Thursday, September 19, 2019

Telugu Murli 20/09/2019

20-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఇక్కడ మీకు ప్రవృత్తి మార్గములోని ప్రేమ లభిస్తుంది ఎందుకంటే తండ్రి '' నా పిల్లలారా '' అని హృదయ పూర్వకంగా పిలుస్తారు. తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. ఈ ప్రేమను దేహధారి గురువులు ఇవ్వలేరు ''

ప్రశ్న :- ఏ పిల్లల బుద్ధిలో జ్ఞాన ధారణ జరుగుతుంది, చురుకైన బుద్ధి గల పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి ?
జవాబు :- వారికి ఇతరులకు వినిపించాలనే ఆసక్తి ఉంటుంది. వారి బుద్ధి బంధు-మితుల్రు మొదలైన వారి వైపు భమ్రించదు. చురుకైన బుద్ధి(కుశాగ బుద్ధి) గలవారు చదువుకొను సమయములో ఎప్పుడూ ఆవళించడం మొదలైనవి చేయరు. పాఠశాలలో ఎప్పుడూ కళ్లు మూసుకొని కూర్చోరు. ఏ పిల్లలైతే వేడి పెనము వలె కూర్చుంటారో, ఎవరి బుద్ధి అటు-ఇటు తిరుగుతూ ఉంటుందో వారు జ్ఞానాన్ని అర్థము చేసుకోరు. వారికి తండిన్రి స్మృతి చేయడం చాలా కష్టము.

ఓంశాంతి. ఇది తండ్రి పిల్లల మిలన మహోత్సవము, గురు-శిష్యుల మిలనము కాదు. ఆ గురువులకు వీరు మా శిష్యులు లేక అనుచరులు లేక జిజ్ఞాసువులనే దృష్టి ఉంటుంది అనగా అది చులకన(తేలిక) దృష్టి కదా. వారు ఆ తేలిక దృష్టితోనే(భావనతోనే) చూస్తారు, ఆత్మను చూడరు. వారు శరీరాలనే చూస్తారు. శిష్యులు కూడా దేహాభిమానులుగానే కూర్చుంటారు, వారిని తమ గురువులుగా భావిస్తారు. మా గురువులు అను దృష్ట్టియే ఉంటుంది. గురువులను గౌరవిస్తారు. ఇక్కడైతే చాలా వ్యత్యాసముంది. ఇక్కడ తండ్రియే పిల్లలను గౌరవిస్తారు. ఈ పిల్లలను చదివించాలని, ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో, బేహద్‌ చరిత్ర-భూగోళాలు పిల్లలకు అర్థం చేయించాలని తండ్రికి తెలుసు. ఆ గురువుల హృదయంలో ' వీరు నా పిల్లలు ' అనే ప్రేమ ఉండదు. తండ్రికి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుంది, పిల్లలకు కూడా తండ్రి పైన చాలా ప్రేమ ఉంటుంది. బాబా మనకు సృష్టి చక్ర జ్ఞానాన్ని వినిపిస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఆ గురువులేం నేర్పిస్తారు? అర్ధకల్పము శాస్త్ర్రాలు మొదలైనవి వినిపిస్తూ, భక్తిలో కర్మకాండలు చేస్తూ, గాయత్రి మంత్రము, సంధ్యా వందనము మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. మనకు ఇంతకుముందు తండ్రి గురించి ఏ మాత్రము తెలియదు. మనము కూడా సర్వవ్యాపి అని అనేవారము. ఎప్పుడైనా పరమాత్మ ఎక్కడున్నారని అడిగితే వెంటనే సర్వవ్యాపి అని చెప్పేవారము. మనుష్యులు మీ వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ ఏమి నేర్పిస్తారు? అని అడుగుతారు. మేము రాజయోగమును నేర్పిస్తాము, దీని ద్వారా మీరు మానవుల నుండి దేవతలుగా అనగా రాజులుగా అవ్వగలరని చెప్పండి. మేము మానవుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ ఇస్తామని చెప్పే ఏ సత్సంగమూ ఉండదు. దేవతలు సత్యయుగములో ఉంటారు, కలియుగములో మనుష్యులు ఉన్నారు. మేమిప్పుడు మీకు పూర్తి సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాము, దీని ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు, అంతేకాక పావనంగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలుపుతాము. ఇలాంటి ఉపాయము మరెవ్వరూ తెలియజేయలేరు. ఇది సహజ రాజయోగము. తండ్రి పతితపావనుడు. వారు సర్వశక్తివంతులు కూడా. కనుక వారిని స్మృతి చేయుట ద్వారానే పాపాలు భస్మమౌతాయి ఎందుకంటే ఇది యోగాగ్ని కదా. కావున ఇక్కడ కొత్త విషయాలను నేర్పిస్తామని చెప్పండి.
ఇది జ్ఞాన మార్గము. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానము వేరు, భక్తి వేరు. జ్ఞానము నేర్పించేందుకు తండ్రి రావలసి ఉంటుంది ఎందుకంటే వారే జ్ఞానసాగరులు. స్వయంగా వారే వచ్చి నేను సర్వుల తండ్రిని, బ్రహ్మ ద్వారా మొత్తం సృష్టినంతటిని పావనంగా చేస్తానని తమ పరిచయమును ఇస్తారు. సత్యయుగము పావన ప్రపంచము, కలియుగము పతిత ప్రపంచము. కావున ఇది సత్యయుగము ఆది మరియు కలియుగ అంత్యముల సంగమ యుగము. దీనిని లీపుయుగము అని కూడా అంటారు. దీనిని మనము జంప్‌ చేసి దాటుకుంటాము. ఎక్కడకు? పురాతన ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి జంప్‌ చేస్తాము. అక్కడ నుండి మెల్ల మెల్లగా క్రిందకు దిగుతూ వచ్చాము. ఇక్కడైతే మనము ఛీ - ఛీ ప్రపంచము నుండి కొత్త ప్రపంచానికి ఒకేసారి జంప్‌ చేస్తాము. నేరుగా పైకి వెళ్లిపోతాము. పాత ప్రపంచాన్ని వదిలి మనము కొత్త ప్రపంచానికి వెళ్తాము. ఇది అనంతమైన విషయము. అనంతమైన పాత ప్రపంచములో అనేకమంది మనుష్యులు ఉన్నారు. కొత్త ప్రపంచములో అయితే చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. దానిని స్వర్గమని అంటారు. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. కలియుగములో అందరూ అపవిత్రంగా ఉన్నారు. రావణుడు అపవిత్రంగా తయారుచేస్తాడు. మీరిప్పుడు రావణ రాజ్యంలో లేక పాత ప్రపంచంలో ఉన్నారని అందరికీ అర్థం చేయిస్తారు. మొదట రామరాజ్యంలో ఉండేవారు, దానిని స్వర్గమని అనేవారు మళ్లీ 84 జన్మల చక్రములో తిరిగి ఎలా క్రిందకు పడిపోయారో మనము తెలుపగలము. బుద్ధివంతులైన వారు వెంటనే అర్థము చేసుకుంటారు. ఎవరి బుద్ధిలోకి ఇది రాదో వారు వేెడి పెనము పై ఏదీ నిలువనట్లు అటు-ఇటు చూస్తూ ఉంటారు. అటెన్షన్‌తో వినరు. నీవు వేడి పెనము వలె ఉన్నావని అంటారు కదా. సన్యాసులు కూడా కథ వినిపించునప్పుడు ఎవరైనా తూగితే లేక ఎటువైపైనా చూస్తూ ఉంటే తక్షణము వారిని ఏం వినిపించానో చెప్పండని అడుగుతారు. తండ్రి కూడా అందరినీ చూస్తుంటారు. ఎవరు వేడి పెనము వలె కూర్చోలేదు కదా! చాలా మంచి చురుకైన పిల్లలు చదువుకునే సమయంలో ఎప్పుడూ ఆవళించరు. పాఠశాలలో కూడా కళ్లు మూసుకుని కూర్చోవడం నియమము కాదు. జ్ఞానమును ఏ మాత్రము అర్థము చేసుకోలేని వారికి తండ్రిని స్మృతి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మరి పాపమెలా నశిస్తుంది! చురుకైన బుద్ధి గలవారు చాలా బాగా ధారణ చేసి ఇతరులకు వినిపించాలని ఆసక్తిని ఉంచుకుంటారు. జ్ఞానము లేకపోతే బుద్ధి బంధు-మిత్రుల వైపు భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడైతే అందరినీ మర్చిపోవాలని తండ్రి చెప్తారు. అంతిమ సమయములో ఏమీ గుర్తు రాకూడదు. బాబా సన్యాసులు మొదలైనవారిని చూశారు. మంచి-మంచి బ్రహ్మ జ్ఞానులు ఉదయమే లేచి కూర్చొని బ్రహ్మ మహాతత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. వారి వద్ద శాంతి ప్రవాహము చాలా ఎక్కువగా ఉంటుంది. కాని వారు బ్రహ్మములో లీనమైతే అవ్వలేరు. మళ్లీ తల్లి గర్భము ద్వారా జన్మ తీసుకోవలసి ఉంటుంది.
తండ్రి అర్థం చేయించారు - వాస్తవానికి కృష్ణుని మహాత్మ అని అంటారు. మానవులైతే అర్థము తెలుసుకోకనే మహాత్మ అని ఊరకే అనేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు - శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వికారి కాని అతడిని సన్యాసి అని అనరు, దేవత అని అంటారు. సన్యాసి అన్నా లేక దేవత అన్నా అందులో అర్థముంది. ఇతను దేవతగా ఎలా అయ్యాడు? సన్యాసి నుండి దేవతగా అయ్యాడు. బేహద్‌గా సన్యసించిన తర్వాత మళ్లీ కొత్త ప్రపంచములోకి వెళ్లిపోయాడు. వారైతే హద్దు సన్యాసము చేస్తారు. బేహద్‌లోకి వెళ్లలేరు. హద్దులోనే వికారాల ద్వారా పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది. బేహద్‌ అధికారులుగా అవ్వజాలరు. రాజా-రాణులుగా ఎప్పటికీ అవ్వలేరు ఎందుకంటే వారి ధర్మమే వేరు. సన్యాస ధర్మము దేవీ దేవతా ధర్మము కాదు. తండ్రి చెప్తున్నారు - నేను అధర్మమును వినాశనము చేసి దేవీదేవతా ధర్మమును స్థాపిస్తాను. వికారాలు కూడా అధర్మమే కదా. అందువలన వీటన్నిటి వినాశనము చేసి ఒకే ఒక ఆదిసనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపించేందుకు నేను రావలసి ఉంటుందని తండ్రి చెప్తున్నారు. భారతదేశములో సత్యయుగము ఉన్నప్పుడు ఒకే ధర్మముండేది. ఆ ధర్మమే మళ్లీ అధర్మంగా అవుతుంది. మీరిప్పుడు మళ్లీ ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. ఎవరెంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. భలే గృహస్థ వ్యవహారములో ఉండండి, ఎలాగైతే భక్తులు ఉదయమే లేచి ఏకాంతంగా కూర్చొని మాలను జపిస్తారో, అలా మీరు కూడా లేస్తూ, కూర్చుంటూ నేను ఆత్మను అని పక్కాగా అభ్యాసము చెయ్యండి. మీరైతే రోజంతటి లెక్కాచారాన్ని చూసుకుంటారు. ఫలానా సమయములో ఇంత స్మృతి చేశాను, రోజంతా ఇంత సమయము స్మృతి ఉందని టోటల్‌ను చూసుకుంటారు. వారైతే ఉదయమే లేచి మాలను తిప్పుతారు. కొందరు సత్యమైన భక్తులు కానీ వారు కూడా ఉంటారు. కొందరి బుద్ధి బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. భక్తి ద్వారా లాభమేమీ లభించదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది జ్ఞానము. దీని ద్వారా చాలా లాభము కలుగుతుంది. మీదిప్పుడు ఉన్నతమయ్యే కళ. క్షణ క్షణము 'మన్మనాభవ' అని తండ్రి చెప్తారు. ఈ పదము భగవద్గీతలో కూడా ఉంది కాని దాని అర్థమును ఎవ్వరూ వినిపించలేరు. జవాబు ఇవ్వడం రాదు. వాస్తవంగా స్వయాన్ని ఆత్మగా భావించి దేహ ధర్మములన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని అర్థము కూడా వ్రాయబడి ఉంది. భగవానువాచ అని ఉంది కదా. కాని వారి బుద్ధిలో కృష్ణ భగవానుడని ఉంది. అతడు దేహధారి. పునర్జన్మలు తీసుకుంటాడు కదా. అతడిని భగవంతుడని ఎలా అనగలరు? కావున సన్యాసులు మొదలైన వారెవ్వరి దృష్టి తండ్రి మరియు పిల్లల రూపములో ఉండదు. గాంధీని కూడా బాపూజీ అని అనేవారు కాని తండ్రి పిల్లలకున్న సంబంధమని అనరు. వారు కూడా సాకారములో ఉన్నారు కదా. మీకైతే స్వయాన్ని ఆత్మగా భావించమని అర్థము చేయించారు. ఇతనిలో కూర్చొని ఉన్న తండ్రి బేహద్‌ బాపూజీ. లౌకిక మరియు పారలౌకిక తండ్రులిరువురి ద్వారా వారసత్వము లభిస్తుంది. బాపూజీ (గాంధీ) ద్వారా ఏమీ లభించలేదు. భారత రాజధాని వాపస్‌ లభించింది కానీ దానిని వారసత్వమని అనరు. సుఖము లభించాలి కదా.
వారసత్వము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దు తండ్రి ద్వారా వారసత్వము, రెండవది బేహద్‌ తండ్రి ద్వారా వారసత్వము. బ్రహ్మ ద్వారా కూడా ఏ వారసత్వమూ లభించదు. వారు ప్రజాపితగా ఉండవచ్చు. వారినే గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌(ముత్తాతల తాత) అని అంటారు. నా ద్వారా కూడా మీకు ఏ వారసత్వమూ లభించదని అతడే(బ్రహ్మ) స్వయంగా చెప్తాడు. నా ద్వారా లభించదని స్వయంగా చెప్పినప్పుడు మరి ఆ బాపూజీ ద్వారా ఏ వారసత్వము లభిస్తుంది? ఏమీ లభించదు. ఆంగ్లేయులైతే వెళ్లిపోయారు. రాజధానిలో వారున్నప్పుడైనా కొంత సుఖముండేది. ఇప్పుడేముంది? ఉపవాస సత్యాగ్రహాలు, పికెటింగ్‌లు, ధర్నాలు స్ట్రైకులు మొదలైనవి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని మారణహోమాలు జరుగుతూ ఉన్నాయి! ఎవరి భయమూ లేదు. పెద్ద పెద్ద అధికారులను కూడా చంపుతున్నారు. సుఖానికి బదులు ఇంకా దు:ఖమే ఉంది. కావున బేహద్‌ విషయాలు ఇక్కడే ఉన్నాయి. మొట్టమొదట మేము ఆత్మలము, శరీరము కాదు అను పాఠాన్ని దృఢంగా నిశ్చయం చేసుకోమని తండ్రి చెప్తున్నారు. తండ్రి మనలను దత్తు తీసుకున్నారు. మనము దత్తు తీసుకోబడిన పిల్లలము. జ్ఞానసాగరులైన తండ్రి వచ్చారని, సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారని మీకు తెలియజేయబడింది. మరెవ్వరూ అర్థం చేయించలేరు. దేహ సహితంగా దేహ ధర్మాలన్నీ మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తారు. తప్పకుండా సతోప్రధానంగా అవ్వవలసి ఉంటుంది. పాత ప్రపంచము వినాశనము అవ్వవలసిందేనని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచములో చాలా కొద్దిమందే ఉంటారు. కోటానుకోట్ల ఆత్మలెక్కడ, 9 లక్షల ఆత్మలు ఎక్కడ! ఇంతమంది ఎక్కడకు వెళ్తారు? ఆత్మలమైన మనమందరమూ పైన ఉండేవారమని, మళ్లీ పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చామని మీ బుద్ధిలో ఉంది. ఆత్మనే పాత్రధారి అని అంటారు. ఈ శరీరముతో ఆత్మ పాత్ర చేస్తుంది. ఆత్మకు అవయవాలైతే కావాలి కదా. ఆత్మ ఎంత చిన్నది! 84 లక్షల జన్మలు లేనే లేవు. ఒకవేళ ప్రతి ఒక్కరు 84 లక్షల జన్మలు తీసుకుంటే మళ్లీ అదే పాత్రను ఎప్పుడు ఎలా చేస్తారు? గుర్తుండజాలదు. స్మృతిలో నుండి బయటకు వెళ్లిపోతుంది. 84 జన్మలు కూడా మీకు గుర్తుండవు, మర్చిపోతారు. పిల్లలైన మీరిప్పుడు తండ్రిని స్మృతి చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమౌతాయి. బేహద్‌ తండ్రి ద్వారా కల్ప-కల్పము బేహద్‌ వారసత్వమును మనము తీసుకుంటామని కూడా నిశ్చయముంది. ఇప్పుడు మళ్లీ స్వర్గవాసులుగా అయ్యేందుకు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఎందుకంటే పతితపావనుడను నేనొక్కరినేనని తండ్రి చెప్పారు. మీరు తండ్రిని పిలిచారు కదా. కావున పావనంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. దేవతలు పావనంగా ఉంటారు, మనుష్యులు పతితంగా ఉంటారు. పావనంగా అయ్యి మళ్లీ శాంతిధామములోకి వెళ్లాలి. మీరు శాంతిధామానికి వెళ్లాలనుకుంటున్నారా లేక సుఖధామానికి రావాలనుకుంటున్నారా? సుఖము కాకిరెట్టతో సమానము, మాకు శాంతి కావాలని సన్యాసులు చెప్తారు. కావున వారు సత్యయుగంలోకి ఎప్పటికీ రాలేరు. సత్యయుగములో ప్రవృత్తి మార్గ ధర్మముండేది. దేవతలు నిర్వికారులుగా ఉండేవారు. వారే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితంగా అవుతారు. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. స్వర్గంలోకి వెళ్లాలంటే నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తమౌతాయి, పుణ్యాత్మలుగా అవుతారు, తర్వాత శాంతిధామ - సుఖధామాలకు వెళ్తారు. అక్కడ శాంతి ఉండేది, సుఖము కూడా ఉండేది. ఇప్పుడు దు:ఖధామంగా ఉంది. మళ్లీ తండ్రి వచ్చి దు:ఖధామమును వినాశనము చేసి సుఖధామమును స్థాపిస్తున్నారు. చిత్రము కూడా ఎదురుగా ఉంది. మీరిప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నారో చెప్పండి? ఇది కలియుగ అంత్యము. వినాశనము సన్ముఖములో ఉంది. కొద్ది భూభాగమే మిగులుతుంది. ఇన్ని ఖండాలు అక్కడ ఉండవు. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళమంతా తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది పాఠశాల. భగవానువాచ - మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వవలసి ఉంటుంది. ఇది కలియుగము. మళ్లీ సత్యయుగములోకి వెళ్లాలి. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. ఒక్కరినే స్మృతి చేయడం అవ్యభిచారి స్మృతి. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. శాంతిధామము నుండి వచ్చారు మళ్లీ శాంతిధామములోకి వెళ్లాలి. అక్కడికి పతితులెవ్వరూ వెళ్లలేరు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయ్యి మీరు ముక్త్తిధామంలోకి వెళ్తారు. దీనిని చాలా బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇంతకు ముందు ఇన్ని చిత్రాలుండేవి కావు. చిత్రాలు లేకున్నా సంక్షిప్తంగా అర్థం చేయించేవారు. ఈ పాఠశాలలో మానవుల నుండి దేవతలుగా అయ్యి వెళ్లాలి. ఇది కొత్త ప్రపంచము కొరకు ఇవ్వబడే జ్ఞానము. దీనిని తండ్రియే ఇస్తారు కదా. కావున తండ్రి దృష్టి పిల్లల పై ఉంటుంది. మనము ఆత్మలను చదివిస్తాము. మాకు బేహద్‌ తండ్రి అర్థం చేయిస్తున్నారని, వారి పేరు శివబాబా అని మీరు కూడా తెలియజేస్తారు. కేవలం బేహద్‌ బాబా అని అన్నా తికమకపడ్తారు. ఎందుకంటే బాబాలు కూడా అనేకమంది అయిపోయారు. మునిసిపాలిటి మేయర్‌ను కూడా బాబా అని అంటారు. నేను ఇతనిలో వస్తాను. అయినా నా పేరు శివునిగానే ఉంటుందని తండ్రి చెప్తున్నారు. నేను ఈ రథము ద్వారా మీకు జ్ఞానము ఇస్తాను. నేను ఇతడిని దత్తత తీసుకున్నాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టాను. ఇతనికి కూడా నా ద్వారా వారసత్వము లభిస్తుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి జంప్‌ చేసే సమయము. అందువలన ఈ పాత ప్రపంచాన్ని అనంతంగా సన్యసించాలి. దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.
2. చదువు పై పూర్తిగా గమనమివ్వాలి. పాఠశాలలో కళ్లు మూసుకొని కూర్చోవడం నియమము కాదు. చదువుకునే సమమయులో బుద్ధి అటు-ఇటు భ్రమించరాదని, ఆవళింతలు రాకూడదని గమనముంచాలి. విన్నదానిని ధారణ చేస్తూ ఉండాలి.

వరదానము :- '' సమయ ప్రమాణంగా స్వయాన్ని చెక్‌ చేసుకొని చేంజ్‌ (పరివర్తన) అయ్యే సదా విజయీ శ్రేష్ఠ ఆత్మా భవ ''
ఎవరైతే సత్యమైన రాజయోగులుగా ఉంటారో, వారు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోనూ విచలితమవ్వజాలరు. కనుక సమయానుసారము స్వయాన్ని ఈ రీతిగా చెక్‌ చేసుకోండి. చెక్‌ చేసుకున్న తర్వాత చేంజ్‌ చేసుకోండి. కేవలం చెక్‌ మాత్రమే చేసుకుంటే వ్యాకులపడ్తారు. నాలో ఈ బలహీనత కూడా ఉందా, ఇది బాగవుతుందో లేదో తెలియడం లేదని ఆలోచనలో పడ్తారు. అందువలన చెక్‌ చేసుకొని చేంజ్‌ చేసుకోండి. ఎందుకంటే సమయానుసారము కర్తవ్యము చేసేవారికి సదా విజయం లభిస్తుంది. సదా విజయం పొందే శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యి తీవ్ర పురుషార్థము ద్వారా నంబరువన్‌లోకి వచ్చేయండి.

స్లోగన్‌ :- '' మనసు - బుద్ధిని కంట్రోల్‌ చేసే అభ్యాసముంటే సెకండులో విదేహులుగా అవ్వగలరు. ''

No comments:

Post a Comment