Saturday, September 21, 2019

Telugu Murli 22/09/2019

22-09-2016 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 30-01-1985 మధువనము

'' మాయాజీతులు మరియు ప్రకృతిజీతులే స్వరాజ్య అధికారులు ''
ఈ రోజు నలువైపులా ఉన్న రాజ్యాధికారి పిల్లల రాజదర్బారును చూస్తున్నారు. నలువైపులా చాలాకాలం తర్వాత కలిసిన(అపురూపమైన) స్నేహితులైన, బేహద్‌ సేవాధారులైన, అనన్యమైన పిల్లలు ఉన్నారు. అటువంటి పిల్లలు ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారి రాజదర్బారులో ఉపస్థితులై ఉన్నారు. బాప్‌దాదా ఇటువంటి యోగ్యులైన పిల్లలను, సదాకాలిక యోగీ పిల్లలను అతి నిర్మాణచిత్తులై, ఉన్నతమైన స్వమానములో ఉండే పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. స్వరాజ్య దర్బారు మొత్తం కల్పంతటిలో అలౌకికమైనది, అన్ని దర్బారుల కంటే అతీతమైనది మరియు అతి ప్రియమైనది. స్వరాజ్య అధికారులు ప్రతి ఒక్కరూ విశ్వ జ్ఞానానికి పునాది, నూతన విశ్వానికి నిర్మాతలు. స్వరాజ్య అధికారులు ప్రతి ఒక్కరు ప్రకాశిస్తున్న దివ్య తిలకధారులు మరియు సర్వ విశేషతలతో ప్రకాశిస్తున్న అమూల్యమైన మణులతో అలంకరింపబడి ఉన్న కిరీటధారులు. దివ్య గుణాల మాలను ధారణ చేసి శ్రేష్ఠ స్థితి రూపి సింహాసనము పై ఉపస్థితులై ఉన్నారు. ఇటువంటి అలంకరింపబడిన రాజ్యాధికారులు దర్బారులో ఉపస్థితులై ఉన్నారు. ఇటువంటి రాజ్యదర్బారు బాప్‌దాదా ఎదురుగా ఉపస్థితమై ఉంది. ప్రతి స్వరాజ్య అధికారి ముందు ఎంతమంది దాస-దాసీలు ఉన్నారు? వారు ప్రకృతిజీతులు మరియు వికారాలను జయించినవారు. వికారాలు కూడా 5 ఉన్నాయి, ప్రకృతి తత్వాలు కూడా 5 ఉన్నాయి. కావున ప్రకృతి కూడా దాసిగా అయిపోయింది కదా! శత్రువులు సేవాధారులుగా అయిపోయారు. ఇలా ఆత్మిక నషాలో ఉండేవారు, వికారాలను కూడా పరివర్తన చేసి కామ వికారమును శుభభావన, శ్రేష్ఠకామనా స్వరూపంలోకి మార్చి సేవలో వినియోగించేవారు, ఇలా శత్రువులను సేవాధారులుగా చేసేవారు ప్రకృతి ఏ తత్వానికి వశీభూతులుగా అవ్వరు. కానీ ప్రతి తత్వమును తమో గుణి రూపము నుండి సతోప్రధాన స్వరూపంగా చేసుకుంటారు. కలియుగములో ఈ తత్వాలు మోసగిస్తాయి మరియు దు:ఖమునిస్తాయి, సంగమ యుగములో పరివర్తన అవుతాయి, రూపాన్ని మార్చుకుంటాయి. సత్యయుగములో ఈ పంచ తత్వాలు దేవతలకు సుఖసాధనాలుగా అయిపోతాయి. ఈ సూర్యుడు మీకు భోజనాన్ని తయారుచేసే వంటవానిగా అవుతాడు కదా, ఈ వాయువు మీకు ప్రకృతి సిద్ధమైన పంఖా(ఫ్యాన్‌)గా అయిపోతుంది, మీ మనోరంజన సాధనంగా అవుతుంది. వాయువు వీచినప్పుడు వృక్షాలు కదులుతాయి, అప్పుడు వాటి కొమ్మలు, రెమ్మలు ఎలా ఊగుతాయంటే అవి ఊగడం వలన రకరకాల సంగీత వాయిద్యాల వలే స్వతహాగా మ్రోగుతూ ఉంటాయి. కనుక అది మనోరంజన సాధనంగా అయిపోయింది కదా! ఈ ఆకాశము మీ అందరి కొరకు రాజమార్గంగా అవుతుంది. విమానాలు ఎక్కడ నడిపిస్తారు? ఈ ఆకాశమే మీ మార్గముగా అవుతుంది. ఇంతకన్నా పెద్ద హైవే(రాజమార్గము) ఇంకెక్కడైనా ఉందా? విదేశాలలో ఉందా? ఎన్ని మైళ్ళ విస్తారముతో తయారు చేసినా ఆకాశ మార్గాని కంటే చిన్నదిగానే ఉంటుంది కదా! ఇంత పెద్ద హైవే మార్గము ఇంకేదైనా ఉందా? అమెరికాలో ఉందా? అది ప్రమాద రహిత మార్గముగా ఉంటుంది. 8 సంవత్సరాల బాలుడు నడిపినా క్రింద పడడు(ప్రమాదము జరగదు). అర్థమయ్యిందా! ఈ జలము సుగంధ ద్రవ్యముగా(సెంటుగా) పని చేస్తుంది. ఎలాగైతే వనమూలికల కారణంగా గంగాజలము ఈనాటికి కూడా ఇతర జలాల కంటే పవిత్రంగా ఉందో, అదే విధంగా సుగంధ భరితమైన మూలికల కారణంగా జలములో ప్రకృతి సిద్ధమైన సుగంధము ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ పాలు శక్తినిస్తాయో, అక్కడి జలమే శక్తిశాలిగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే పాల నదులు ప్రవహిస్తాయని అంటారు. అందరూ ఇప్పటి నుండే సంతోషపడిపోతున్నారు కదా! అలాగే ఈ పృధ్వి ఎటువంటి శ్రేష్ఠమైన ఫలాలు ఇస్తుందంటే ఎటువంటి రకరకాల రుచులను కోరుకుంటే అటువంటి రుచుల ఫలాలు మీ ముందు హాజరై ఉంటాయి. ఈ ఉప్పు ఉండదు, పంచదార కూడా ఉండదు. ఎలాగైతే ఇప్పుడు పులుపు కోసం టమోటా ఉందో, దాని ద్వారా పులుపుదనం వచ్చేస్తుందో, అలా మీకు ఏ రుచి కావాలనుకుంటే అటువంటి ఫలాలు ఉంటాయి. ఆ రసాన్ని వేస్తూనే ఆ రుచి వచ్చేస్తుంది. కావున ఈ పృధ్వి - ఒకటేమో శ్రేష్ఠమైన ఫలాలను, శ్రేష్ఠమైన ఆహారమును ఇచ్చే సేవ చేస్తుంది, రెండవది - సహజ సిద్ధమైన దృశ్యాలు వేటినైతే ప్రకృతి అని అంటారో ఆ ప్రాకృతిక దృశ్యాలు ఉంటాయి. పర్వతాలు కూడా ఉంటాయి. ఇలా నిటారుగా ఉండే పర్వతాలు ఉండవు. ప్రకృతి సౌందర్యంతో కూడుకున్న భిన్న-భిన్న రూపాలలో పర్వతాలు ఉంటాయి. కొన్ని పక్షి రూపంలో, మరికొన్ని పుష్పాల రూపంలో ఉంటాయి. ఇలాంటి ప్రకృతి సిద్ధమైన నిర్మాణం కలిగి ఉంటాయి. కేవలం నిమిత్తమాత్రంగా కొద్దిగా చేయి వేయవలసి ఉంటుంది. ఇలా ఈ పంచ తత్వాలు సేవాధారులుగా అయిపోతాయి. కానీ ఎవరికి సేవాధారులుగా అవుతాయి? స్వరాజ్య అధికారి ఆత్మలకు సేవాధారులుగా అవుతాయి. కావున ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి - పంచ వికారాలు శత్రువుల నుండి మారి సేవాధారులుగా అయ్యాయా? అప్పుడే స్వరాజ్య అధికారులని పిలవబడ్తారు. క్రోధాగ్ని - యోగాగ్నిగా మారిపోవాలి. అలాగే లోభమనే వికారము - లోభమనగా కోరిక. కావాలి అనే హద్దు కోరిక నుండి శుభ కామనగా అయిపోవాలి. నేను సదా ప్రతి సంకల్పము ద్వారా, వాక్కు ద్వారా, నిస్వార్థమైన బేహద్‌ సేవాధారిగా అయిపోవాలి. నేను తండ్రి సమానంగా అయిపోవాలనే శుభమైన కోరిక అనగా లోభము యొక్క పరివర్తన స్వరూపము. దీనిని శత్రుత్వానికి బదులు సేవాకార్యములో వినియోగించండి. మోహమైతే అందరికి చాలా ఉంది కదా! బాప్‌దాదా పైనైతే మోహముంది కదా! ఒక్క సెకను కూడా దూరంగా ఉండకూడదని భావించడం కూడా మోహమే కదా! కానీ ఈ మోహము సేవ చేయిస్తుంది. మీ నయనాలలోకి ఎవరు చూసినా వారు మీ నయనాలలో ఇమిడి ఉన్న తండ్రిని చూడాలి. ఏం మాట్లాడినా నోటి ద్వారా తండ్రి అమూల్యమైన మాటలనే వినపడాలి. కావున మోహ వికారము కూడా సేవలో వినియోగించబడింది కదా! పరివర్తన అయ్యింది కదా! అదే విధంగా అహంకారము కూడా - ఈ దేహాభిమానుల నుండి ఆత్మాభిమానులుగా అయిపోతారు. శుభమైన అహంకారము అనగా ఆత్మనైన నేను విశేషాత్మగా అయిపోయాను, పదమాపదమ్‌ భాగ్యశాలిగా అయిపోయాను, నిశ్చింత చక్రవర్తిగా అయిపోయాను అన్నదే శుభ అహంకారము. శుభ అహంకారము ఈశ్వరీయ నషా. ఇది సేవకు నిమిత్తంగా అయిపోతుంది. కావున ఈ విధంగా 5 వికారాలు మారి సేవా సాధనాలుగా అయిపోతే శత్రువుల నుండి సేవాధారులుగా అయిపోయినట్లే కదా! కావున మాయాజీతులుగా, ప్రకృతిజీతులుగా ఎంతవరకు అయ్యారని చెక్‌ చేసుకోండి. ఎప్పుడైతే మొదట దాస-దాసీలు అవుతారో, అప్పుడు రాజులుగా అవుతారు. ఎవరైతే స్వయం దాసులకు అధీనులుగా ఉంటారో వారు రాజ్యాధికారులుగా ఎలా అవుతారు?
ఈ రోజు భారతదేశ పిల్లల మేళా ప్రోగ్రాం అనుసారంగా చివరిరోజు. కావున ఇది మేళాలోని అంతిమ మునక. దీనికి మహత్వముంటుంది. ఈ మహత్వపూర్ణమైన రోజున ఆ మేళాలోకి వెళ్ళినప్పుడు పాపాలేవైతే మిగిలి ఉన్నాయో వాటన్నిటినీ భస్మం చేసి, సమాప్తం చేసి వెళ్తున్నామని భావిస్తారు. కావున అందరూ పంచ వికారాలను సదాకాలానికి సమాప్తం చేసే సంకల్పము చేయాలి. ఇది అంతిమ మునకకు గల మహత్వము. కావున అందరూ పరివర్తనవ్వాలనే దృఢ సంకల్పము చేశారా? వదలడం కాదు, పరివర్తన చెందాలి. శత్రువు మీకు సేవాధారిగా అయినట్లయితే మీకు శత్రువు ఇష్టమా లేక సేవాధారి ఇష్టమా? కావున ఈ రోజు చెక్‌ చేసుకొని చేంజ్‌ అవ్వండి. అదే మిలనమేళాకు గల మహత్వము. ఏం చేయాలో అర్థమయ్యిందా! నాలుగైతే సరిగ్గానే ఉన్నాయి, మిగిలిన ఒక్కటి నడుస్తుందిలే అని భావించకండి. ఆ ఒక్కటి నాల్గింటినీ మళ్ళీ తీసుకొస్తుంది. వీటిలో కూడా పరస్పర స్నేహముంది. అందుకే రావణుని తలలు జతలో తోడుగా ఉన్నట్లు చూపిస్తారు. కనుక దశరాను జరుపుకొని వెళ్ళండి. అంత్యము చేసి, కాల్చి వేసి, బూడిదను మీతో తీసుకెళ్లకండి. బూడిదను తీసుకెళ్లినా మళ్ళీ అది భూతంగా అయ్యి వస్తుంది. కావున దానిని కూడా జ్ఞానసాగరంలో సమాప్తంచేసి వెళ్ళండి. మంచిది.
ఇటువంటి సదా స్వరాజ్య అధికారులకు, అలౌకిక తిలకధారులకు, కిరీటధారులకు, పక్రృతిని దాసిగా తయారుచేసుకునే వారికి, 5 శతువ్రులను సేవాధారులుగా చేసుకునే వారికి, సదా నిశ్చింత చకవ్రర్తులకు, ఆత్మిక నశాలో ఉండే చకవ్రర్తులకు, తండి సమానమైన సదా విజయులైన పిల్లలకు బాప్‌దాదాల పియ్రస్మృతులకు మరియు నమస్తే.
కుమారీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక :-
1. అందరూ స్వయాన్ని శ్రేష్ఠ కుమారీలుగా అనుభవం చేసుకుంటున్నారా? సాధారణంగా కుమారీలు ఉద్యోగము అనే గంపనైనా ఎత్తుకుంటారు లేక దాసిగా అయినా అయిపోతారు. కాని శ్రేష్ఠ కుమారీలు విశ్వకళ్యాణకారులుగా అయిపోతారు. మీరు ఇటువంటి శ్రేష్ఠ కుమారీలే కదా! మీ జీవితములో శ్రేష్ఠమైన లక్ష్యము ఏది? సాంగత్య దోషము నుండి లేక సంబంధాల బంధనాల నుండి ముక్తులవ్వడమే కదా! బంధనంలో బంధింపబడేవారు కారు. ఏం చేయాలి బంధనాలున్నాయి, ఏం చేయాలి ఉద్యోగం చేయాలి అనేవారినే బంధనాలు గలవారని అంటారు. కనుక కుమారీలకు సంబంధాల బంధనమూ లేదు, ఉద్యోగమనే గంప ఎత్తుకునే బంధనమూ లేదు. ఈ రెండు బంధనాల నుండి అతీతంగా ఉన్నవారే తండ్రికి ప్రియమైనవారుగా అవుతారు. ఇలా నిర్బంధనులుగా ఉన్నారా? రెండు జీవితాలు మీ ముందు ఉన్నాయి. సాధారణ కుమారీల భవిష్యత్తు మరియు విశేష కుమారీల భవిష్యత్తు. రెండూ మీ ముందు ఉన్నాయి కావున రెండింటినీ చూసి స్వయమే నిర్ణయించుకోవచ్చు. ఎలా చెప్తే అలా చేస్తామని కాదు. మీ నిర్ణయాన్ని మీరే జడ్జిగా అయ్యి తీసుకోండి. శ్రీమతమైతే విశ్వకళ్యాణకారులుగా అవ్వండనే చెప్తుంది. అదైతే సరియైనదే కానీ శ్రీమతం జత జతలో మానసిక ఉల్లాసంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వారు సదా సహజంగా ముందుకు వెళ్తారు. ఒకవేళ ఎవరైనా చెప్పడం ద్వారా లేక కొద్దిగా సిగ్గు కారణంగా ఇతరులు ఏమనుకుంటారో అని లేక నేను అలా అవ్వకపోతే అందరూ నన్ను బలహీనురాలిగా భావిస్తారని ఇలా భావిస్తూ ఎవరి బలవంతము కారణంగానైనా అయినట్లయితే పరీక్షలు పాస్‌ అవ్వడంలో కష్టపడవలసి వస్తుంది. స్వయం ఉత్సాహము గలవారికి ఎంత పెద్ద పరిస్థితులు వచ్చినా అవి వారికి సహజంగా అనుభవమవుతాయి. ఎందుకంటే వారి మనసు ఉల్లాసంగా ఉంది కదా! తమ ఉల్లాస-ఉత్సాహాలు వారికి రెక్కలుగా అవుతాయి. ఎంత పెద్ద పర్వతమునైనా ఎగిరే పక్షి సహజంగా దాటేస్తుంది. నడిచేవారు లేక ఎక్కేవారు ఎంతో కష్టంగా ఎంతో సమయం తర్వాత దాటుకుంటారు. కనుక ఈ మానసిక ఉల్లాసము రెక్కల వంటిది. ఈ రెక్కలతో ఎగిరేవారికి సదా సహజమవుతుంది. అర్థమయ్యిందా? కావున శ్రేష్ఠ మతము - విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి. అయినా స్వయం మీకు మీరే జడ్జిగా అయ్యి మీ జీవిత నిర్ణయం తీసుకోండి. తండ్రి అయితే నిర్ణయం ముందే ఇచ్చేశారు. ఇది క్రొత్త విషయం కాదు. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే సదా సఫలురుగా ఉంటారు. ఎవరైతే ఆలోచించి, అర్థం చేసుకొని ప్రతి అడుగు వేస్తారో వారు వివేకవంతులు, అలాగని ఆలోచిస్తూనే ఉండడం కాదు. కాని ఆలోచించి అర్థం చేసుకొని వెంటనే చేసెయ్యాలి. అటువంటి వారినే వివేకవంతులని అంటారు. సంగమ యుగంలో కుమారీలుగా అవ్వడం మొట్టమొదటి భాగ్యము. ఈ భాగ్యమైతే డ్రామానుసారము లభించింది. ఇప్పుడు భాగ్యములో భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇదే భాగ్యమును కార్యములో వినియోగించినట్లయితే భాగ్యము పెరుగుతూ ఉంటుంది. అలా కాక ఈ మొదటి భాగ్యమునే పోగొట్టుకున్నట్లయితే సదాకాలానికి అన్ని భాగ్యాలను పోగొట్టుకుంటారు. కావున మీరు భాగ్యవంతులు. భాగ్యవంతులుగా అయ్యి ఇప్పుడు ఇతర సేవాధారుల భాగ్యమును తయారు చేయండి. అర్థమయిందా!
సేవాధారి (టీచర్లు) అక్కయ్యలతో :-
సేవాధారులు అనగా సదా సేవ చేస్తూ దాని ఆనందములో ఉండేవారు. సదా స్వయాన్ని ఆనందమయమైన జీవితంలో అనుభవం చేసేవారు. సేవాధారి జీవితమనగా ఆనందాల జీవితము. కనుక మీరు ఇలా సదా స్మృతి మరియు సేవల ఆనందంలో ఉండేవారు కదా! స్మృతిలోనూ ఆనందముంది, సేవలోనూ ఆనందముంది. జీవితము కూడా ఆనందమయమైనదే, యుగము కూడా ఆనందకరమైనదే. ఎవరైతే సదా ఆనందంగా ఉంటారో వారిని చూసి ఇతరులు కూడా తమ జీవితంలో ఆనందాన్ని అనుభవం చేస్తారు. ఎవరు ఎంత చిక్కుల్లో ఉండి వచ్చినా, ఎవరైతే స్వయం ఆనందంగా ఉంటారో వారు ఇతరులను కూడా చిక్కుల నుండి విడిపించి ఆనందంలోకి తీసుకొస్తారు. ఇలా ఆనందంలో ఉండే సేవాధారులెవరైతే ఉన్నారో వారు సదా తనువు, మనసుతో ఆరోగ్యంగా ఉంటారు. ఆనందంగా ఉండేవారు సదా ఎగురుతూ ఉంటారు ఎందుకంటే వారికి సంతోషముంటుంది. వీరు సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారని అంటారు కదా! నడుస్తున్నారని అనరు. నాట్యం చేస్తున్నారని అంటారు. నాట్యం చేయడం అనగా పైకి లేవడం(ఉన్నతంగా అవ్వడం). పాదాలు పైన ఉన్నప్పుడే కదా నాట్యం చేయగలరు! కావున ఆనందాలలో ఉండేవారు అనగా సంతోషంగా ఉండేవారు. సేవాధారులుగా అవ్వడం అనగా వరదాత ద్వారా విశేషమైన వరదానాలు తీసుకోవడం. సేవాధారులకు విశేషమైన వరదానము - ఒకటి తమ అటెన్షన్‌, రెండవది వరదానము, డబల్‌ లిఫ్ట్‌. సేవాధారులుగా అవ్వడం అనగా సదా ముక్త ఆత్మలుగా అవ్వడం. జీవన్ముక్తిని అనుభవం చేయడం.
2. సదా సేవాధారులుగా, సఫలతా స్వరూపులుగా ఉన్నారా? సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. అధికారము సదా సహజంగా లభిస్తుంది. శ్రమ అనిపించదు. కావున మీరు అధికార రూపంలో సఫలతను అనుభవం చేసేవారు. సఫలత ఉండనే ఉంది అన్న నిశ్చయము మరియు నషా ఉండాలి. సఫలత ఉంటుందా, ఉండదా! అనే సంకల్పాలైతే నడవడం లేదు కదా? అధికారమున్నట్లయితే అధికారికి అధికారము లభించకపోవడమన్నది జరగదు. నిశ్చయముంటే విజయము తప్పకుండా లభిస్తుంది. సేవాధారుల పరిభాష ఇదే, ఏదైతే పరిభాష ఉందో అదే ఆచరణగా ఉంది. సేవాధారులు అనగా సహజ సఫలతను అనుభవం చేసేవారు.
వీడ్కోలు సమయంలో :-
(ఇప్పుడే వదిలి వెళ్ళవద్దు అన్న పాట అందరూ పాడారు) బాప్‌దాదా ఎంత ప్రేమసాగరులో అంత అతీతంగా ఉంటారు. స్నేహ భరిత మాటలు మాట్లాడ్తారు. ఇవి సంగమయుగ ఆనందాలు. ఆనందమైతే భలే జరుపుకోండి, తినండి, తాగండి, నాట్యం చేయండి కానీ నిరంతరము ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారో, అలాగే ఇమిడిపోయి ఉండండి. బాప్‌దాదా ప్రతి పుత్రుని హృదయగీతమునైతే వింటూనే ఉంటారు. ఈ రోజు నోటితో పాడిన పాట విన్నారు. బాప్‌దాదా శబ్ధాన్ని చూడరు, రాగాన్ని చూడరు. మనసులోని మాటను వింటారు. ఇప్పుడైతే సదా తోడుగా ఉన్నారు. సాకారంలో గాని, అవ్యక్తంలో గాని సదా జతలో ఉన్నారు. ఇప్పుడు వియోగపు రోజులు సమాప్తమైపోయాయి. ఇప్పుడు సంగమ యుగమంతా పూర్తిగా కలుసుకునే మేళా. కేవలం మేళాలో దృశ్యాలు రకరకాలుగా మారుతాయి. ఒకసారి వ్యక్తము, ఒకసారి అవ్యక్తము. మంచిది. గుడ్‌మార్నింగ్‌.

వరదానము :- '' ఆత్మిక శక్తి ఆధారము పై శారీరిక శక్తిని అనుభవం చేసే సదా స్వస్థ్‌ భవ (ఆరోగ్యవంతులుగా అవ్వండి) ''
ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండిటి ఆరోగ్యము అవసరమే. ఆత్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు శారీరిక లెక్కాచారాలు లేక శారీరిక రోగాలు శూలము నుండి ముల్లుగా అవ్వడం వలన స్వ స్థితి కారణంగా ఆరోగ్యాన్ని అనుభవం చేస్తారు. వారి మోము పై, ముఖము పై రోగముతో బాధపడే కష్టాల చిహ్నాలు ఉండవు. కర్మభోగాన్ని వర్ణన చేసేందుకు బదులు కర్మయోగ స్థితిని వర్ణన చేస్తారు. వారు పరివర్తన శక్తి ద్వారా కష్టమును సంతుష్టతలోకి పరివర్తన చేసి సంతుష్టంగా ఉంటారు. అంతేకాక సంతుష్ట అలలను వ్యాపింపజేస్తారు.

స్లోగన్‌ :- '' హృదయ పూర్వకంగా తనువుతో, పరస్పర ప్రేమతో సేవ చేసినట్లయితే సఫలత నిశ్చితంగా లభిస్తుంది.''

No comments:

Post a Comment