Sunday, January 26, 2020

Telugu Murli 27/01/2020

27-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ ఒక్కొక్క మాట(పలుకు) చాలా మధురంగా, ఫస్ట్‌క్లాస్‌గా ఉండాలి. తండ్రి ఎలా దుఃఖహర్త - సుఖకర్తగా ఉన్నారో, అలా తండ్రి సమానంగా అందరికీ సుఖాన్నివ్వండి ''

ప్రశ్న :- లౌకిక బంధు-మిత్రులకు జ్ఞానాన్ని ఇచ్చే యుక్తి ఏమిటి ?
జవాబు :- ఎవరైనా బంధు-మిత్రులుంటే వారితో చాలా నమ్రతగా, ప్రేమపూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడాలి - ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేయించాలి. తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. నేను మీకు సత్యాన్ని తెలియజేస్తున్నాను. భక్తి మొదలైనవి జన్మ-జన్మాంతరాలుగా చేశారు. ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. ఇలా అవకాశము దొరికినప్పుడంతా చాలా యుక్తిగా మాట్లాడాలి. పరివారమువారితో చాలా ప్రేమగా వ్యవహరించాలి. ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి.

పాట :- చివరికి ఆ రోజు నేడు వచ్చింది,...............(ఆఖిర్‌ వహ్‌ దిన్‌ ఆయా ఆజ్‌,...............)  
ఓంశాంతి. ఏదైనా పాట వినిపించినప్పుడు పిల్లలు తమ మనసులో దాని అర్థాన్ని గురించి ఆలోచించి వెలికి తీయాలి. ఒక్క సెకండులో అర్థము తెలుసుకోవచ్చు. ఇది అనంతమైన డ్రామాను తెలిపే అతి పెద్ద గడియారము కదా. భక్తిమార్గములో మనుష్యులు పిలుస్తారు కూడా. ఎలాగైతే కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు విచారణ జరుగుతుంది, పిలుపు వస్తుంది, మా కేసు సమాప్తమవుతుందని అంటారు కదా. అలాగే పిల్లల కేసు కూడా ఉంది, ఏ కేసు? రావణుడు మిమ్ములను చాలా దుఃఖితులుగా చేశాడు, మీ కేసు పెద్ద కోర్టులో దాఖలు అవుతుంది. బాబా రండి, వచ్చి మమ్ములను దుఃఖాల నుండి విడుదల చేయండని పిలుస్తూ ఉంటారు. ఒక రోజు విచారణ(సున్‌వాయీ, విచారణ చేసి తీర్పునివ్వడము) తప్పకుండా ఉంటుంది. తండ్రి వింటారు, డ్రామానుసారంగా సరియైన సమయానికి వస్తారు. అందులో ఒక్క సెకెండు వ్యత్యాసము కూడా ఉండదు. అనంతమైన గడియారము చాలా ఖచ్ఛితంగా నడుస్తుంది. ఇక్కడ మీ వద్ద ఈ చిన్న గడియారాలు కూడా ఖచ్చితంగా నడవవు. యజ్ఞములోని ప్రతి కార్యము ఖచ్ఛితంగా ఉండాలి. గడియారాలు కూడా ఖచ్ఛితంగా ఉండాలి. తండ్రి చాలా ఖచ్ఛితమైనవారు, విచారణ కూడా ఖచ్ఛితంగా ఉంటుంది. కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమ యుగములో ఖచ్ఛితమైన(ఆక్యూరేట్‌) సమయానికి వస్తారు కనుక ఇప్పుడు పిల్లల కేసు విచారణ ఉంది. బాబా వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు అందరికీ అర్థము చేయిస్తారు. దుఃఖాన్ని ఎవరు ఇస్తారో ఇంతకుముందు మీకు కూడా తెలియదు. రావణ రాజ్యము ద్వాపరము నుండి ప్రారంభమవుతుందని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. బాబా కల్ప-కల్పము సంగమ యుగములో వస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసిపోయింది. ఇది బేహద్‌ రాత్రి, శివబాబా బేహద్‌ రాత్రిలో వస్తారు, కృష్ణుని విషయం కాదు. ఎప్పుడైతే ఘోరాంధకారములో అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారో, అప్పుడు పిల్లలను పగలులోకి తీసుకెళ్లేందుకు జ్ఞాన సూర్యుడైన తండ్రి వస్తారు. నన్ను స్మృతి చేయండి అని చెప్తారు ఎందుకంటే పతితుల నుండి పావనంగా అవ్వాలి. బాబాయే పతితపావనుడు, ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు విచారణ ఉంటుంది. ఇప్పుడు మీ విచారణ జరిగింది. నేను పతితులను పావనంగా చేసేందుకు వచ్చాను. పావనంగా అయ్యేందుకు మీకు ఎంత సహజ యుక్తిని తెలియజేస్తాను! అని తండ్రి చెప్తారు. ఈ రోజులలో సైన్సు(విజ్ఞానము) తీవ్రత ఎంత ఉందో చూడండి. అణుబాంబులు మొదలైన వాటి శబ్ధము ఎంత ఎక్కువగా ఉంటుంది. పిల్లలైన మీరు సైలెన్స్‌(శాంతి)శక్తి ద్వారా ఈ సైన్సు శక్తి పై విజయము పొందుతారు. సైలెన్సు శక్తిని యోగము అని కూడా అంటారు. బాబా మీరు వచ్చినట్లయితే మేము శాంతిధామానికి వెళ్ళి నివసిస్తాము అని ఆత్మ తండ్రిని తలంపు చేస్తుంది. పిల్లలైన మీరు ఈ యోగబలము ద్వారా, సైలెన్సు శక్తి ద్వారా సైన్సు శక్తి పై విజయము పొందుతారు. శాంతి శక్తిని ప్రాప్తించుకుంటారు. విజ్ఞానము ద్వారానే ఇదంతా వినాశనము కానున్నది. సైలెన్సు ద్వారా పిల్లలైన మీరు విజయము పొందుతారు. బాహుబలము ద్వారా ఎప్పుడూ విశ్వము పై విజయాన్ని పొందలేరు. ఈ పాయింట్లు కూడా మీరు ప్రదర్శినిలో వ్రాయాలి.
ఢిల్లీలో చాలా సేవ చేయవచ్చు ఎందుకంటే ఢిల్లీ అన్నిటికీ రాజధాని, మీ రాజధాని కూడా ఢిల్లీనే ఉంటుంది. ఢిల్లీని ఫరిస్తాన్‌ అని అంటారు. పాండవులకు కోట ఉండదు. ఎప్పుడు శత్రువులు ఆక్రమణ చేస్తారో అప్పుడే కోట నిర్మించబడుతుంది. మీకు కోటలు మొదలైనవి అవసరముండదు. మనము సైలెన్స్‌ శక్తి ద్వారా మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. వారిది కృత్రిమమైన సైలెన్స్‌(ఆర్టిఫిషియల్‌ సైలెన్స్‌) అని మీకు తెలుసు. మీది నిజమైన శాంతి(రీయల్‌ సైలెన్స్‌). జ్ఞాన శక్తి, శాంతి శక్తి అని అంటారు. జ్ఞానము అనగా చదువు. చదువు ద్వారానే శక్తి లభిస్తుంది. పోలీసు సూపరిండెంటు అవుతారు, అతనికి ఎంతటి శక్తి ఉంటుంది. అవన్నీ దుఃఖాన్ని ఇచ్చే దేహ సంబంధమైన విషయాలు. మీ ప్రతి మాట ఆత్మికము. మీ నోటి ద్వారా ఏ మాట వెలువడినా ఆ ఒక్కొక్క మాట వినేవారు సంతోషపడే విధంగా ఫస్ట్‌క్లాస్‌గా, మధురంగా ఉండాలి. ఎలాగైతే బాబా దుఃఖహర్త-సుఖకర్త అయ్యారో, అలా మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. మీ కుటుంబ పరివారములోని వారికి కూడా దుఃఖము మొదలైనవి కలగరాదు. అందరితో నియమానుసారము వ్యవహరించాలి. పెద్దలతో ప్రీతిగా వ్యవహరించాలి. అందరూ సంతోషపడే విధంగా మధురమైన ఫస్ట్‌క్లాస్‌ మాటలు నోటి నుండి వెలువడాలి. శివబాబా - మన్మనాభవ అని చెప్తున్నారని అందరికీ చెప్పండి. నేను సర్వ శ్రేష్ఠుడను. నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. అందరితో చాలా ప్రేమగా మాట్లాడాలి. ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారికి - అన్నగారూ! నన్ను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారని చెప్పండి. రుద్రుడు అని పిలువబడే శివబాబాయే జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కృష్ణ జ్ఞాన యజ్ఞము అనే మాట విని ఉండము. రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు. కనుక రుద్రుడైన శివబాబా ఈ యజ్ఞాన్ని రచించారు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ దాదా కూడా చెప్తున్నారు - భగవానువాచ! నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఎందుకంటే ఇప్పుడిది అందరి అంతిమ సమయము, వానప్రస్థ అవస్థ. అందరూ వాపస్‌ వెళ్ళాలి. మరణించే సమయంలో ఈశ్వరుని స్మృతి చేయండి అని మనుష్యులకు చెప్తారు. ఇక్కడ మృత్యువు సమీపంలో నిల్చుకొని ఉంది, దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని స్వయం ఈశ్వరుడే చెప్తున్నారు. పిల్లలారా, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. దీనిని యోగాగ్ని అని అంటారు. దీని ద్వారా మీ పాపాలు దగ్ధమౌతాయని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. వికర్మలు వినాశనము చేసుకునేందుకు పావనంగా అయ్యేందుకు ఇతర ఏ ఉపాయమూ లేదు. పాపాల భారము తల పై పెరుగుతూ, పెరుగుతూ మలినాలు చేరుతూ చేరుతూ బంగారు 9 క్యారెట్లదిగా అయిపోయింది. ఇంకా తగ్గితే గిల్టు(ములమ్మా) వేయబడిన బంగారు అని అనబడ్తుంది. ఇప్పుడు మళ్లీ 24 క్యారెట్ల బంగారుగా ఎలా అవ్వాలి, ఆత్మ పవిత్రంగా ఎలా అవ్వాలి? పవిత్ర ఆత్మకు ఆభరణము(శరీరము) కూడా పవిత్రమైనదే లభిస్తుంది.
మీ బంధు-మిత్రులు మొదలైనవారు ఎవరైనా ఉంటే వారితో చాలా నమ్రతతో, ప్రీతితో నవ్వుతూ మాట్లాడాలి. వారికి ఆ మహాభారత యుద్ధము ఇదే అని అర్థము చేయించాలి. రుద్ర జ్ఞాన యజ్ఞము కూడా ఇదే. తండ్రి ద్వారా మనకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము లభిస్తూ ఉంది. ఇంకెక్కడా ఈ జ్ఞానము లభించదు. నేను మీకు సత్యము చెప్తున్నాను.ఈ భక్తి మొదలైనవి జన్మ-జన్మాంతరాలుగా చేశారు. ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. భక్తి రాత్రి(చీకటి) వంటిది, జ్ఞానము పగలు(వెలుతురు) వంటిది. సత్యయుగంలో భక్తి ఉండదు. ఈ విధంగా యుక్తిగా మాట్లాడాలి. అవకాశమొచ్చినప్పుడు బాణము వేయవలసి వచ్చినప్పుడు సమయాన్ని, అవకాశాన్ని గమనించవలసి ఉంటుంది. జ్ఞానమిచ్చేందుకు కూడా చాలా యుక్తి కావాలి. తండ్రి అందరికీ యుక్తులేమో తెలుపుతూనే ఉంటారు. పవిత్రత చాలా మంచిది, ఈ లక్ష్మినారాయణులు మనకు అందరికంటే గొప్ప పూజ్యులుగా ఉన్నారు కదా. పూజ్యులుగా, పావనులుగా ఉన్నవారే మళ్లీ పూజారులుగా, పతితులుగా అయ్యారు. పతితులు పావనుల ముందు కూర్చొని పూజించడం అంతగా శోభించదు. చాలామంది పతితులను చూస్తూనే దూరంగా పారిపోతారు. వల్లభాచారి ఎప్పుడూ తన పాదాలను కూడా ముట్టుకోనివ్వరు. వీరు ఛీ-ఛీ(పతిత) మనుష్యులని భావిస్తారు. మందిరాలలో కూడా మూర్తిని తాకేందుకు బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంటుంది. శూద్ర మనుష్యులను ముట్టుకోనివ్వరు. బ్రాహ్మణులే విగ్రహాలకు స్నానము(అభిషేకము) మొదలైనవి చేయిస్తారు. ఇతరులనెవ్వరినీ లోపలకు పోనివ్వరు. తేడా ఉంది కదా. వారు కుఖవంశావళి(గర్భజనిత) బ్రాహ్మణులు. మీరు ముఖవంశావళి పవిత్ర బ్రాహ్మణులు. మీరు ఆ బ్రాహ్మణులకు, బ్రాహ్మణులలో రెండు రకాలున్నారు, ఒకరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి, రెండవ వారు కుఖవంశావళి అని బాగా అర్థము చేయించవచ్చు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు అత్యంత ఉన్నతమైన శిఖరము వంటివారు. యజ్ఞము రచించేందుకు కూడా బ్రాహ్మణులనే నియమిస్తారు. ఇది జ్ఞాన-యజ్ఞము. బ్రాహ్మణులకు జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానముతో వారు మళ్లీ దేవతలుగా అవుతారు. వర్ణాల గురించి కూడా అర్థము చేయించబడింది. సేవాధారి పిల్లలకు సదా సేవ చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఎక్కడ ప్రదర్శిని జరిగినా వెంటనే సేవ చేసేందుకు పరుగెడ్తారు,....... మేము వెళ్లి ఈ పాయింట్లు అర్థము చేయించాలని భావిస్తారు. ప్రదర్శిని ప్రజలను తయారు చేసుకునేందుకు విహంగ మార్గము. అనేకమంది వారంతట వారే వచ్చేస్తారు. కనుక అర్థము చేయించేవారు కూడా బాగుండాలి. ఎవరైనా బాగా అర్థము చేయించకపోతే బి.కెల వద్ద ఉన్న జ్ఞానము ఇదేనా అని అంటారు. డిస్‌సర్వీసు అయిపోతుంది. కనుక ప్రదర్శినిలో అర్థం చేయించే గైడ్స్‌ను గమనించే ఒక చురుకైన వారుండాలి. ఎవరైనా పెద్ద మనిషి వస్తే వారికి అర్థము చేయించేందుకు మంచి గైడునివ్వాలి. తక్కువగా అర్థము చేయించేవారిని తొలగించాలి. సూపర్‌వైజ్‌ చేసేందుకు ఒక మంచి వ్యక్తి ఉండాలి. మీరు మహాత్ములను కూడా పిలవాలి. మీరు కేవలం బాబా ఇలా చెప్తున్నారని చెప్పండి. వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు, అతనే రచయిత. ఇక మిగిలినవారంతా వారి రచన. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. సోదరులు, సోదరులకు వారసత్వమేమిస్తారు! సుఖధామాన్ని వారసత్వంగా ఎవ్వరూ ఇవ్వలేరు. వారసత్వమును ఇచ్చేవారు తండ్రి మాత్రమే. సర్వులకు సద్గతినిచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా వచ్చి బంగారు యుగాన్ని తయారుచేస్తారు. బ్రహ్మ తనువు ద్వారా స్వర్గ స్థాపన చేస్తారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు. కాని వారు వచ్చి ఏం చేస్తారో ఈ మనుష్యులందరూ మర్చిపోయారు. శివబాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పించి వారసత్వమునిస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేది, లక్షల సంవత్సరముల మాటే లేదు. తిథి-తారీఖులు అన్నీ ఉన్నాయి, దీనిని ఎవ్వరూ ఖండించలేరు. నూతన ప్రపంచము మరియు పాత ప్రపంచము సగము-సగము ఉండాలి. వారు సత్యయుగం ఆయువును లక్షల సంవత్సరాలని అనేయడం వలన ఏ లెక్కా కుదరదు. స్వస్తిక్‌లో కూడా పూర్తి 4 భాగాలున్నాయి. ప్రతి యుగానికి 1250 సంవత్సరాలు పంచడం జరిగింది. లెక్క వేయబడుతుంది కదా. వారికి ఈ లెక్కలు కొంచెం కూడా తెలియదు. అందుకే గవ్వ సమానమని అంటారు. ఇప్పుడు తండ్రి వజ్ర సమానముగా తయారు చేస్తున్నారు. అందరూ పతితులే, భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు. వారిని భగవంతుడు వచ్చి జ్ఞానము ద్వారా పుష్పాలుగా చేస్తున్నారు. పిల్లలైన మిమ్ములను జ్ఞాన రత్నాలతో అలంకరిస్తున్నారు. మళ్లీ మీరు ఎలా అవుతారో చూడండి, మీ ముఖ్య లక్ష్యము ఏది? భారతదేశము ఎంత తలమానికంగా ఉండేదో అందరూ మర్చిపోయారు. ముసల్మానులు మొదలైనవారు కూడా ఎంతగా సోమనాథ మందిరాన్ని లూటీ చేసి మసీదులు మొదలైన వాటిలో వజ్రాలు మొదలైనవాటిని పొదిగారు. ఇప్పుడు వాటి విలువ ఎవ్వరూ కట్టలేరు కూడా. ఎంతో పెద్ద పెద్ద మాణులు రాజుల కిరీటాలలో ఉండేవి. కొన్ని కోటి రూపాయల విలువ చేసేవి, కొన్ని 5 కోట్ల విలువ చేసేవి కూడా ఉండేవి. ఈ రోజుల్లో అన్నీ నకిలీవి(ఇమిటేషన్‌) వెలువడ్డాయి. ఈ ప్రపంచంలో ఉన్న సుఖం కృత్రిమమైనది. పైసా విలువ చేసే సుఖము, మిగిలినదంతా దుఃఖమే. అందుకే సన్యాసులు కూడా కాకిరెట్టతో సమానమైన సుఖముందని అంటారు. అందుకే వారు ఇల్లు-వాకిళ్ళను వదిలేస్తారు, కానీ ఇప్పుడు వారు కూడా తమోప్రధానమైపోయారు. పట్టణాలలోకి చొరబడినారు. మరి ఇప్పుడు ఎవరికి వినిపించాలి, రాజా-రాణులైతే ఎవ్వరూ లేరు. ఎవ్వరూ ఒప్పుకోరు కూడా. అందరికీ తమ-తమ అభిప్రాయాలున్నాయి. ఎవ్వరూ ఒప్పుకోరు. ఎవరు ఎలా కావాలంటే అలా చేసుకుంటూ ఉంటారు. సంకల్పముతో సృష్టి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీతో తండ్రి గుప్తంగా పురుషార్థము చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత సుఖాన్ని అనుభవిస్తారు. ఇతర ధర్మాలు కూడా చివరిలో ఎప్పుడైతే వృద్ధి చెందుతాయో అప్పుడు యుద్ధాలు మొదలైన గొడవలు ప్రారంభమవుతాయి. మూడు భాగాల సమయము సుఖంలో ఉంటారు. అందుకే మీ దేవీదేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేదని తండ్రి చెప్తున్నారు. నేను మిమ్ములను విశ్వాధికారులుగా చేస్తాను. ఇతర ధర్మస్థాపకులు ఏ రాజ్యాన్నీ స్థాపించరు. వారు సద్గతి చెయ్యలేరు. కేవలం తమ ధర్మాన్ని స్థాపించేందుకే వస్తారు. అవి కూడా చివర్లో తమోప్రధానమైనప్పుడు సతోప్రధానంగా చేసేందుకు తండ్రి రావలసి ఉంటుంది.
మీ వద్దకు వందల మంది మనుష్యులు వస్తారు కానీ ఏమీ అర్థము చేసుకోరు. బాబాకు ఫలానావారు చాలా బాగా అర్థము చేసుకుంటున్నారు, చాలా మంచివారు అని వ్రాస్తారు. బాబా చెప్తారు - ఏమీ అర్థము చేసుకోలేదు. ఒకవేళ బాబా వచ్చి ఉన్నారు, విశ్వాధికారులుగా తయారు చేస్తున్నారని అర్థము చేసుకుంటే వెంటనే(అదే సమయంలో) నషా పెరిగిపోవాలి. వెంటనే టికెట్‌ తీసుకుని ఇక్కడకు పరుగెత్తి రావాలి. కానీ తండ్రితో కలిసేందుకు బ్రాహ్మణి వద్ద నుండి జాబు తప్పకుండా తీసుకు రావాల్సి ఉంటుంది. తండ్రిని గుర్తించి ఉంటే మిలనము చేయకుండా ఉండలేరు, ఒక్కసారిగా నషా పెరిగిపోవాలి. ఎవరికి నషా ఎక్కి ఉంటుందో వారికి ఆంతరికములో చాలా సంతోషముంటుంది. వారి బుద్ధి బంధు-మిత్రులు మొదలైనవారి వైపు పరిగెత్తదు. కానీ చాలా మంది బుద్ధి తిరుగుతూనే ఉంటుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి, అంతేకాక తండ్రి స్మృతిలో ఉండాలి. వాస్తవానికి చాలా సులభము. ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎలాగైతే ఆఫీసులో శెలవు తీసుకుంటారో, అలా మీ వ్యాపార వ్యవహారాల నుండి శెలవు తీసుకొని 1-2 రోజులు స్మృతియాత్రలో కూర్చోండి. క్షణ-క్షణము స్మృతిలో కూర్చునేందుకు రోజంతా బాబాను స్మృతి చేయాలనే వ్రతము పెట్టుకోవాలి. అప్పుడు ఎంతో జమ అవుతుంది. వికర్మలు కూడా వినాశమౌతాయి. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. పూర్తి రోజంతా ఎవ్వరూ యోగము చేయలేరు. మాయ తప్పకుండా విఘ్నాలు వేస్తూ ఉంటుంది, అయినా పురుషార్థము చేస్తూ చేస్తూ విజయము పొందుకునేస్తారు. చాలు, ఈ రోజంతా తోటలో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తాను. భోజనము తినే సమయంలో కూడా స్మృతిలో కూర్చునేస్తాను. ఇదే శ్రమ. మనము తప్పకుండా పావనముగా అవ్వాలి. కష్టపడాలి, ఇతరులకు కూడా దారి చూపించాలి. బ్యాడ్జ్‌ చాలా మంచి వస్తువు. మార్గములో కూడా పరస్పరములో మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది వచ్చి వింటారు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి - ఈ సందేశము లభిస్తే మనము బాధ్యత నుండి విడుదల అవుతాము.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
అమృతవేళలో నిద్ర లేచినప్పటి నుండి ప్రతి కర్మ, ప్రతి సంకల్పము, ప్రతి మాటలో రెగ్యులర్‌గా అవ్వండి. ఒక్క మాట కూడా వ్యర్థమైనది వెలువడరాదు. ఎలాగైతే గొప్ప వ్యక్తులు మాట్లాడే మాటలు ఫిక్సెడ్‌గా ఉంటాయో, అలా మీ మాటలు ఫిక్స్‌గా ఉండాలి, అదనంగా మాట్లాడరాదు.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. వ్యాపారము మొదలైనవాటి నుండి శెలవు లభిస్తే స్మృతియాత్రలో ఉండే వ్రతము తీసుకోవాలి. మాయ పై విజయము ప్రాప్తి చేసుకునేందుకు స్మృతిలో ఉండే శ్రమ చేయాలి.
2. చాలా నమ్రత మరియు ప్రేమ భావముతో మందహాసము చేస్తూ బంధు-మిత్రులకు సేవ చేయాలి. వారిలో బుద్ధిని భ్రమించనీయరాదు. ప్రీతితో తండ్రి పరిచయమును ఇవ్వాలి.

వరదానము :- '' లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసి అన్ని బలహీనతల నుండి ముక్తులయ్యే మాస్టర్‌ సర్వశక్తివాన్‌ భవ ''
ఎవరైతే మాస్టర్‌ సర్వశక్తివాన్‌, జ్ఞానసంపన్న ఆత్మలుగా ఉంటారో, వారు ఎలాంటి బలహీనతకు గాని, సమస్యలకు గాని వశీభూతులుగా అవ్వరు. ఎందుకంటే వారు అమృతవేళ నుండి ఏం చూస్తారో, వింటారో, ఆలోచిస్తారో లేక కర్మలు చేస్తారో వాటిని లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేస్తారు. ఏ లౌకిక వ్యవహారమైనా నిమిత్తమాత్రం చేస్తున్నా, అలౌకిక కార్యము సదా స్మృతిలో ఉంటే ఏ విధమైన మాయావి వికారాలకు వశీభూతమైన వ్యక్తి సంపర్కము ద్వారా స్వయం వశీభూతులుగా అవ్వరు. తమోగుణి వైబ్రేషన్లలో కూడా సదా కమలపుష్ప సమానంగా ఉంటారు. లౌకిక బురదలో ఉంటున్నా దాని నుండి భిన్నంగా(అతీతంగా), వేరుగా ఉంటారు.

స్లోగన్‌ :- '' అందరినీ తృప్తి(సంతుష్ట) పరిస్తే పురుషార్థంలో స్వతహాగా హైజంప్‌ జరుగుతుంది ''

No comments:

Post a Comment