Wednesday, October 2, 2019

Telugu Murli 02/10/2019

02-10-2019 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - మీ అందరిదీ పరస్పరములో ఒకే మతము, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు కనుక భూతాలన్నీ పారిపోతాయి ''

ప్రశ్న:- పదమాపదమ్భాగ్యశాలురుగా అయ్యేందుకు ముఖ్య ఆధారమేది ?
జవాబు:- బాబా వినిపించే ఒక్కొక్క మాటను ధారణ చేయువారే పదమాపదమ్భాగ్యశాలురుగా అవుతారు. బాబా ఏమి చెప్తున్నారు? రావణ సాంప్రదాయము వారేమి చెప్తున్నారు? అని మీకు మీరే పరిశీలించి నిర్ణయించండి. తండి తెలిపిస్తున్న జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని, స్వదర్శన చకధ్రారులుగా అవ్వడమే పదమాపదమ్భాగ్యశాలురుగా అవ్వడం. ఈ జ్ఞానము ద్వారానే మీరు గుణవంతులుగా అవుతారు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రిని - ఆంగ్ల భాషలో స్పిరిచ్యువల్ఫాదర్అని అంటారు. సత్యయుగానికి వెళ్లినప్పుడ అక్కడ ఇంగ్లీషు మొదలైన ఇతర భాషలేవీ ఉండవు. సత్యయుగములో మన రాజ్యముంటుంది. అక్కడ మన భాష ఏదైతే ఉంటుందో అదే నడుస్తుందని మీకు తెలుసు. తర్వాత మళ్లీ ఆ భాష మారుతూ వస్తుంది. ఇప్పుడైతే అనేక భాషలున్నాయి. రాజును అనుసరించి భాష నడుస్తుంది. సేవాకేంద్రాలలో పిల్లలందరిదీ ఒకే మతమని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండిన్రి మాతమ్రే స్మృతి చేయాలి అప్పుడే భూతాలన్నీ పారిపోతాయి. ఆ తండ్రి పతితపావనులు. 5 భూతాలు అందరిలో ప్రవేశమై ఉన్నాయి. ఆత్మలోనే భూతాలు ప్రవేశిస్తాయి. ఆ భూతాలకు పేరు కూడా పెడ్తారు. దేహాభిమానము, కామము, క్రోధము............... మొదలైనవి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటే, సర్వవ్యాపి ఆత్మలని, ఆత్మలలో 5 వికారాలు స్వర్వవ్యాపిగా ఉన్నాయని చెప్పండి. అంతేకాని అందరిలో పరమాత్మ విరాజమానంగా లేరు. పరమాత్మలో 5 భూతాలు ఎలా ప్రవేశిస్తాయి! ఒక్కొక్క మాటను బాగా ధారణ చేయడం వలన మీరు పదమాపదమ్భాగ్యశాలురుగా అవుతారు. ఈ ప్రపంచములోని రావణ సాంప్రదాయమువారు ఏమంటున్నారు, తండ్రి ఏమంటున్నారు అని ఆలోచించి నిర్ణయము తీసుకోండి. ప్రతి ఒక్కరి శరీరములో ఆత్మ ఉంది. ఆత్మలో 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి, శరీరములో కాదు. ఆత్మలో 5 వికారాలు లేక 5 భూతాలు ప్రవేశమవుతాయి. సత్యయుగములో ఈ 5 భూతాలు ఉండవు. దాని పేరే దైవీ ప్రపంచము. ఇది సైతాన్ప్రపంచము. సైతాన్అని, డెవిల్అని అసురులను అంటారు. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. ఇప్పుడు మీరు పరివర్తనవుతారు. అక్కడ మీలో ఏ వికారము గానీ, ఏ అవగుణము గానీ ఉండదు. మీలో గుణాలు సంపూర్ణంగా ఉంటాయి. మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. మొదట అలా ఉండేవారు తర్వాత క్రిందకు దిగుతూ వచ్చారు. ఈ చక్రము గురించి, 84 జన్మల చక్రమెలా తిరుగుతూ ఉందో మీకిప్పుడే అర్థమయ్యింది. ఆత్మలైన మనకు స్వదర్శనము జరిగింది అనగా ఈ చక్ర జ్ఞానము లభించింది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మీ బుద్ధిలో ఈ జ్ఞానముండాలి. తండ్రి జ్ఞానమును చదివిస్తున్నారు అనగా ఆత్మిక జ్ఞానాన్ని చదివిస్తున్నారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి భారతదేశములోనే వచ్చి ఇస్తారు. మా భారతదేశమని అంటారు కదా. వాస్తవానికి హిందుస్థాన్అని అనడం తప్పు. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు కేవలం మన రాజ్యమే ఉండేది. ఇతర ధర్మమేదీ లేదు. నూతన ప్రపంచంగా ఉండేది. న్యూ ఢిల్లీ అని అంటారు కదా. ఢిల్లీ అసలు పేరు కాదు, ఫరిస్తాన్అని అనేవారు. ఇప్పుడు కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు. తర్వాత పాతదీ ఉండదు, క్రొత్తదీ ఉండదు. ఫరిస్తాన్అని పిలువబడ్తుంది. ఢిల్లీని ముఖ్య పట్టణము అని అంటారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము వస్తుంది. ఇంకే రాజ్యమూ ఉండదు. మన రాజ్యమే ఉంటుంది. ఇప్పుడు రాజ్యమే లేదు. అందుకే మా భారతదేశము అని అంటారు. రాజులు లేనే లేరు. పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానమంతా తిరుగుతూ ఉంటుంది. మొట్టమొదట ఈ విశ్వములో దేవీదేవతల రాజ్యముండేది. ఇతర రాజ్యమేదీ ఉండేది కాదు. దేవతల ముఖ్య పట్టణము ఢిల్లీనే, యమునా నది తీరాన ఉండేది. దానిని ఫరిస్తాన్అని అనేవారు. అందుకే అది అందరినీ ఆకర్షిస్తుంది. అన్నింటికంటే పెద్దది. కరెక్టుగా మధ్యలో ఉంది.

మధురాతి మధురమైన పిల్లలూ! పాపాలు చేసి పాపాత్మలుగా అయ్యామని అర్థం చేసుకున్నారు. సత్యయుగములో పుణ్యాత్మలుంటారు. స్వయం తండ్రియే వచ్చి పావనంగా చేస్తారు. ఆ తండ్రిదే మీరు శివజయంతి కూడా జరుపుకుంటారు. జయంతి అనే పదము అందరికీ అన్వయిస్తుంది. అందుకే దీనిని శివరాత్రి అని అంటారు. రాత్రికి అసలైన అర్థము మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. శివరాత్రి అంటే ఏమిటో గొప్ప-గొప్ప విద్వాంసులకే తెలియదు. ఇక పండుగ ఏమి జరుపుకుంటారు! రాత్రి అంటే అర్థమేమిటో తండ్రి తెలుపుచున్నారు. ఈ 5 వేల సంవత్సరాల చకమ్రులో సుఖ-దు:ఖాల నాటకముంది. సుఖమును పగలని, దు:ఖమును రాతి అని అంటారు. ఈ రాతిక్రి - పగులుకు మధ్య సంగమ యుగము వస్తుంది. అర్ధకల్పము వెలుగు, అర్ధకల్పము అంధకారము. భక్తిమార్గములో చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తారు. ఇక్కడ ఒక్క సెకండు చాలు. చాలా సులభము. ఇది సహజ యోగము. మీరు మొదట ముక్తిధామానికి వెళ్లాలి. ఆ తర్వాత జీవన్ముక్తిలో ఎంత సమయముండినారో పిల్లలైన మీ స్మృతిలో ఉంది. కానీ క్షణ-క్షణము మర్చిపోతారు. యోగము అనే శబ్ధము సరియైనది. వారిది శారీరిక యోగము. ఇది పరమాత్మతో ఆత్మల యోగము. సన్యాసులు అనేక ప్రకారాల హఠయోగము మొదలైనవి నేర్పిస్తారు. అందువలన మనుష్యులు తికమకపడ్తూ ఉంటారు. ఇక్కడ తండే కాక టీచరు కూడా వారే. కావున వారితో యోగము చేయాల్సి పడ్తుంది కదా. టీచరు ద్వారా చదువుకోవలసి వస్తుంది. పిల్లలు జన్మిస్తూనే మొదట తండ్రితో యోగముంటుంది. 5 సంవత్సరాల తర్వాత టీచరుతో యోగము చేయవలసి వస్తుంది. ఆ తర్వాత వానప్రస్థ స్థితిలో గురువుతో యోగము చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 3 సంబంధాలు గుర్తుంటాయి. అక్కడ వేరు వేరుగా ఉంటారు. ఇక్కడ ఈ తండి వచ్చేది ఒక్కసారి మాతమ్రే. ఈ తండే టీచరుగా అవుతారు. అద్భుతము కదా. ఇటువంటి తండిన్రి తప్పకుండా స్మృతి చేయాలి. జన్మ-జన్మాంతరాలు వేరు వేరుగా స్మృతి చేస్తూ వచ్చారు. సత్యయుగములో కూడా తండ్రితో యోగముంటుంది. ఆ తర్వాత టీచరుతో ఉంటుంది. చదువుకునేందుకు వెళ్తారు కదా. అక్కడ గురువు అవసరముండదు ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు. ఈ విషయాలను స్మృతి చేయడంలో కష్టమేముంది? చాలా సులభము. దీనిని సహజయోగమని అంటారు. అయితే ఇది అసాధారణమైనది. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరాన్ని తాత్కాలికంగా అప్పు తీసుకున్నాను. అది కూడా చాలా కొంత సమయము కొరకే. 60 సంవత్సరాలకు వానప్రస్థ స్థితి అవుతుంది. 60 వస్తూనే చేతికి కర్ర వచ్చింది అని అంటారు. ఈ సమయంలో అందరికీ చేతికర్రలొచ్చాయి. అందరూ వానప్రస్థ స్థితికి, నిర్వాణధామములోకి వెళ్తారు. అది మధురమైన ఇల్లు(స్వీట్హోమ్) అత్యంత మధురమైన ఇల్లు. దాని కొరకే ఎంతో భక్తి చేశారు. ఇప్పుడు చక్రములో తిరిగి వచ్చారు. మానవులకిది ఎంత మాత్రము తెలియదు. కానీ మానవులు లక్షల సంవత్సరాల చక్రమని కల్పనలు, వ్యర్థ ప్రలాపాలు చేశారు. లక్షల సంవత్సరాలైతే విశ్రాంతే లభించదు. విశ్రాంతి లభించడమే కష్టమవుతుంది. మీకు విశ్రాంతి లభిస్తుంది. దానిని సైలెన్స్హోమ్, నిరాకార ప్రపంచమని అంటారు. ఇది స్థూలమైన స్వీట్హోమ్, అది మూలమైన స్వీట్హోమ్. ఆత్మ అతిచిన్న రాకెట్. దాని కంటే వేగవంతమైనదేదీ లేదు. ఇది అన్నింటికంటే వేగవంతమైనది. ఒక శరీరాన్ని వదిలి తయారుగా ఉన్న మరొక శరీరములోకి పరుగు తీస్తుంది. డ్రామానుసారము ఆత్మ ఖచ్చితమైన సమయానికి వెళ్లే తీరాలి. డ్రామా చాలా ఖచ్చితమైనది. ఇందులో ఏ పొరపాటూ లేదు. ఇదంతా మీకు తెలుసు. తండ్రి కూడా డ్రామానుసారము చాలా ఖచ్చితమైన సమయానికి వస్తారు. ఒక్క సెకండు కూడా వ్యత్యాసముండదు. ఇతనిలో భగవంతుడున్నారని ఎలా తెలుస్తుంది? జ్ఞానము తెలుపునప్పుడు వారే కూర్చుని పిల్లలకు చెప్తారు. శివరాత్రి కూడా జరుపుకుంటారు కదా. నేను శివుడను, ఎప్పుడు ఎలా వస్తానో మీకు తెలియదు. శివరాత్రి, కృష్ణరాత్రిని జరుపుకుంటారు. రాముని రాత్రి జరుపుకోరు ఎందుకంటే వ్యత్యాసముంది కదా. శివరాత్రితో పాటు కృష్ణరాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ దీనిని గురించి ఏ మాత్రము తెలియదు. ఇక్కడ ఉండేదే ఆసురీ రావణ రాజ్యము. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ఇతను బాబా. వృద్ధులను బాబా అని అంటారు. చిన్న పిల్లలను బాబా అని అనరు. కొంతమంది పిల్లలను కూడా ప్రేమతో బాబా అని అంటారు. అందుకే వారు కూడా ప్రేమతో కృష్ణుని బాబా అని అన్నారు. పెద్దవారై పిల్లలు కలిగినప్పుడు తండ్రి అని అంటారు. కృష్ణుడు స్వయం రాకుమారుడు. అతనికి పిల్లలు ఎక్కడ నుండి వచ్చారు? నేను వానప్రస్థ(అనుభవీ) శరీరములో వస్తానని తండ్రి చెప్తున్నారు. శాస్త్రాలలో కూడా ఈ విషయముంది. అయితే శాస్త్రాలలోని అన్ని మాటలు సరి కాదు. కొన్ని మాటలు సరిగ్గా ఉన్నాయి. బ్రహ్మ ఆయుష్షు అనగా ప్రజాపిత బ్రహ్మ ఆయుష్షు. ఆయన ఇప్పుడు తప్పకుండా ఇక్కడనే ఉంటాడు. బ్రహ్మ ఆయువు మృత్యులోకములోనే సమాప్తమౌతుంది. ఇది అమరలోకము కాదు. దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. ఇది మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ ఉండదు.

తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, మీ జన్మల గురించి మీకు తెలియదు. మీరు 84 జన్మలు తీసుకుంటారని నేను చెప్తున్నాను. ఏ విధంగా తీసుకుంటారో కూడా మీకు తెలిసిపోయింది. ఒక్కొక్క యుగము ఆయువు 1250 సంవత్సరాలని, ఒక్కొక్క యుగములో ఇన్ని జన్మలు తీసుకున్నారని కూడా తెలుసు. 84 జన్మల లెక్కాచారముంది కదా. 84 లక్షలంటే లెక్క చెప్పలేరు. దీనిని 84 జన్మల చక్రమని అంటారు. 84 లక్షలంటే గుర్తే ఉండదు. ఇక్కడ ఎంతో అపారమైన దు:ఖముంది. దు:ఖమును కలిగించే పిల్లలే జన్మిస్తారు. దీనిని ఘోర నరకమని అంటారు. మీది పూర్తిగా పాడైపోయిన వికారీ(ఛీ-ఛీ) ప్రపంచము. ఇప్పుడు మనము నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. పాపాలు సమాప్తమైతే పుణ్యాత్మలుగా అవుతాము. ఇప్పుడు ఏ పాపమూ చేయరాదు. ఒకరి పై ఒకరు కామ ఖడ్గమును ఉపయోగిస్తే

(వికారము కలిగి ఉండుట), అది ఆదిమధ్యాంతాలు దు:ఖమునిస్తుంది. ఇప్పుడీ రావణ రాజ్యము సమాప్తమౌతుంది. ఇది

కలియుగ అంతిమ సమయము. ఇది అంతిమ మహాభారీ యుద్ధము. ఆ తర్వాత యుద్ధమే ఉండదు. అక్కడ ఏ యజ్ఞమూ రచింపబడదు. యజ్ఞమును రచించినప్పుడు అందులో స్పాహా చేస్తారు. పిల్లలు తమ పాత సామాగిన్రంతటిని స్వాహా చేసేస్తారు. ఇది రుద జ్ఞాన యజ్ఞమని తండి అర్థం చేయిస్తున్నారు. శివుని రుద్రుడని అంటారు. రుద్రమాల అని అంటారు కదా. నివృత్తి మార్గములోని వారికి ప్రవృత్తి మార్గపు ఆచార వ్యవహారాలేవీ తెలియవు. వారు ఇల్లు-వాకిళ్లు వదిలి అడవులకు వెళ్లిపోతారు. దాని పేరే సన్యాసము. దేనిని సన్యసిస్తారు? ఇల్లు-వాకిళ్లను సన్యసిస్తారు. వట్టి చేతులతో బయటకు వస్తారు. ఇంతకు పూర్వము గురువులు చాలా పరీక్ష చేసేవారు, పని చేయించేవారు. మొదట భిక్షాటనలో కేవలం పిండి లేక బియ్యము, ధాన్యము తీసుకునేవారు. వండిన పదార్థాలు స్వీకరించేవారు కాదు. వారు అడవులలోనే ఉండాలి. అక్కడ కంద-మూలాలు, ఫలాలు లభిస్తాయి. సతోప్రధానమైన సన్యాసులు ఈ పదార్థాలనే భుజిస్తారనే గాయనముంది. ఇప్పుడైతే అడగాల్సిన పనే లేదు. ఏమేమో చేస్తారు. దీని పేరే వికారి ప్రపంచము. అది నిర్వికారి ప్రపంచము. ఇక్కడ అందరూ పతిత మానవులే. అందుకే దేవీ-దేవతలకు బదులు హిందువులని పేరుంచుకున్నారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు నిజానికి అనంతమైన ఆ తండ్రి పిల్లలు. వారు మీకు 21 జన్మల వారసత్వమునిస్తారు. అందువలన తండి తన మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీ తల పై జన్మ-జన్మాంతరాల పాప భారముంది. పాపాల నుండి ముక్తి పొందేందుకే మీరు నన్ను పిలుస్తారు. సాధు సత్పురుషులంతా ''ఓ పతితపావనా!..........'' అని పిలుస్తూ ఉంటారు. కానీ వారికి అర్థము కొంచెము కూడా తెలియదు. ఊరికే పాడుతూ తాళాలు, చప్పట్లు చరుస్తూ ఉంటారు. ఎవరైనా పరమాత్మతో యోగమెలా చేయాలని, వారినెలా కలవాలని అడిగితే, పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. మార్గమును చూపడమంటే ఇదేనా? వేదశాస్త్రాలు చదివితే భగవంతుడు లభిస్తారని అంటారు. తండి అంటున్నారు - నేను పత్రి 5 వేల సంవత్సరాల తర్వాత డామ్రా ప్లాను అనుసారంగా వస్తాను. ఈ డామ్రా రహస్యము తండిక్రి తప్ప మరెవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాల డామ్రా ఉండనే ఉండదు. ఇప్పుడు తండి చెప్తున్నారు - ఇది 5 వేల సంవత్సరాల మాట. కల్పకిత్రము కూడా బాబా వచ్చి 'మన్మనాభవ' అని చెప్పారు. ఇది మహామంతమ్రు. ఇది మాయ పై విజయము పొందుకునే మంతమ్రు. తండ్రే కూర్చుని అర్థము చేయిస్తున్నారు. ఇతరులెవ్వరూ దారి తెలుపలేరు. సర్వుల సద్గతిదాత ఒకే ఒక్కరు. మానవులెవ్వరూ చెప్పలేరు. దేవతలు కూడా చెప్పలేరు. అక్కడ సుఖమే సుఖముంటుంది. అక్కడ ఎవ్వరూ భక్తి చేయరు. భగవంతుని కలుసుకునేందుకు ఇక్కడ భక్తి చేస్తారు. సత్యయుగములో భక్తి ఉండదు ఎందుకంటే 21 జన్మల వారసత్వము లభించింది. అందుకే దు:ఖములో స్మరిస్తే.......... ఇక్కడ అంతులేని దు:ఖముంది. మాటిమాటికి '' భగవంతుడా! దయ చూపండి '' అని అంటూ ఉంటారు. ఈ దు:ఖభరితమైన ప్రపంచము సదా ఉండదు. సత్య-త్రేతా యుగాలు గతించిపోయాయి. మళ్లీ వస్తాయి. లక్షల సంవత్సరాలైతే జ్ఞాపకము కూడా ఉండదు. ఇప్పుడు ఆ తండ్రి జ్ఞానమంతా అర్థం చేయిస్తున్నారు. తమ పరిచయమును కూడా ఇస్తున్నారు. అంతేకాక రచన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు. 5 వేల సంవత్సరాల మాట. పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు పరాయి రాజ్యములో ఉన్నారు. మీకు మీ రాజ్యముండేది. ఇక్కడ యుద్ధము చేసి రాజ్యమును పొందుతారు. ఆయుధాలతో, మారణహోమాలతో రాజ్యమును పొందుతారు. పిల్లలైన మీరు యోగబలముతో రాజ్యమును స్థాపన చేస్తున్నారు. మీకు సతోప్రధానమైన ప్రపంచము కావాలి. పాత ప్రపంచము సమాప్తమై నూతన ప్రపంచము తయారవుతుంది. దీనిని కలియుగమని, పాత ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచమును సత్యయుగమని అంటారు. ఇది మీ కల్పన అని సన్యాసులంటారు. సత్యయుగము ఇక్కడనే ఉంటుంది. కలియుగము కూడా ఇక్కడనే ఉంది. తండ్రిని తెలుసు కున్నవారు ఒక్కరు కూడా లేరని తండ్రి తెలియజేస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే పరిచయమిస్తారు కదా. సత్య, త్రేతా యుగాలంటే ఏమో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు ఆ తండ్రి బాగా అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రికి సర్వమూ తెలుసు. అన్నీ తెలిసినవారు అనగా జ్ఞానసాగరులు, సుఖసాగరులు, వారి ద్వారానే మనకు వారసత్వము లభిస్తుంది. తండ్రి జ్ఞానములో తమ సమానంగా చేస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇది పాపాల నుండి ముక్తులయ్యే సమయము అందువలన ఇప్పుడు ఏ పాపమూ చేయరాదు. పాత సామాగ్రినంతా ఈ రుద్ర యజ్ఞములో స్వాహా చేయాలి.
2. ఇప్పుడు వానప్రస్థ స్థితి కనుక తండ్రి, శిక్షకులతో పాటు సద్గురువును కూడా స్మృతి చేయాలి. స్వీట్హోమ్లోకి వెళ్లేందుకు ఆత్మను సతోప్రధానంగా పావనంగా చేసుకోవాలి.

వరదానము:- '' సమయాన్ని శిక్షకునిగా చేసుకునేందుకు బదులు తండ్రిని శిక్షకునిగా చేసుకునే మాస్టర్రచయిత భవ ''
చాలామంది పిల్లలకు సేవ చేయాలనే ఉత్సాహముంది కానీ వైరాగ్య వృత్తి పై అటెన్షన్లేదు. అందులో నిర్లక్ష్యంగా ఉన్నారు. నడుస్తుంది,....... జరుగుతుంది,..... అయిపోతుంది....... సమయమొచ్చినప్పుడు అంతా సరిపోతుంది,........ ఇలా అనుకోవడం అనగా సమయాన్ని తమ శిక్షకునిగా చేసుకోవడం. పిల్లలు తండ్రికి కూడా, చింతించండి బాబా, సమయానికి సరిపోతుంది, చేసుకుంటాము అని దిలాసానిస్తారు. కానీ మీరు మాస్టర్రచయితలు, సమయం మీ రచన. రచన మాస్టర్రచయితలకు శిక్షకునిగా అవ్వడం శోభనివ్వదు.

స్లోగన్:- ''తండ్రి పాలనకు రిటర్న్స్వయాన్ని మరియు సర్వులను పరివర్తన చేయడంలో సహయోగులుగా అవ్వడం. ''

No comments:

Post a Comment