Tuesday, September 17, 2019

Telugu Murli 15/09/2019

15-09-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 28-01-1985 మధువనము

విశ్వ సేవకు సహజ సాధనము - '' మనసా సేవ ''
ఈ రోజు సర్వ శక్తివంతుడైన తండ్రి తన శక్తి సేనను, పాండవ సేనను, ఆత్మిక సేనను చూస్తున్నారు. సైన్యములోని మహావీరులు తమ ఆత్మిక శక్తితో ఎంతవరకు విజయులుగా అయ్యారో చూస్తున్నారు. విశేషంగా మూడు శక్తులు చూస్తున్నారు. ప్రతి మహావీర్‌ ఆత్మ యొక్క మనసాశక్తి ఎంతవరకు స్వ పరివర్తన పట్ల, సేవ పట్ల ధారణ అయ్యింది? అలాగే వాచా శక్తి, కర్మణా శక్తి అనగా శ్రేష్ఠ కర్మల శక్తి ఎంతవరకు జమ చేసుకున్నారు? విజయీ రత్నాలుగా అయ్యేందుకు ఈ మూడు శక్తులు అవసరము. మూడింటిలో ఏ ఒక్క శక్తి తక్కువైనా వర్తమాన ప్రాప్తి మరియు ప్రాలబ్ధము తగ్గిపోతుంది. విజయీ రత్నాలనగా మూడు శక్తులతో సంపన్నమైనవారు. విశ్వ సేవాధారి నుండి విశ్వ రాజ్యధికారులుగా అయ్యేందుకు ఆధారము - ఈ మూడు శక్తుల సంపన్నత. సేవాధారులుగా అవ్వడం, విశ్వ సేవాధారులుగా అవ్వడం, విశ్వ రాజులుగా అవ్వడం, సత్యయుగంలో రాజులుగా అవ్వడం - ఇందులో కూడా వ్యత్యాసముంది. సేవాధారులు అనేకమంది ఉన్నారు, విశ్వ సేవాధారులు కొద్దిమందే ఉన్నారు. సేవాధారులనగా మూడు శక్తులను నంబరువార్‌ యథాశక్తి ధారణ చేసినవారు. విశ్వ సేవాధారులనగా మూడు శక్తులలో సంపన్నంగా ఉండేవారు. ఈరోజు ప్రతి ఒక్కరి మూడు శక్తులలో పర్సెంటేజ్‌(శాతము) చూస్తున్నారు.
సర్వ శ్రేష్ఠమైన మనసా శక్తి ద్వారా, ఆత్మ సన్ముఖములో ఉన్నా, సమీపంగా ఉన్నా లేక ఎంత దూరములో ఉన్నా - ఆ ఆత్మకు ఒక సెకండులో ప్రాప్తిని(శక్తిని) అనుభూతి చేయించగలరు. మనసాశక్తి ఆత్మల మానసిక ఆందోళనకర స్థితిని కూడా అచలంగా చేయగలదు. మానసిక శక్తి అనగా శుభ భావన, శ్రేష్ఠ కామన. ఈ శ్రేష్ఠ భావన ద్వారా ఏ ఆత్మలనైనా సంశయబుద్ధి గలవారి నుండి భావనాత్మక బుద్ధి గలవారిగా చేయగలరు. ఈ శ్రేష్ఠ భావన ద్వారా ఏ ఆత్మ యొక్క వ్యర్థ భావననైనా పరివర్తన చేసి సమర్థ భావాన్ని తయారు చేస్తుంది. శ్రేష్ఠ భావము ద్వారా ఏ ఆత్మ స్వభావమునైనా మార్చగలరు. శ్రేష్ఠ భావనా శక్తి ద్వారా ఆత్మకు భావనా ఫలాన్ని అనుభూతి చేయించగలరు. శ్రేష్ఠ భావన ద్వారా భగవంతునికి సమీపంగా తీసుకు రాగలరు. శ్రేష్ఠ భావన ఏ ఆత్మ యొక్క భాగ్య రేఖనైనా మార్చగలదు. శ్రేష్ఠ భావన ధైర్యహీన ఆత్మను ధైర్యశాలిగా చేస్తుంది. ఈ శ్రేష్ఠ భావనా విధి ద్వారా మీరు ఏ ఆత్మకైనా మనసా సేవ చేయవచ్చు. వర్తమాన సమయానుసారంగా మనసా సేవ చాలా అవసరము. అయితే ఎవరి మనసు అనగా సంకల్పాలు సదా సర్వల పట్ల శ్రేష్ఠంగా, నిస్వార్థంగా ఉంటాయో, వారే మనసా సేవ చేయగలరు. సదా పరోపకారి భావన ఉండాలి. అపకారి పై కూడా ఉపకార భావన ఉండాలి. సదా దాతృత్వ భావన ఉండాలి. సదా స్వ పరివర్తన ద్వారా, స్వంత శ్రేష్ఠ కర్మల ద్వారా ఇతరులకు శ్రేష్ఠ కర్మలు చేయాలనే ప్రేరణ కలిగించేవారిగా ఉండాలి. వీరు చేస్తే నేను చేస్తాను, వీరు కొన్ని చేస్తే, కొన్ని నేను చేస్తాను లేక వీరు కూడా కొంచెం చేయాలి - ఇటువంటి భావనలకు కూడా అతీతంగా అవ్వాలి. ఎవరైనా చేయలేనప్పుడు దయా భావన, సదా సహయోగమిచ్చే భావన, వారి ధైర్యాన్ని పెంచే భావన కలిగి ఉండాలి. ఇటువంటి వారిని మససా సేవాధారులని అంటారు. మనసా సేవను ఒక స్థానములో ఉంటున్నా నలువైపులా చేయగలరు. వాచా సేవ, కర్మణా సేవ చేయాలంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. మనసా సేవ అయితే ఎక్కడైనా కూర్చుని చేయవచ్చు,
మనసాసేవ - ఆత్మిక వైర్‌లెస్‌ సెట్‌ లాంటిది. దీని ద్వారా దూర సంబంధాలను సమీపంగా చేయగలరు. దూరంగా ఉన్న ఏ ఆత్మలోనైనా తండ్రికి చెందినవారిగా అవ్వాలనే ఉమంగ- ఉత్సాహాలు జన్మింపజేసే సందేశాన్ని ఇవ్వగలరు. ఆ ఆత్మ, నన్ను ఏదో ఒక మహాశక్తి పిలుస్తూ ఉందని, ఏవో కొన్ని అమూల్యమైన ప్రేరణలు నన్ను ప్రేరేపిస్తున్నాయని అనుభవం చేస్తుంది. ఎలాగైతే ఎవరికైనా సన్ముఖంలో సందేశమిచ్చి ఉమంగ-ఉత్లాహాలలోకి తీసుకొస్తారో, అలా మనసాశక్తి ద్వారా కూడా ఎవరో సన్ముఖంలో మాట్లాడ్తున్నారని ఆ ఆత్మ అనుభవం చేస్తుంది. దూరంగా ఉంటున్నా సన్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తుంది. విశ్వ సేవాధారులుగా అయ్యేందుకు సహజ సాధనము - మనసా సేవ. సైన్సు వారు ఈ సాకార సృష్టి నుండి, భూమి నుండి పైకి అంతరిక్షయానము ద్వారా తమ కార్యాన్ని శక్తిశాలిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థూలము నుండి సూక్ష్మములోకి వెళ్తున్నారు. ఎందుకు? సూక్ష్మము శక్తిశాలిగా ఉంటుంది. మనసాశక్తి కూడా అంతర్ముఖాయానము. దీని ద్వారా ఎక్కడకు కావాలంటే అక్కడకు, ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా చేరుకోగలరు. ఎలాగైతే సైన్సు ద్వారా భూమ్యాకర్షణకు అతీతంగా వెళ్లేవారు స్వతహాగానే తేలికగా అవుతారో అలా మనసా శక్తిశాలి ఆత్మ స్వతహాగానే డబల్‌లైట్‌ స్వరూపాన్ని సదా అనుభవం చేస్తుంది. ఎలాగైతే అంతరిక్షయానం వారు పైన ఎత్తులో ఉన్న కారణంగా మొత్తం పృథ్వి పై ఉన్న ఏ చిత్రము కావాలంటే ఆ చిత్రాన్ని(ఫోటోను) తీయగలరో అలా సైలెన్సు శక్తి ద్వారా, అంతర్ముఖతాయానం ద్వారా, మనసాశక్తి ద్వారా ఏ ఆత్మకైనా చరిత్రవంతులుగా అయ్యేందుకు, శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యేందుకు ప్రేరణనివ్వగలరు. సైన్సువారైతే ప్రతి వస్తువు పై సమయము మరియు సంపదను బాగా ఖర్చు చేస్తారు. కానీ మీరు ఖర్చు చేయకుండా కొద్ది సమయంలోనే చాలా సేవ చేయగలరు. ఎలాగైతే ఈ రోజుల్లో అక్కడక్కడ ఫ్లయింగ్‌ సాసర్లు చూస్తున్నారనే సమాచారము వింటున్నారు కదా. అక్కడ కూడా కేవలం లైటు మాత్రమే కనిపిస్తుంది. అలా ముందు ముందు మనసా సేవాధారి ఆత్మలైన మీ ముందుకు వచ్చి ఏదో లైటు బిందువు వచ్చి విచిత్రమైన అనుభవం చేయించి వెళ్లిందని అనుభవం చేస్తారు. వీరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? ఏమిచ్చి వెళ్లారు?- ఈ చర్చ ఎక్కువైతూ ఉంటుంది. ఎలాగైతే ఆకాశములో నక్షత్రాల వైపు అందరి దృష్టి వెళ్తుందో, అలా భూమి పై ఉన్న నక్షత్రాల దివ్య జ్యోతిని నలువైపులా అనుభవం చేస్తారు. మనసా సేవాధారులకు ఇటువంటి శక్తి ఉంటుంది. అర్థమయ్యిందా? వీరి మహానత ఇంకా చాలా ఉంది. కానీ ఈ రోజు ఇంత మాత్రమే వినిపిస్తున్నాము. ఇప్పుడు మససా సేవను తీవ్రము చేయండి. అప్పుడే 9 లక్షల మంది తయారవుతారు. ఇప్పుడు గోల్డెన్‌ జూబిలీ వరకు ఎంతమంది తయారవుతారు. సత్యయుగం కొరకు డైమండ్‌ జూబిలీ వరకు సంఖ్య 9 లక్షలైతే కావాలి కదా. లేకుంటే విశ్వానికి రాజు ఎవరి పైన రాజ్యము చేస్తారు? 9 లక్షల నక్షత్రాలని మహిమ చేయబడ్డాయి కదా. నక్షత్ర రూపి ఆత్మను అనుభవం చేసినప్పుడే 9 లక్షల నక్షత్రాలు అని మహిమ చేయబడ్తాయి. అందువలన ఇప్పుడు నక్షత్రాలను అనుభవం చేయించండి. మంచిది. నలువైపుల నుండి వచ్చిన పిల్లలు మధువన నివాసులుగా అయినందుకు అభినందనలు. ఈ అవినాశి అనుభవానికి లభించిన అభినందనలను సదా జతలో ఉంచుకోండి. అచ్ఛా.
సదా మహావీరులుగా అయ్యి మనసాశక్తి మహానత ద్వారా శేష్ఠ్రమైన సేవను చేసేవారు, సదా శేష్ఠ్ర భావన, శేష్ఠ్ర కామనల విధి ద్వారా అనంతమైన సిద్ధిని పొందేవారు, తమ ఉన్నత స్థితి ద్వారా నలువైపులా ఉన్న ఆత్మలకు శేష్ర ్ఠ పేర్రణను ఇచ్చే విశ్వ సేవాధారులు, సదా తమ శుభ భావన ద్వారా ఇతర ఆత్మలకు కూడా భావనా ఫలమును ఇచ్చేవారు - ఇటువంటి విశ్వకళ్యాణకారులు, పరోపకారి విశ్వ సేవాధారి పిల్లలకు బాప్‌దాదా పియ్రస్మృతులు మరియు నమస్తే.
కుమారుల పట్ల అవ్యక్త బాప్‌దాదా గారి విశేషమైన మధుర మహావాక్యాలు
కుమార్లు, బ్రహ్మకుమార్లుగా అయితే అయ్యారు కానీ బ్రహ్మకుమార్లుగా అయిన తర్వాత ఇంకేమి కావాలి? శక్తిశాలి కుమార్లుగా అవ్వాలి. ఎంతవరకు శక్తిశాలిగా అవ్వరో అంతవరకు విజయులుగా అవ్వలేరు. శక్తిశాలి కుమార్లు సదా నాలెడ్జ్‌ఫుల్‌ మరియు పవర్‌ఫుల్‌ ఆత్మలుగా ఉంటారు. నాలెడ్జఫుల్‌ అనగా రచయితను కూడా తెలుసుకున్నవారు, రచనను కూడా తెలుసుకున్నవారు, అంతేకాక మాయ యొక్క భిన్న భిన్న రూపాలు కూడా తెలిసినవారు. ఇటువంటి నాలెడ్జ్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్నవారు సదా విజయులుగా ఉంటారు. జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయడం అనగా జ్ఞానాన్ని శస్త్రముగా తయారు చేసుకోవడం. కనుక శస్త్రధారులు శక్తిశాలిగా ఉంటారు కదా. ఈరోజు మిలిటరి వారు ఏ ఆధారముతో శక్తిశాలిగా అవుతారు? శస్త్రాలు, తుపాకులు ఉంటే నిర్భయులుగా అవుతారు. కనుక ఎవరైతే నాలెడ్జ్‌ఫుల్‌గా ఉంటారో వారు తప్పకుండా పవర్‌ఫుల్‌గా ఉంటారు. కనుక మాయను గురించిన పూర్తి జ్ఞానము కూడా ఉంటుంది. ఏమవుతుంది? ఎలా అవుతుంది? మాయ ఎలా వచ్చిందో తెలియదు, అనే ప్రశ్నలుంటే వారు నాలెడ్జ్‌ఫుల్‌ కాదు. నాలెడ్జ్‌ఫుల్‌ ఆత్మకు ముందే తెలుసు. ఎలాగైతే ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు జబ్బును ముందే తెలుసుకుంటారు. జ్వరము వస్తుందంటే ముందే ఏదో అవుతూ ఉందని అనుకుంటారు. ముందే మందు తీసుకొని స్వయాన్ని బాగు చేసుకొని ఆరోగ్యవంతులుగా అవుతారు. తెలివిలేని వారికి జ్వరము వచ్చినా వారు నడుస్తూ తిరుగుతూ ఉంటారు. అందువలన జ్వరము ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలాగే మాయ వస్తుంది కాని అది రాకముందే అర్థం చేసుకొని దానిని దూరము నుండే పారద్రోలాలి. మీరు ఇటువంటి శక్తిశాలి తెలివి గల కుమార్లు కదా. సదా విజయులే కదా లేక మీకు కూడా మాయ వస్తుందా? దానిని పారద్రోలుటలో సమయం ఉపయోగిస్తున్నారా? శక్తిని చూసి దూరం నుండే శత్రువు పారిపోతుంది. ఒకవేళ వచ్చిన తర్వాత పారదోలుతూ ఉంటే సమయం వృథా అవుతుంది. బలహీనత అలవాటైపోతుంది. ఎవరైనా మాటి మాటికి జబ్బు పడ్తే బలహీనంగా ఉన్నారని అంటారు. అలాగే మాయ పదే పదే వస్తూ, దాడి చేస్తూ ఉంటే ఓడిపోయేందుకు అలవాటు పడ్తారు. పదే పదే ఓడిపోయినందున బలహీనమైపోతారు. కనుక శక్తిశాలిగా అవ్వరు. ఇటువంటి శక్తిశాలి ఆత్మ సదా ప్రాప్తిని అనుభవం చేస్తుంది. యుద్ధములో తన సమయాన్ని పోగొట్టుకోదు. విజయం పొంది సంతోషిస్తుంది. కనుక ఎప్పుడూ ఏ విషయములోనూ బలహీనంగా ఉండరాదు. కుమార్ల బుద్ధి మంచిగా ఉంటుంది. అదర్‌కుమార్లుగా అయితే బుద్ధి అనేక వైపులకు పంచబడ్తుంది. కుమార్లకు ఒకే పని ఉంటుంది. వారికి తమ జీవితమొక్కటే కాని అదర్‌కుమార్లకైతే అనేక బాధ్యతలుంటాయి. మీరు బాధ్యత నుండి స్వతంత్రులుగా ఉన్నారు. ఎవరైతే స్వతంత్రులుగా ఉంటారో వారు ముందుకు వెళ్తారు. బరువు, బాధ్యతలుండేవారు మెల్ల మెల్లగా నడుస్తారు. స్వతంత్రులు తేలికగా ఉంటారు కనుక వేగంగా నడుస్తారు. కనుక తీవ్ర వేగం గలవారిగా ఏకరసంగా ఉన్నారా? సదా తీవ్రము అనగా ఏకరసము. 6 మాసాలు గడిచినా ఎలా ఉంటే అలాగే నడుస్తూ ఉండరాదు. దీనిని తీవ్ర వేగమని అనరు. తీవ్రవేగం గలవారు ఈ రోజు కంటే రేపు ముందుగా, మర్నాడు అంతకంటే ముందు ఉండాలి. దీనిని తీవ్రవేగం గలవారని అంటారు. కనుక స్వయాన్ని సదా శక్తిశాలి కుమార్‌గా భావించండి. బ్రహ్మకుమార్లుగా అయ్యాము, చాలు అని సంతోషించి శక్తిశాలిగా అవ్వకుంటే విజయులుగా అవ్వలేరు. బ్రహ్మకుమార్లుగా అవ్వడం చాలా మంచిదే కాని శక్తిశాలిగా బ్రహ్మకుమార్లు సదా సమీపంగా ఉంటారు. ఇప్పుడు సమీపంగా ఉండేవారు రాజ్యములో కూడా సమీపంగా ఉంటారు. ఇప్పటి స్థితిలో సమీపత లేకుంటే రాజ్యములో కూడా సమీపత ఉండదు. ఇప్పటి ప్రాప్తి సదా కొరకు ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేయిస్తుంది. అందువలన సదా శక్తిశాలిగా ఉండండి. ఇటువంటి శక్తిశాలురే విశ్వకళ్యాణకారులుగా అవ్వగలరు. కుమార్లలో శక్తి ఉండనే ఉంది. శారీరిక శక్తి గానీ, ఆత్మిక శక్తి గానీ ఎక్కువగా ఉంటుంది. కానీ విశ్వకళ్యాణము కొరకు ఉపయోగపడే శక్తి ఉందా? లేక శ్రేష్ఠమైన విశ్వాన్ని వినాశకారిగా చేయు కార్యములో ఉపయోగించే శక్తి ఉందా? కనుక మీరు కళ్యాణ కుమారులు కదా! అకళ్యాణము చేసేవారు కాదు. సంకల్పంలో కూడా సదా సర్వుల పట్ల కళ్యాణ భావన ఉండాలి. స్వప్నములో కూడా కళ్యాణ భావన ఉండాలి. అలా ఉంటే శ్రేష్ఠ శక్తిశాలురని అంటారు. కుమార్లు వారి శక్తి ద్వారా ఏమనుకుంటే అది చేయగలరు. ఏ సంకల్పము చేస్తారో, అదే కర్మ. రెండూ జత జతలో ఉండాలి. ఈ రోజు సంకల్పము చేసి, కర్మ మరెప్పుడో చేయరాదు. సంకల్పము మరియు కర్మ ఒక్కటిగానే ఉండాలి, జత జతలో ఉండాలి. ఇటువంటి శక్తి ఉండాలి. ఇటువంటి శక్తి గలవారే అనేక ఆత్మల కళ్యాణము చేయగలరు. కనుక సదా సేవలో సఫలంగా అయ్యేవారా లేక గొడవలు చేసేవారా? మనసులో, కర్మలో పరస్పరములో అన్నిటిలో బాగుండాలి. ఎందులోనూ గొడవ ఉండరాదు. సదా స్వయాన్ని విశ్వ కళ్యాణకారి కుమార్‌గా భావిస్తే, ఏ కర్మ చేసినా అందులో కళ్యాణ భావన ఇమిడి ఉంటుంది.
వీడ్కోలు సమయంలో, అమృతవేళలో పిల్లలందరికి యాద్‌ప్యార్‌ ఇచ్చారు
ప్రతి కార్యము మంగళకరంగా జరగాలి. ప్రతి కార్యము సఫలమవ్వాలి. అందుకు పిల్లలందరికి అభినందనలు. సంగమ యుగములో ప్రతిరోజు శుభప్రదమైనదే, శ్రేష్ఠమైనదే. ఉమంగ- ఉత్సాహాలనిప్పించేది. అందువలన ప్రతిరోజుకు దాని మహత్వము దానికి ఉంది. ఈ రోజు ప్రతి సంకల్పము మంగళమయంగా ఉండాలి అనగా శుభ చింతక రూపం గలదిగా ఉండాలి. ఎవరి పట్ల అయినా మంగళకామన అనగా శుభకామన చేసే సంకల్పంగా ఉండాలి. ప్రతి సంకల్పము మంగళకరము అనగా సంతోషమునిప్పించేదిగా ఉండాలి. కనుక ఈనాటి ఈ మహత్వము - సంకల్పము, మాట, కర్మ మూడింటిని విశేషంగా స్మృతిలో ఉంచుకోవాలి. ఈ స్మృతి ఉండడమే ప్రతి సెకండు బాప్‌దాదా యాద్‌ప్యార్‌ను స్వీకరించుట. కనుక ఇప్పుడు కేవలం యాద్‌ప్యార్‌ ఇవ్వడం లేదు. కాని ప్రాక్టికల్‌గా చేయడమనగా యాద్‌ప్యార్‌ తీసుకోవడం. ఈ రోజంతా యాద్‌ప్యార్‌ తీసుకోవడమనగా స్మృతిలో ఉండి, ప్రతి సంకల్పము, ప్రతి మాట ద్వారా, ప్రేమ అలలలో తేలియాడుతూ ఉండుట. అందరికి విశేషమైన స్మృతి మరియు గుడ్‌మార్నింగ్‌.
సమ్మేళనము పట్ల అవ్యక్త బాప్‌దాదా గారి విశేషమైన సందేశము
బాప్‌దాదా చెప్తున్నారు - పిల్లలూ, సమ్మేళనం చేస్తున్నారు. సమ్మేళనానికి అర్థము - సం-మిలనము. కనుక ఎవరైతే సమ్మేళనానికి వస్తారో వారిని తండ్రి సమానంగా లేక నిశ్చయబుద్ధి కలిగి మీ సమానంగా తప్పకుండా చేయాలి. ఎవరెవరు వస్తారో వారు ఏదో కొంత తయారై వెళ్లాలి. కేవలం మాటలు చెప్పి వెళ్లరాదు. ఇది దాత ఇల్లు. కనుక వచ్చేవారు మేము వీరికి సహాయం చేసేందుకు వచ్చామని భావించరాదు లేక వీరికి సహయోగమిచ్చేందుకు వచ్చామని భావించరాదు. కాని ఈ స్థానము తీసుకునే స్థానమని, ఇచ్చే స్థానము కాదని భావించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఎవరిని కలిసినా, ఎవరైతే ఆ సమయంలో ఇక్కడ ఉంటారో వారు ఈ సంకల్పం చేయాలి - '' దృష్టి ద్వారా, వాయుమండలం ద్వారా, సంబంధ-సంపర్కము ద్వారా మాస్టర్‌ దాతలుగా అయ్యి ఉండాలి.'' అందరికీ ఏదో ఒకటి ఇచ్చే పంపించాలి. ఈ లక్ష్యము ప్రతి ఒక్కరికి ఉండాలి. వచ్చేవారికి గౌరవమునైతే ఇవ్వాల్సిందే. కానీ అందరి గౌరవము ఒక్క తండ్రిలో కూర్చోబెట్టాలి. అనగా అందరూ తండ్రిని గౌరవించునట్లు చేయాలి. బాబా అంటారు - నా లైట్‌హౌస్‌ పిల్లలందరూ నలువైపుల నుండి మనసా సేవ ద్వారా లైటునిస్తే సఫలత లభించే ఉంది. ఆ లైట్‌హౌస్‌ ఒక్కటే ఎంతమందికి దారి చూపుతుంది? లైట్‌హౌస్‌ - మైట్‌హౌస్‌ పిల్లలైన మీరు చాలా అద్భుతాలు చేయగలరు. అచ్ఛా.

వరదానము :- '' ఈశ్వరీయ సేవా బంధనము ద్వారా సమీప సంబంధములోకి వచ్చే రాయల్‌ ఫ్యామిలీకే అధికారి భవ ''
ఈశ్వరీయ సేవా బంధనమ సమీప సంబంధములోకి తీసుకొస్తుంది. ఎవరు ఎంత సేవ చేస్తారో, అంత సేవా ఫలము సమీప సంబంధములోకి వస్తుంది. ఇక్కడి సేవాధారులు అక్కడి రాయల్‌ ఫ్యామిలీకి అధికారులుగా అవుతారు. ఇక్కడ ఎంత కష్టపడి సేవ చేస్తారో, అక్కడ అంత సుఖంగా సింహాసనము పై కూర్చుంటారు. ఇక్కడ ఎవరైతే విశ్రాంతి తీసుకుంటారో, వారు అక్కడ పనులు చేస్తారు. ఒక్కొక్క సెకండుకు, ఒక్కొక్క పనికి లెక్కాచారము తండ్రి వద్ద ఉంది.

స్లోగన్‌ :- '' స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తనను చేసే వైబ్రేషన్లను తీవ్ర వేగంతో వ్యాపింపజేయండి ''

No comments:

Post a Comment