాలెడ్జ్‌ ఈజ్‌ సోర్స్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌) వేదశాస్త్రాలు మొదలైన వాటిలో ఏ ముఖ్య ఉద్ధేశ్యమూ(ఏయిమ్‌ అండ్‌ ఆబ్జెక్టు) లేదు. పాఠశాలలో సదా ముఖ్య ఉద్ధేశ్యము ఉంటుంది. ఈ చదువు ద్వారా మీరు చాలా ధనవంతులుగా అవుతారు.
జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. ఈ జ్ఞానము ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు. మీరు ఎవరి మందిరములోకి వెళ్ళినా, అది ఎవరి స్మృతిచిహ్నమో వెంటనే అర్థము చేసుకుంటారు. ఉదాహరణానికి దిల్‌వాలా మందిరముంది. అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఇక్కడ వృక్షములో ఎలా చూపబడిందో, ఖచ్ఛితంగా అలాగే మందిరము తయారు చేయబడింది. క్రింద తపస్సులో కూర్చొని ఉన్నారు, పై కప్పులో స్వర్గమంతా ఉంది. చాలా ఖర్చుతో తయారుచేశారు. ఇక్కడైతే ఏమీ లేదు. భారతదేశము నూరు శాతము శ్రేష్ఠంగా, పావనంగా ఉండేది, ఇప్పుడు భారతదేశము నూరు శాతము కనిష్ఠంగా, దివాలా తీసి(ఇన్‌సాల్వంట్‌గా), పతితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. అక్కడ వికారాల మాటే ఉండదు. మనుష్యులు కొద్దిగానైనా పరివర్తన అవ్వాలని గరుడ పురాణములో భయము కలిగించే విషయాలు వ్రాశారు. కాని డ్రామాలో మనుష్యులు పరివర్తన అవ్వడం లేనే లేదు. ఇప్పుడు ఈశ్వరీయ స్థాపన జరుగుతోంది. ఈశ్వరుడే స్వర్గ స్థాపన చేస్తారు కదా. వారినే హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ అని అంటారు. తండ్రి అర్థం చేయించారు - అక్కడ యుద్ధము చేసే ఆ సైన్యము రాజా-రాణుల కొరకు అంతా చేస్తారు. ఇక్కడ మీరు మీ కొరకు మాయ పై విజయం పొందుతారు. ఎంత చేస్తారో, అంత పొందుతారు. మీరు ప్రతి ఒక్కరు మీ తనువు, మనసు, ధనాలను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడంలో వినియోగించాల్సి వస్తుంది. ఎంత చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. ఇక్కడ ఉండేది(మిగిలేది) ఏదీ లేదు. కొందరిది ధూళిలో కలిసిపోతుంది,.......... అను గాయనము ఈ సమయానిదే. మీకు రాజ్యభాగ్యాన్ని ఇప్పించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు తనువు-మనసు-ధనములన్నీ ఇందులో వినియోగించండని చెప్తున్నారు. ఈ బ్రహ్మ సర్వస్వాన్ని సమర్పణ చేశారు కదా. ఇతనిని మహాదాని అని అంటారు. వినాశి ధనాన్ని దానము చేసిన తర్వాత అవినాశి ధనాన్ని కూడా దానము చేయాల్సి ఉంటుంది. ఎవరు ఎంత దానము చేస్తారో అంత పొందుతారు......... పేరు పొందిన దానులైతే ఫలానావారు గొప్ప దాతగా ఉండేవారని అంటారు. పేరు ఉంటుంది కదా. వారు ఇన్‌డైరెక్ట్‌గా(పరోక్షంగా) ఈశ్వరార్థము చేస్తారు. రాజ్యస్థాపన అయితే జరగదు. ఇప్పుడు రాజ్య స్థాపన జరుగుతుంది కనుక పూర్తిగా దాతలుగా అవ్వాలి. భక్తిమార్గములో మేము మీకు బలి అవుతామని గానము కూడా చేస్తారు. ఇందులో ఖర్చు కొంచెం కూడా లేదు. ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ మీరు ఏమి చేస్తున్నా అది మీ కొరకే. 8 మాలలో అయినా రండి, 108 మాలలో అయినా రండి, 16,108 మాలలోనైనా రండి. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. కర్మాతీత స్థితిని పొందే, ఏ శిక్షలు అనుభవించనంత యోగాన్ని సంపాదించండి.
మీరందరు సైనికులు. రావణునితో మీ యుద్ధము జరుగుతోంది, ఏ మనుష్యులతో కాదు. పాస్‌ (ఉత్తీర్ణులు) కాని కారణంగా రెండు కళలు తగ్గిపోయాయి. త్రేతా యుగమును రెండు కళలు తగ్గిన స్వర్గమని అంటారు. తండ్రిని పూర్తిగా అనుసరించే పురుషార్థమైతే చేయాలి కదా. ఇందులో మనస్సు-బుద్ధి ద్వారా సమర్పణ కావలసి ఉంటుంది. బాబా ఈ సర్వస్వమూ మీదే అని చెప్పినప్పుడు, దీనిని సర్వీసులో వినియోగించండి అని తండ్రి చెప్తారు. నేను మీకు ఏ సలహాను ఇస్తానో, ఆ కార్యము చేయండి, విశ్వవిద్యాలయాన్ని తెరవండి, సేవాకేంద్రాలను తెరవండి. అనేమందికి కళ్యాణము జరుగుతుంది. కేవలం తండ్రిని స్మృతి చేయండి వారసత్వమును తీసుకోండి అనే సందేశాన్ని ఇవ్వండి. మెసెంజర్‌(సందేశకులు), పైగంబర్‌(దేవదూత) అని పిల్లలైన మిమ్ములనే అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే, మీ వికర్మలు వినాశనమవుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది అని తండ్రి బ్రహ్మ ద్వారా చెప్తున్నారనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి. ఇప్పుడు జీవన బంధనముంది. తర్వాత జీవన్ముక్తి ఉంటుంది. నేను భారతదేశములోనే వస్తానని తండ్రి చెప్తున్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎప్పుడు తయారయింది, ఎప్పుడు పూర్తి అవుతుంది? ఈ ప్రశ్న తలెత్తదు. ఇది అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఆత్మ ఎంత చిన్న బిందువు. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. నక్షత్రము వలె చిన్న బిందువు. మాతలు కూడా ఇక్కడ మస్తకము పై బిందువునుంచుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నారు. మీరు తండ్రి శిక్షణల అనుసారము బాగా నడిచినట్లయితే, మీరు స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నట్లే. ఇందులో ఆశీర్వాదము, కృప ఏమీ ఉండదు. మీరే స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. వాస్తవానికి ఇదే రాజ్య తిలకము. తండ్రిని అనుసరించే పురుషార్థము చేయాలి, ఇతరులను చూడరాదు, ఇది మన్మనాభవ స్థితి, దీని ద్వారా మీకు తనకు తానుగా తిలకము లభిస్తుంది, తండ్రి ఇవ్వరు. దీని పేరే రాజయోగము. మీరు భికారుల నుండి రాకుమారులుగా అవుతారు(బెగ్గర్‌ టూ ప్రిన్స్‌). కనుక పురుషార్థము ఎంత బాగా చేయాలి. ఇతడిని కూడా అనుసరించాలి. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. ఎంతెంత యోగము ఉంటుందో, అంతంత ధారణ జరుగుతుంది. యోగములోనే శ్రమ ఉంది. అందుకే భారతదేశ రాజయోగము మహిమ చేయబడింది. గంగా స్నానాలు చేస్తూ చేస్తూ ఆయువంతా అయిపోయినా పావనంగా అవ్వలేరు. భక్తిమార్గములో ఈశ్వరార్థము పేదవారికి ఇస్తారు. ఇక్కడ స్వయం ఈశ్వరుడే వచ్చి పేదవారికే విశ్వ సామ్రాజ్యాన్ని ఇస్తారు. వారు పేదల పెన్నిధి కదా. 100 శాతము సంపన్నంగా ఉన్న భారతదేశము ఈ సమయంలో 100 శాతము దివాలా తీసింది. దానము సదా పేదవారికే చేయబడ్తుంది. తండ్రి ఎంత శ్రేష్ఠంగా తయారు చేస్తారు. అలాంటి తండ్రిని తిడ్తారు. తండ్రి చెప్తారు - ఎప్పుడిలా గ్లాని చేస్తారో, అప్పుడు నేను రావలసి వస్తుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. వీరు తండ్రి కూడా అయినారు, టీచరు కూడా అయినారు. సద్గురువు అకాల్‌ అని సిక్కులు అంటారు. పోతే భక్తిమార్గములోని గురువులు అనేకమంది ఉన్నారు. అకాలమూర్తికి కేవలం ఇదే సింహాసనంగా లభిస్తుంది. పిల్లలైన మీ సింహాసనాన్ని కూడా బాబా ఉపయోగించుకుంటారు. నేను ఇతనిలో ప్రవేశించి అందరి కళ్యాణము చేస్తానని తండ్రి అంటారు. ఈ సమయంలో ఇతని పాత్ర ఇది. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. కొత్తవారెవరూ అర్థము చేసుకోలేరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
మధ్య-మధ్యలో సంకల్పాల ట్రాఫిక్‌ను స్టాప్‌ చేసే అభ్యాసము చేయండి. ఒక నిముషము శరీరము ద్వారా జరుగుతున్న కర్మలను ఆపి అయినా సంకల్పాలను నిలిపి బిందురూపాన్ని అభ్యాసము చేయండి. ఒక సెకండు ఈ అనుభవం చేసినా, అది అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడంలో రోజంతా సహాయము చేస్తుంది.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అవినాశి జ్ఞాన ధనాన్ని దానము చేసి, మహాదానులుగా అవ్వాలి. ఎలాగైతే బ్రహ్మాబాబా తన సర్వస్వాన్ని ఇందులో వినియోగించారో, అలా తండ్రిని అనుసరించి రాజ్యములో ఉన్నత పదవిని తీసుకోవాలి.
2. శిక్షల నుండి తప్పించుకునేందుకు కర్మాతీత స్థితిని పొందే విధంగా యోగాన్ని సంపాదించాలి. గౌరవయుక్తంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థము చేయాలి, ఇతరులను చూడరాదు.

వరదానము :- '' మీ పూర్వజ రూప స్మృతి ద్వారా సర్వ ఆత్మలను శక్తిశాలిగా చేసే ఆధారమూర్త్‌, ఉద్ధారమూర్త్‌ భవ ''
ఈ సృష్టి రూపి వృక్షానికి ముఖ్యమైన కాండము అందరి పూర్వజులైన బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీరే. ప్రతి కర్మకు ఆధారము, కులమర్యాదలకు ఆధారము, ఆచార పద్ధతులకు ఆధారము పూర్వజులైన మీరే. సర్వ ఆత్మలకు ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు మీరే. కాండమైన మీ ద్వారానే సర్వ ఆత్మలకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేక సర్వ శక్తుల ప్రాప్తి జరుగుతుంది. అందరూ మిమ్ములను అనుసరిస్తున్నారు. అందువలన మా పై ఇంత పెద్ద బాధ్యత ఉందని భావించి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ చేయండి. ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారం పైనే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఆధారపడి ఉంది.

స్లోగన్‌ :- '' ఎవరి నుండి సర్వ శక్తుల కిరణాలు నలువైపులా వ్యాపిస్తాయో, వారే మాస్టర్‌ జ్ఞానసూర్యులు ''

No comments:

Post a Comment