Friday, September 20, 2019

Telugu Murli 21/09/2019

21-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ ఈ చదువు సంపాదనకు మూలము. ఈ చదువు ద్వారా 21 జన్మల సంపాదనకు ఏర్పాటు జరుగుతుంది ''

ప్రశ్న :- ముక్తిధామానికి వెళ్లడం సంపాదనా లేక నష్టమా ?
జవాబు :- భక్తులకు ఇది కూడా సంపాదనే, ఎందుకంటే అర్ధకల్పము నుండి శాంతి-శాంతి అని వేడుకుంటూ వచ్చారు. చాలా కష్టపడిన తర్వాత కూడా శాంతి లభించలేదు. ఇప్పుడు తండ్రి ద్వారా శాంతి లభిస్తుంది అనగా ముక్తిధామములోకి వెళ్తారు కావున ఇది కూడా అర్ధకల్పము చేసిన కష్టానికి ఫలము. అందువలన దీనిని కూడా సంపాదన అని అంటారు, నష్టము కాదు. పిల్లలైన మీరైతే జీవన్ముక్తికి వెళ్లే పురుషార్థము చేస్తారు. మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి ప్రపంచ చరిత్ర - భూగోళమంతా నాట్యమాడుతోంది.

ఓంశాంతి. ఆత్మయే అంతా అర్థము చేసుకుంటుందని ఆత్మిక తండ్రి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అర్థం చేయించారు. ఈ సమయంలో పిల్లలైన మిమ్ములను తండ్రి ఆత్మిక ప్రపంచములోకి తీసుకెళ్తారు. దానిని ఆత్మిక దైవీ ప్రపంచమని, దీనిని దైహిక మానవుల ప్రపంచమని అంటారు. ఒకప్పుడు దేవతల ప్రపంచముండేదని, అది దైవీ మనుష్యుల పవిత్ర ప్రపంచమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనుష్యులు అపవిత్రంగా ఉన్నారు అందువలన ఆ దేవతలను కీరిస్తూ, పూజిస్తారు. వృక్షములో మొదట ఒకే ధర్మముంటుందనే స్మృతి ఉంది. విరాట రూపములో వృక్షము గురించి కూడా అర్థం చేయించాలి. ఈ వృక్షానికి బీజరూపులు పైన ఉన్నారు. వృక్షానికి బీజము తండ్రి. ఎలాంటి బీజమో, అలాంటి ఫలము అనగా ఆకులు మొదలైనవి వెలువడ్తాయి. ఇది కూడా అద్భుతమే కదా. ఇంత చిన్న వస్తువు ఎంత ఫలమునిస్తుంది! దాని రూపము ఎన్ని విధాలుగా మారుతూ ఉంటుంది. ఈ మానవ సృష్టి రూపీ వృక్షము గురించి ఎవ్వరికీ తెలియదు. దీనిని కల్పవృక్షమని అంటారు. దీనిని గురించి గీతలో మాత్రమే వర్ణించబడింది. భగవద్గీతయే నెంబర్‌వన్‌ ధర్మ శాస్త్ర్రమని అందరికీ తెలుసు. శాస్త్రాలు కూడా నంబరువారుగా ఉంటాయి కదా. ధర్మాలు కూడా నంబరువారుగా ఎలా స్థాపించబడతాయో, అది కూడా కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మరెవ్వరిలోనూ ఈ జ్ఞానము ఉండదు. మొట్టమొదట ఏ ధర్మానికి చెందిన వృక్షము ఉండేదో, తర్వాత అందులో ఇతర ధర్మాలు ఎలా వృద్ధి చెందుతాయో మీ బుద్ధిలో ఉంది. దీనిని విరాట నాటకమని అంటారు. పిల్లల బుద్ధిలో మొత్తం వృక్షమంతా ఉంది. వృక్షము ఎలా ఉత్పన్నమవుతుందో ముఖ్యమైన విషయము. దేవీదేవతల వృక్షము ఇప్పుడు లేదు. మిగిలిన కొమ్మలు, రెమ్మలన్నీ ఉన్నాయి. కానీ ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి పునాది లేనే లేదు. ఒకే ఒక ఆది సనాతన దేవీదేవతా ధర్మమును స్థాపిస్తారు. మిగిలిన ధర్మములన్నీ వినాశనమౌతాయని గాయనము కూడా ఉంది. దైవీ వృక్షము ఎంత చిన్నదిగా ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు. ఆ తర్వాత ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది. తర్వాత పెద్దదవుతూ ఉంటుంది. పెద్దదవుతూ అవుతూ ఇప్పుడు ఎంత పెద్దదైపోయింది. ఇప్పుడు దీని ఆయువు పూర్తి అవుతుంది. దీనికి ఉదాహరణగా మఱ్ఱి వృక్షమును చూపించి బాగా అర్థం చేయిస్తారు. ఇది కూడా గీతా జ్ఞానమే. మీ సన్ముఖములో కూర్చుని తండ్రి తెలియజేయు ఈ గీతా జ్ఞానము ద్వారా మీరు రాజాధి రాజులుగా అవుతారు. తర్వాత మళ్లీ భక్తిమార్గములో ఈ గీత మొదలైన శాస్త్రాలన్నీ తయారవుతాయి. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. మళ్లీ ఇదే విధంగా జరుగుతుంది. తర్వాత స్థాపించబడిన ధర్మముల వారికి తమవే అయిన శాస్త్రాలు ఉంటాయి. సిక్కు ధర్మము వారికి తమ శాస్త్రము అదే విధంగా క్రైస్తవులకు, బౌద్ధులకు తమ - తమ శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచమంతటి చరిత్ర- భూగోళమంతా నాట్యము చేస్తూ ఉంది. బుద్ధి జ్ఞాన నాట్యమును చేస్తోంది. మీరు మొత్తం వృక్షమంతటిని తెలుసుకున్నారు. ధర్మాలు ఏ విధంగా వస్తాయో, ఏ విధంగా వృద్ధి చెందుతాయో కూడా తెలుసుకున్నారు. మళ్లీ మన ఏక ధర్మము మాత్రమే స్థాపించబడ్తుంది, మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే,.............. అని పాడ్తారు కదా. ఇప్పుడు పూర్తి అంధకారముంది కదా. అనేకమంది మనుష్యులున్నారు తర్వాత ఇంతమంది ఉండనే ఉండరు. వీరంతా లక్ష్మీనారాయణుల రాజ్యములో ఉండేవారు కాదు. మళ్లీ ఒకే ధర్మము తప్పకుండా స్థాపన జరగనే జరగాలి. ఈ జ్ఞానము తండ్రియే వచ్చి వినిపిస్తారు. పిల్లలైన మీరు సంపాదన కొరకు ఎంత జ్ఞానమును చదువుకుంటున్నారు. తండ్రి టీచరై వస్తారు, అర్ధకల్పము వరకు మీకు సంపాదన కొరకు ఏర్పాటు జరుగుతుంది. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. మనమిప్పుడు చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల చదువు. భక్తిని అవినాశి జ్ఞాన రత్నాలని అనరు. భక్తిలో మనుష్యులు ఏమి చదివినా దాని ద్వారా నష్టమే కలుగుతుంది. రత్నాలుగా అవ్వరు. జ్ఞానరత్నసాగరులని ఒక్క తండ్రినే అంటారు. మిగిలినదంతా భక్తి. భక్తిలో ఏ లక్ష్యమూ లేదు. సంపాదన ఉండనే ఉండదు. సంపాదన కొరకు పాఠశాలలో చదువుకుంటారు. తర్వాత భక్తి చేసేందుకు గురువుల వద్దకు వెళ్తారు. కొందరు యవ్వనంలో గురువుల వద్దకు వెళ్తారు, కొందరు వృద్ధాప్యములో గురువులను ఆశ్రయిస్తారు. కొందరు చిన్నతనములోనే సన్యాసము పుచ్చుకుంటారు. కుంభమేళాకు ఎంతమంది వస్తారు. సత్యయుగములో ఇవేవీ ఉండవు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ స్మృతిలోకి వచ్చేశాయి. రచయిత-రచనల ఆదిమధ్యాంతాలను మీరు తెలుసుకున్నారు. వారైతే కల్పము ఆయువును కూడా పెంచేశారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేశారు. వారికి జ్ఞానము గురించి తెలియదు. తండ్రి వచ్చి అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞాన ధారణ అవుతూ వస్తుంది. బ్యాటరీ నిండుతూ ఉంటుంది. జ్ఞానము ద్వారా సంపాదన, భక్తి ద్వారా నష్టము జరుగుతుంది. సమయానుసారము నష్టపోయే సమయము పూర్తి అయినప్పుడు మళ్లీ సంపాదన చేయించేందుకు తండ్రి వస్తారు. ముక్తికి వెళ్లడము కూడా సంపాదనే. శాంతినైతే అందరూ వేడుకుంటూ ఉంటారు. శాంతిదేవా! అని అనగానే బుద్ధి తండ్రి వైపు వెళ్తుంది. విశ్వములో శాంతి ఏర్పడాలని చెప్తారు కానీ అది ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. శాంతిధామము, సుఖధామము వేరు వేరని కూడా తెలియదు. మొదటి నంబరులో ఉన్నవారికి కూడా ఈ విషయాలు తెలియదు. మీకిప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. ఈ కర్మక్షేత్రములో కర్మ పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. ఎక్కడి నుండి వచ్చాము? బ్రహ్మలోకము నుండి, నిరాకార ప్రపంచము నుండి పాత్ర చేసేందుకు ఈ సాకార ప్రపంచములోకి వచ్చాము. ఆత్మలమైన మనము మరొక స్థానములో ఉండేవారము. ఇక్కడ ఈ పంచ తత్వాల శరీరము ఉంటుంది. శరీరమున్నప్పుడే మనము మాట్లాడగలము. మనము చైతన్య పాత్రధారులము. ఇప్పుడు మనము ఈ డ్రామా ఆదిమధ్యాంతాల గురించి మాకు తెలియదని చెప్పరు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. తమ తండ్రిని గురించి, తమ ఇంటిని గురించి, తమ రూపము గురించి యథార్థంగా ఇంతకు ముందు తెలియదు. ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తూ ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు గుర్తు వచ్చింది. ఇంతకు ముందు మీకు స్మృతి లేదు.
సత్యమైన తండ్రియే సత్యమును వినిపిస్తారని, దీని ద్వారా మనము సత్యఖండానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. సత్యమును గురించి సుఖమణిలో(సిక్కుల గ్రంథములో) ఉంది. సత్య ఖండమును సత్యమని అంటారు. దేవతలందరూ సత్యమునే చెప్తారు. సత్యమును నేర్పించేవారు తండ్రి. వారి మహిమ ఎంత అపారమైనదో చూడండి. కీర్తించబడిన మహిమ మీకు ఉపయోగపడ్తుంది. శివబాబాను మహిమ చేస్తారు. వారికే వృక్ష ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. తండ్రి సత్యమును వినిపిస్తున్నారు తద్వారా పిల్లలైన మీరు సత్య-సత్యంగా అవుతారు. సత్య ఖండము కూడా తయారవుతుంది. భారతదేశము సత్య ఖండముగా ఉండేది. సర్వ శ్రేష్ఠమైన నంబర్‌వన్‌ తీర్థ స్థానము కూడా ఇదే. ఎందుకంటే సర్వులకు సద్గతిని కలిగించే తండ్రి భారతదేశములోనే వస్తారు. ఒకే ధర్మము స్థాపించబడి మిగిలిన ధర్మములన్నీ వినాశనమైపోతాయి. సూక్ష్మవతనములో ఏమీ లేదని తండ్రి అర్థం చేయించారు. అక్కడ ఇవన్నీ సాక్షాత్కారమవుతాయి. భక్తిమార్గములో కూడా సాక్షాత్కారాలు అవుతాయి. సాక్షాత్కారము అవ్వకపోతే ఇన్ని మందిరాలు మొదలైనవి ఎలా నిర్మించబడ్తాయి! పూజలెందుకు జరుగుతాయి! సాక్షాత్కారమైనప్పుడు వీరు చైతన్యంగా ఉండేవారని అనుభవము చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - భక్త్తిమార్గములో తయారు చేయబడిన మందిరాలు, మొదలైనవి మీరు ఏవైతే చూశారో, విన్నారో అవన్నీ మళ్లీ పునరావృతమవుతాయి. చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది తయారైన జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని సదా చెప్తూ ఉంటారు. కానీ వివరంగా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - జ్ఞానమంటే పగలు, భక్తి అంటే రాత్రి. రాత్రి పై వైరాగ్యము కలుగుతుంది, మళ్లీ పగలు వస్తుంది. భక్తిలో దు:ఖముంది, అందువలన దాని పై వైరాగ్యము కలుగుతుంది. సుఖము పై వైరాగ్యమని అనరు. సన్యాసము మొదలైనవి కూడా దు:ఖము వలన తీసుకుంటారు. పవిత్రతలో సుఖముందని అర్థం చేసుకొని స్త్రీని వదిలి వెళ్లిపోతారు. ఈ రోజుల్లో సన్యాసులు కూడా ధనవంతులుగా అయ్యారు ఎందుకంటే సంపద లేకుంటే సుఖము లభించదు. మాయ యుద్ధము చేసి అడవి నుండి మళ్లీ పట్టణములోకి తీసుకొస్తుంది. వివేకానంద మరియు రామకృష్ణ కూడా గొప్ప సన్యాసులుగా ఉండి వెళ్లిపోయారు. సన్యాసములోని శక్తి రామకృష్ణునిలో ఉండేది. భక్తి గురించి తెలియజేయడం, వినిపించడం వివేకానందుడు చేస్తూ ఉండేవాడు. ఇరువురి పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాన్ని వ్రాయునప్పుడు ఏకాగ్రచిత్తులై కూర్చుని వ్రాస్తారు. రామకృష్ణ తమ స్వీయ చరిత్రను వ్రాస్తున్నప్పుడు శిష్యులను కూడా దూరంగా వెళ్లి కూర్చోమని చెప్పేవాడు. చాలా గట్టి(తీక్షణమైన, చురుకైన) సన్యాసిగా ఉండేవాడు, గొప్ప పేరు కూడా ఉంది. భార్యను తల్లిగా భావించమని తండ్రి చెప్పరు. తండ్రి అయితే వారిని కూడా ఆత్మగా భావించమని చెప్తారు. ఆత్మలంతా సోదరులే. సన్యాసుల మాట వేరు. అతడు భార్యను తల్లిగా భావించాడు, కూర్చొని తల్లిని మహిమ చేశాడు. ఇది జ్ఞానమార్గము. వైరాగ్య మార్గము వేరు. వైరాగ్యము కలిగి స్త్రీని(భార్యను) తల్లిగా భావించాడు. తల్లి అను పదములో చెడు దృష్టి ఉండదు. సోదరి పై కూడా చెడు దృష్టి వెళ్లగలదు. తల్లి పై చెడు ఆలోచన ఎప్పుడూ ఉండదు. తండ్రికి కూతురు పై కూడా చెడు దృష్టి ఉంటుంది కానీ తల్లి పై ఎప్పుడూ చెడు దృష్టి ఉండదు. ఆ సన్యాసి స్త్రీని తల్లిగా భావించసాగాడు. మీరిలా సన్యసిస్తే ప్రపంచము ఎలా నడుస్తుంది? జనాభా ఎలా పెరుగుతుంది? అని వారిని అడగరు. ఒకరికి వైరాగ్యము వస్తే తల్లి అని అనేశాడు. అతనికి ఎంత మహిమ ఉందో చూడండి. ఇక్కడ సోదర-సోదరీ అని చెప్పినా చాలామందికి దృష్టి వెళ్తూ ఉంటుంది. అందువలన పరస్పరములో సోదరులుగా (భాయీ-భాయీ) భావించండి అని తండ్రి చెప్తారు. ఇది జ్ఞాన విషయము. అది ఒక్కరి విషయము. ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మకు సంతానులైనవారు, సోదర-సోదరీలుగా చాలామంది పిల్లలున్నారు. తండ్రి కూర్చొని అన్ని విషయాలు అర్థము చేయిస్తారు. ఇతను కూడా శాస్త్రాలు మొదలైనవన్నీ చదివారు. నివృత్తి మార్గములోని వారి ధర్మమే వేరు. అది కేవలం పురుషుల కొరకే. అది హద్దు వైరాగ్యము. మీకైతే మొత్తం బేహద్‌ ప్రపంచమంతటి పై వైరాగ్యముంది. సంగమ యుగములోనే తండ్రి వచ్చి మీకు బేహద్‌ విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పై వైరాగ్యము కలగాలి. ఇది చాలా పతితమైన ఛీ-ఛీ ప్రపంచము. ఇక్కడ శరీరము పావనంగా అవ్వలేదు. ఆత్మకు నూతన శరీరము సత్యయుగములోనే లభించగలదు. భలే ఇక్కడ ఆత్మ పవిత్రంగా అయినా, శరీరము అపవిత్రమైనదే లభిస్తుంది. కర్మాతీత స్థితి తయారయ్యే వరకు శరీరము అపవిత్రంగానే ఉంటుంది. బంగారులో మైల పడితే ఆభరణము కూడా అలాగే ఉంటుంది. మలినము పోయినప్పుడే ఆభరణము కూడా అసలైనదిగా తయారవుతుంది. ఈ లక్ష్మీనారాయణుల ఆత్మ మరియు శరీరము రెండూ సతోప్రధానమైనవి. మీ ఆత్మ మరియు శరీరము రెండూ తమోప్రధానంగా, నల్లగా ఉన్నాయి. ఆత్మ కామచితి పై కూర్చొని నల్లగా అయ్యింది. నేను మళ్లీ వచ్చి నల్లగా ఉన్నవారిని తెల్లగా(పవిత్రంగా) చేస్తానని తండ్రి చెప్తారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు. అంతేకాని నీరు మొదలైనవాటి విషయం లేదు. అందరూ కామచితి పై కూర్చొని పతితమైనారు. అందువలన పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చెయ్యమని రాఖీ కట్టబడ్తుంది.
నేను ఆత్మలతో మాట్లాడ్తానని తండ్రి చెప్తారు. నేను ఆత్మల తండ్రిని. నన్ను మీరు ''బాబా రండి, మమ్ములను సుఖధామానికి తీసుకెళ్లండి, దు:ఖమును హరించండి'' అని స్మృతి చేశారు. కలియుగములో అపారమైన దు:ఖముంది. తండ్రి అర్థం చేయించారు - మీరు కామచితి పై కూర్చొని నల్లగా, తమోప్రధానంగా అయిపోయారు. నేనిప్పుడు కామచితి పై నుండి దించి జ్ఞానచితి పై కూర్చోబెట్టేందుకు వచ్చాను. ఇప్పుడు పవిత్రంగా అయ్యి స్వర్గానికి వెళ్లాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్ర్రి ఆకర్షించుకుంటారు. తండ్రి వద్దకు యుగల్స్‌(జంటలు) వస్తారు. ఒకరు ఆకర్షితమౌతారు, రెండవ వారు అవ్వరు. మేము ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటాము, కామచితి పై కూర్చోము అని కొందరు పురుషులు వెంటనే అనేస్తారు. అలాగని నిశ్చయము కలిగిందని చెప్పలేము. ఒకవేళ నిశ్చయము ఏర్పడితే బేహద్‌ తండ్రికి తప్పకుండా జాబు వ్రాస్తారు, తండ్రి సంబంధములో ఉంటారు. పవిత్రంగా ఉన్నారని, తమ వ్యాపారాలు మొదలైన వాటిలో నిమగ్నమై ఉన్నారని తెలిసింది. తండ్రి స్మృతి ఎక్కడ ఉంది! ఇటువంటి తండ్రిని ఎంత బాగా స్మృతి చేయాలి! స్త్రీ-పురుషులకు పరస్పరములో ఎంత ప్రేమ ఉంటుంది! పతిని ఎంతగా స్మృతి చేస్తుంది! బేహద్‌ తండ్రిని అయితే అందరికంటే ఎక్కువ స్మృతి చేయవలసి ఉంటుంది. మీరు ప్రీతించినా, విస్మరించినా మేము మీ చేతిని ఎప్పుడూ వదిలిపెట్టము (తూ ప్యార్‌ కరే యా టుక్‌రాయే....) అనే పాట కూడా ఉంది కదా. అలాగని ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చి ఉండమని కాదు. అలా ఉంటే అది సన్యాసమైపోతుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వండి అని మీకు చెప్పబడ్తుంది. మొదట ఈ భట్టీ తయారవ్వవలసి ఉంది. తద్వారా ఇంతమంది తయారవ్వవలసి ఉంది, ఆ వృత్తాంతము కూడా చాలా బాగుంది. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో, వారు లోపలి వారిగా అవుతారు. వారు ఆత్మిక సర్వీసు చేయకుంటే దాస- దాసీలుగా అవుతారు. తర్వాత చివర్లో నంబరువారు పురుషార్థానుసారము కిరీటము లభిస్తుంది. వారి వంశము కూడా ఉంటుంది. ప్రజలలోకి రాలేరు. బయటి వారెవరైనా వస్తే పరివారము వారిగా అవ్వలేరు. వల్లభాచారి బయటివారిని లోపలికి ఎప్పుడూ రానిచ్చేవారు కాదు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. జ్ఞానము క్షణములోనిది. మరి తండ్రిని జ్ఞానసాగరులని ఎందుకు అంటారు? చివరివరకు అర్థం చేయిస్తూనే ఉంటారు. రాజధాని స్థాపననైనప్పుడు, మీరు కర్మాతీత స్థితికి చేరుకున్నప్పుడు జ్ఞానము పూర్తవుతుంది. ఇది క్షణములోని మాటే. అయినా దీనిని అర్థము చేయించవలసిి ఉంటుంది. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వము లభిస్తుంది. బేహద్‌ తండ్రి విశ్వాధికారులుగా చేస్తారు. మీరు సుఖధామానికి వెళ్తే మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్లిపోతారు. అక్కడ సుఖమే సుఖముంటుంది. తండ్రి వచ్చారు కనుక ఆ సత్కారము లభిస్తుంది. రాజయోగ విద్య ద్వారా మనము నూతన విశ్వానికి అధికారులుగా అవుతున్నాము. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
. ఈ పతిత ఛీ - ఛీ ప్రపంచము పై అనంతమైన వైరాగ్యము కలిగి ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము పూర్తిగా చేయాలి. ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి. .
2. జ్ఞాన ధారణ చేసి తమ బ్యాటరీని నింపుకోవాలి. జ్ఞానరత్నాలతో స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి. ఇది సంపాదించుకునే సమయము, అందువలన నష్టము జరగకుండా చూసుకోవాలి.

వరదానము :- '' ''తండ్రి మరియు వరదాత '' - ఈ డబల్‌ సంబంధము ద్వారా డబల్‌ ప్రాప్తి చేసుకునే సదా శక్తిశాలి ఆత్మా భవ ''
సర్వశక్తులు తండ్రి వారసత్వము మరియు వరదాత వరదానాలు. తండ్రి మరియు వరదాత - ఈ డబల్‌ సంబంధము ద్వారా ప్రతి పుత్రునికి ఈ శ్రేష్ఠమైన ప్రాప్తి జన్మతోనే లభిస్తుంది. జన్మించిన వెంటనే తండ్రి, బాలకుని నుండి సర్వ శక్తుల మాలికునిగా చేస్తాడు. జత జతలో వరదాత సంబంధము ద్వారా జన్మించిన వెంటనే మాస్టర్‌ సర్వశక్తివంతునిగా చేసి - ''సర్వశక్తి భవ'' అనే వరదానమునిచ్చేస్తారు. కనుక ఒకరి ద్వారానే ఈ డబల్‌ అధికారము లభించినందున సదా శక్తిశాలిగా అవుతారు.

స్లోగన్‌ :- " దేహము, దేహముతో పాటు పాత స్వభావ - సంస్కారాలు లేక బలహీనతల నుండి అతీతంగా అవ్వడమే విదేహులుగా అవ్వడం ''

No comments:

Post a Comment