Thursday, October 24, 2019

Telugu Murli 25/10/2019

25-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మిమ్ములను కుంభీపాక నరకము నుండి వెలికి తీసేందుకు తండ్రి వచ్చారు, అందుకే పిల్లలైన మీరు తండ్రిని ఆహ్వానించారు ''

ప్రశ్న :- పిల్లలైన మీరు చాలా గొప్ప శిల్పకారులు - ఎలా? మీ కర్తవ్య నిపుణత ఏది ?
జవాబు :- పిల్లలైన మనము ఎంతో గొప్ప శిల్ప నిపుణతను చూపిస్తున్నాము. దీని వలన పూర్తి ప్రపంచమే కొత్తదిగా తయారవుతుంది. దీని కొరకు మనము ఇటుకలు, సున్నము, పారలు మొదలైనవి ఉపయోగించము కాని స్మృతియాత్ర ద్వారా నూతన ప్రపంచాన్ని తయారుచేస్తాము. నూతన ప్రపంచాన్ని నిర్మిస్తున్నాము, మళ్లీ మనమే స్వర్గానికి అధికారులవుతామనే సంతోషముంది.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు మీ మీ గ్రామాల నుండి బయలుదేరినప్పుడు మేము శివబాబా పాఠశాలకు వెళ్తున్నామని మీ బుద్ధిలో ఉంటుంది. అంతేకాని ఏ సాధు సత్పురుషుల దర్శనము కొరకు లేక శాస్త్ర్రాలు మొదలైనవి వినేందుకు వెళ్తున్నామని భావించరు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నామని మీకు తెలుసు. శివుడు పైన ఉంటారని ప్రపంచములోని మనుష్యులు భావిస్తారు. స్మృతి చేయునప్పుడు వారు కనులు తెరుచుకుని కూర్చోరు. వారు కనులు మూసుకుని ధ్యానములో కూర్చుంటారు. వారి బుద్ధిలో వారు చూచిన శివలింగము ఉంటుంది. భలే శివుని మందినానికి వెళ్లినా, శివుని స్మృతి చేస్తున్నా పైకి చూస్తారు లేక మందిరము గుర్తుకొస్తుంది. చాలామంది కనులు మూసుకుని కూర్చుంటారు. ఒకవేళ దృష్టి ఏ నామ-రూపాల వైపు వెళ్తే మా సాధన తెగిపోతుందని భావిస్తారు. శివబాబాను స్మృతి చేస్తూ ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కొంతమంది కృష్ణుని, కొంతమంది రాముని స్మృతి చేస్తారు, కొంతమంది తమ గురువును స్మృతి చేస్తారు. గురువుగారి చిన్న లాకెట్‌ చేసుకొని కూడా ధరిస్తారు. కొందరు గీతను కూడా చిన్న లాక్‌ట్‌గా చేసుకొని ధరిస్తారు. భక్తిమార్గములో అయితే అందరూ ఇలాగే ఉన్నారు. ఇంటిలో కూర్చుని కూడా స్మృతి చేస్తారు. స్మృతిలో యాత్రలు చేసేందుకు కూడా వెళ్తారు. ఇంట్లో చిత్రాలుంచుకుని పూజించవచ్చు. కానీ భక్తిమార్గపు ఆచారము ప్రకారము జన్మ-జన్మాంతరాలు యాత్రలు చేస్తూ వచ్చారు. నాల్గు ధామాల యాత్ర చేస్తారు. నాల్గుధామాలని ఎందుకంటారు? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము.......... అన్ని వైపులా తిరుగుతారు. భక్తిమార్గము ప్రారంభమైనప్పుడు మొదట ఒక్కరినే భక్తి చేస్తారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. భక్తి కూడా వ్యభిచారి భక్తి అనగా అనేకమందిని స్మృతి చేస్తూ ఉంటారు. తమోప్రధానమైన 5 తత్వాలతో తయారైన శరీరాన్ని కూడా పూజిస్తారు. అనగా తమోప్రధానమైన భూత పూజలు చేస్తారు. కానీ ఈ మాటలు ఎవ్వరూ
అర్థము చేసుకోరు. భలే ఇచ్చట కూర్చుని ఉన్నా బుద్ధియోగము ఎక్కడో తిరుగుతూ, వెతుకుతూ ఉంటుంది. ఇక్కడైతే శివబాబాను స్మృతి చేసేందుకు కనులు మూసుకుని కూర్చోరాదు. ఆ తండ్రి అత్యంత దూరదేశములో ఉండేవారని మీకు తెలుసు. వారు వచ్చి పిల్లలకు శ్రీమతమునిస్తారు. శ్రీమతమును అనుసరిస్తేనే శ్రేష్ఠమైన దేవతలుగా అవుతారు. దేవతల రాజధాని పూర్తిగా స్థాపన అవుతూ ఉంది. మీరిక్కడ కూర్చుని మీ దేవీదేవతా రాజ్యమును స్థాపన చేస్తారు. ఇంతకుముందు అది ఎలా స్థాపనవుతుందో మీకు తెలియదు. ఇప్పుడు మీకు వీరు తండ్రి తండ్రి ఒకడే కాక టీచరై చదివిస్తారు. అంతేకాక వెంట తీసుకెళ్లి సద్గతినిస్తారని తెలుసు. ఆ గురువులు ఎవ్వరికీ సద్గతినివ్వలేరు. వీరు ఒక్కరే తండ్రి, టీచరు, సద్గురువు అని ఇక్కడ మీకు తెలిపించబడ్తుంది.తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. సద్గురువు పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచానికి తీసుకెళ్తారు. ఈ విషయాలన్నీ వృద్ధ మాతలు అర్థము చేసుకోలేరు. వారికి ముఖ్యమైన విషయము - ''స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబాను స్మృతి చేయాలి.'' మనము శివబాబా పిల్లలము, మనకు బాబా స్వర్గ వారసత్వమునిస్తారు. వృద్ధ మాతలకు ఇలాంటి చిలక పలుకులతో అర్థం చేయించాలి. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు ప్రతి ఆత్మకు హక్కు ఉంది. మృత్యువు మీ ముందే నిలిచి ఉంది. పాత ప్రపంచమే మళ్లీ తప్పకుండా కొత్తదిగా అవుతుంది, కొత్త నుండి మళ్లీ పాతదిగా అవుతుంది. కొత్త ఇల్లు కట్టేందుకు కొన్ని నెలలు చాలు. అది పాతదిగా అయ్యేందుకు 100 సంవత్సరాలు పడ్తుంది.ఈ పాత ప్రపంచము సమాప్తమవుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు జరగబోవు యుద్ధము 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ జరుగుతుంది. ఈ విషయాలను వృద్ధ మాతలు అర్థము చేసుకోలేరు. వారికి అర్థం చేయించడం బ్రాహ్మణీల కర్తవ్యము. వారికి ఒక్క మాట గుర్తుంటే చాలు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఆత్మలైన మీరు పరంధామములో ఉండేవారు. అక్కడ శరీరాలు ధరించి పాత్రను అభినయిస్తారు. ఆత్మ ఇక్కడ సుఖ-దు:ఖాల పాత్ర చేస్తుంది. ముఖ్యమైన విషయము బాబా చెప్తున్నారు - '' నన్ను స్మృతి చేయండి, సుఖధామమును స్మృతి చేయండి '' తండ్రిని

స్మృతి చేసినందున పాపాలు సమాప్తమవుతాయి. మళ్లీ స్వర్గములోకి వస్తారు. ఇప్పుడెంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత ఎక్కువగా పాపాలు సమాప్తమవుతాయి. వృద్ధ స్త్రీలు సత్సంగాలకు వెళ్లి కథలు వినేందుకు అలవాటు పడ్డారు. వారికి క్షణ క్షణము తండ్రి స్మృతిని ఇప్పించాలి. పాఠశాలలో చదువు చెప్తారు కానీ కథలు వినిపించరు. భక్తిమార్గములో మీరు ఆ కథలు చాలా విన్నారు. కానీ దాని వలన ఏ లాభము కలగలేదు. ఛీ-ఛీ ప్రపంచము నుండి నూతన ప్రపంచానికి వెళ్లలేకపోయారు. మానవులకు రచయిత అయిన తండ్రి గురించి గానీ, వారి రచన గురించి గానీ తెలియదు. నేతి -నేతి(తెలియదు, తెలియదు) అని అంటారు. మీకు కూడా ఇంతకు ముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు భక్తిమార్గము గురించి చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇళ్ళలో కూడా చాలామంది వద్ద విగ్రహాలుంటాయి. అదే విగ్రహమే(వస్తువే) ఉంటుంది. కొంతమంది భర్తలు ఆ మూర్తిని ఇంట్లోనే పెట్టుకుని పూజించమని అంటూ ఉంటారు. బయటకు ఎదురు దెబ్బలు తినేందుకు ఎందుకు వెళ్తారు? అని అంటారు. కానీ వారికి భావన ఉంటుంది తీర్థయాత్రలకు
వెళ్లడం అనగా భక్తిమార్గములో ఒకరినొకరు తోసుకోవడం, నష్టపోవడం అని ఇప్పుడు మీకు తెలుసు. మీరు అనేకమార్లు 84 జన్మల చక్రములో తిరిగారు. సత్య-త్రేతాయుగాలలో ఏ యాత్రలు ఉండవు. అక్కడ మందిరాలు మొదలైనవేవీ ఉండవు. ఈ యాత్రలు మొదలైనవన్నీ భక్తిమార్గములోనే ఉంటాయి. జ్ఞానమార్గములో ఇవేవీ ఉండవు. దానిని భక్తి అని అంటారు. జ్ఞానమిచ్చేవారు ఆ ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు. జ్ఞానము ద్వారానే సద్గతి జరుగుతుంది. సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. శివబాబాను ఎవ్వరూ శ్రీ శ్రీ అని అనరు. వారికి బిరుదులు అవసరము లేదు. ఈ ప్రపంచములోని వారు ఆడంబరము కావాలంటారు. వారిని శివబాబా అని అంటారు. బాబా, మేము పతితులయ్యాము మీరు వచ్చి పావనము చేయండి అని మీరు పిలుస్తారు. భక్తిమార్గపు ఊబిలో గొంతువరకు మునిగి చిక్కుకుని ఉన్నారు. చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నారు. విషయవాసనల ఊబిలో పూర్తిగా చిక్కుకుంటారు.మెటికలు(తాపలు) దిగుతూ దిగుతూ చిక్కుకుని పోయారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. అప్పుడు ''బాబా, మమ్ములను వెలికి తీయండి'' అని పిలుస్తారు. డ్రామానుసారంగా బాబా కూడా రావలసి వస్తుంది. బాబా చెప్తున్నారు - నేను వీరందరినీ ఊబి నుండి వెలుపలికి తీసేందుకు బంధింపబడి ఉన్నాను. దీనిని కుంభీపాక నరకమని అంటారు, రౌరవ నరకము అని కూడా అంటారు. ఈ విషయాలన్నీ బాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారికిది నరకమని తెలియనే తెలియదు.
తండ్రిని ఎలా ఆహ్వానిస్తున్నారో చూడండి! పెండ్లిండ్లు మొదలైన వాటికి ఆహ్వానిస్తారు కాని మీరు - ''ఓ పతితపావన బాబా, ఈ పతిత ప్రపంచము, రావణ ప్రపంచము, పాత ప్రపంచములోకి రండి, మేము గొంతు వరకు కూరుకొనిపోయాము'' అని పిలుస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ వెలుపలికి తీయలేరు. ''దూరదేశములో ఉండు ఓ శివబాబా, ఇది రావణ దేశము, సర్వాత్మలు తమోప్రధానమైపోయాయి, వచ్చి మమ్ములను పావనంగా చేయండి'' అని పిలుస్తూ ఉంటారు. పతితపావన సీతారామ్‌ అని బిగ్గరగా పాడుతూ ఉంటారు. అలాగని పాడేవారు పవిత్రంగా ఉంటారని కాదు. ఈ ప్రపంచమే పతితంగా ఉంది, రావణ రాజ్యంగా ఉంది. ఇందులో మీరు చిక్కుకుని పోయారు. అందుకే బాబా, మీరు వచ్చి ఈ కుంభీపాక నరకము నుండి వెలికి తీయండి అని పిలిచారు. అందుకే తండ్రి వచ్చారు. వారు(తండ్రి) మీకెంత వినయ విధేయతలు గల సేవకుడు! పిల్లలైన మీరు ఈ డ్రామాలో అంతులేని దు:ఖమును
అనుభవించారు. సమయము గడిచిపోతూ ఉంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. ఇప్పుడు తండ్రి మిమ్ములను లక్ష్మీనారాయణుల వలె తయారు చేస్తారు. మళ్లీ మీరు అర్ధకల్పము రాజ్యము చేస్తారు. జ్ఞాపకము(స్మృతి) తెచ్చుకోండి. ఇప్పుడిక సమయము చాలా కొద్దిగా ఉంది. త్వరలో మృత్యు లీల పార్రంభమవుతుంది. మానవులు తికమకపడ్తారు. చాలా కొద్ది సమయములోనే ఎన్నో మార్పులు జరుగుతాయి. చాలామంది పెద్ద శబ్ధాలు విన్నా హార్ట్‌ఫెయిల్‌(గుండె ఆగి) అయ్యి మరణిస్తారు. ఎలా మరణిస్తారంటే వర్ణించలేము. ఎంతోమంది వృద్ధ మాతలు వచ్చారు. వారికేమీ అర్థము కాదు. తీర్థ స్థానాలకు వెళ్లినట్లు ఒకరిని చూచి మరొకరు తయారై మేము కూడా వస్తామని బయలుదేరి వస్తారు.భక్తిమార్గములోని తీర్థయాత్రలనగా క్రిందకు దిగుట, తమోప్రధానమగుట అని ఇప్పుడు మీకు తెలుసు. మీది అందరికంటే పెద్ద యాత్ర. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి వెళ్తారు. అందువలన ఈ పిల్లలకు శివబాబా స్మృతి కలిగిస్తూ ఉండండి. శివబాబా పేరు గుర్తుందా? అని అడుగుతూ ఉండండి. కొద్దిగా విన్నా స్వర్గములోకి వస్తారు. ఆ ఫలము తప్పకుండా లభిస్తుంది. పోతే పదవి మాత్రము చదువు ద్వారానే లభిస్తుంది. అందులో చాలా
తేడాలొస్తాయి. అత్యంత ఉన్నతము మళ్లీ అత్యంత నీచము. రెండిటికి రాత్రికి పగులుకున్నంత వ్యత్యాసము ఏర్పడ్తుంది. ప్రధానమంత్రి ఎక్కడ? నౌకర్లు, చాకర్లెక్కడ? రాజధానిలో నెంబరువారుగా ఉంటారు. స్వర్గములో కూడా రాజధాని ఉంటుంది. కానీ అక్కడ పాపాత్మలు, వికారులు, మురికివారు ఉండనే ఉండరు. అది నిర్వికార ప్రపంచము. లక్ష్మీనారాయణులుగా తప్పకుండా అవుతామని మీరంటారు. మీరు చేతులెత్తడం చూచి ఈ వృద్ధ మాతలు మొదలైనవారు కూడా చేతులెత్తుతారు. కొంచెము కూడా అర్థము కాదు. అయినా తండ్రి వద్దకు వచ్చారంటే తప్పకుండా స్వర్గములోకి వస్తారు, కానీ అందరూ ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వరు, ప్రజలుగా కూడా అవుతారు. తండి చెప్తున్నారు - నేను పేదల పెన్నిధిని. బాబా పేదలను చూచి సంతోషిస్తారు. వారు ఎంత గొప్ప ధనవంతులైనా, వారి కంటే వీరు 21 జన్మలకు గొప్ప పదవి పొందుతారు. ఇది కూడా మంచిదే. వృద్ధ మాతలు వచ్చినప్పుడు వారిని చూచి తండ్రికి చాలా సంతోషము కలుగుతుంది. కృష్ణపురిలోకి ఎలాగైనా వెళ్తారు కదా. ఇది రావణపురము. ఎవరు బాగా చదువుకుంటారో వారు కృష్ణుని కూడా ఒడిలో నిద్రపుచ్చుతారు. ప్రజలు లోపలకు రాలేరు. వారు ఎప్పుడో ఒకసారి దర్శించుకుంటారు. పోప్‌ కిటికీ వద్ద దర్శనమిచ్చినప్పుడు లక్షలమంది అక్కడ చేరి వారిని దర్శించుకుంటారు కదా. కాని పోప్‌ను మనమెందుకు దర్శించుకుంటాము. సదా పవిత్రముగా ఉండేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు వచ్చి మిమ్ములను పవిత్రంగా చేస్తున్నారు. విశ్వమంతటిని సతోప్రధానంగా చేస్తారు. అక్కడ ఈ 5 భూతాలు(వికారాలు) ఉండనే ఉండవు. 5 తత్వాలు కూడా సతోప్రధానమైపోతాయి. మీకు దాసీలైపోతాయి. ఎప్పుడు కూడా నష్టపరిచే ఇటువంటి వేసవి కాలము ఉండదు. 5 తత్వాలు కూడా నియమానుసారము నడుచుకుంటాయి. అకాలమృత్యువు ఉండదు. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్తారు. కావున మీ బుద్ధి నుండి నరకాన్ని తీసేయాలి. ఉదాహరణానికి క్రొత్త ఇల్లు కట్టుకుంటే పాత ఇంటి నుండి బుద్ధి తొలగిపోతుంది, బుద్ధి కొత్త దాని వైపే వెళ్తుంది. అయితే

ఇది అనంతమైన విషయము. కొత్త ప్రపంచము స్థాపనవుతూ ఉంది, పాతది వినాశమవుతుంది. మీరు నూతన ప్రపంచమైన స్వర్గమును తయారు చేయువారు. మీరకు చాలా మంచి శిల్పకారులు. మీ కొరకు మీరు స్వర్గమును తయారు చేసుకుంటున్నారు. ఎంతో మంచి గొప్ప శిల్పకారులు. స్మృతి యాత ద్వారా నూతన పప్రంచాన్ని అనగా స్వర్గాన్ని తయారుచేస్తారు. కొద్దిగా స్మృతి చేసినా స్వర్గములోకి వచ్చేస్తారు. మీరు గుప్తంగా మీ స్వర్గమును తయారు చేసుకుంటున్నారు. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత స్వర్గములో నివసిస్తామని మనకు తెలుసు. అటువంటి అనంతమైన తండ్రిని మర్చిపోరాదు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్లేందుకు చదువుకుంటున్నారు. మీ రాజధానిని స్థాపన చేసేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఈ రావణ రాజధాని సమాప్తమవ్వనున్నది. అందువలన ఆంతరికములో ఎంతో సంతోషించాలి. ఈ స్వర్గాన్ని మనము అనేకమార్లు తయారు చేశాము, రాజ్యపదవి తీసుకున్నాము మళ్లీ పోగొట్టుకున్నాము. ఇది గుర్తుకొచ్చినా చాలా మంచిది. మనము స్వర్గానికి అధికారులుగా ఉండేవారము. ఆ తండ్రి మనలను అలా తయారు చేశారు. తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమవుతాయి. ఎంతో సులభంగా మీరు స్వర్గ స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచ వినాశనము కొరకు
ఎన్నో వస్తువులు కనుగొంటూ ఉంటారు. ప్రాకృతిక ఆపదలు, మిసైల్స్‌ మొదలైన వాటి ద్వారా పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. మీకు శేష్ఠ్ర మతమును ఇచ్చి శేష్ఠ్రమైన స్వర్గాన్ని స్థాపన చేసేందుకు తండి వచ్చారు. మీరు ఈ స్వర్గమును అనేకమార్లు స్థాపన చేశారు అందువలన బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అనేకమార్లు రాజ్యమును పొంది మళ్లీ పోగొట్టుకున్నారు. బుద్ధిలో ఈ ఆలోచన జరుగుతూ ఉండాలి. ఒకరికొకరు కూడా ఈ మాటలు వినిపించుకుంటూ ఉండండి. ప్రాపంచిక విషయాలలో సమయాన్ని పోగొట్టుకోరాదు. తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చకధ్రారులుగా అవ్వండి. ఇచ్చట పిల్లలు బాగా శ్రద్ధగా విని నెమరు వేయాలి. బాబా ఏం వినిపించినా దానిని బాగా స్మరణ చేయాలి. శివబాబాను, వారసత్వమును తప్పకుండా స్మృతి చేయాలి. తండ్రి అరచేతిలో వైకుంఠాన్ని (స్వర్గమును) తీసుకొని వచ్చారు. దాని కొరకు పవితంగా కూడా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుంటే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. చాలా తక్కువ పదవిని పొందుకుంటారు. స్వర్గములో ఉన్నత పదవి పొందాలంటే బాగా ధారణ చేయాలి. తండ్రి చాలా సులభ
మార్గము తెలుపుతున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి వినిపించిన దానిని బాగా విని తర్వాత నెమరు వేయాలి. ప్రాపంచిక విషయాలలో మీ సమయాన్ని పోగొట్టుకోరాదు.
2. తండ్రి స్మృతిలో కళ్ళు మూసుకొని కూర్చోరాదు. శ్రీ కృష్ణుని రాజధానిలోకి వచ్చేందుకు చాలా బాగా చదువుకోవాలి.

వరదానము :- '' '' మన్మనాభవ '' గా అయ్యి అలౌకిక విధి ద్వారా మనోరంజనాన్ని జరుపుకునే బాప్‌సమాన్‌ భవ ''
సంగమయుగంలో స్మృతిచిహ్నంగా జరుపుకోవడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. ఇది సంగమ యుగ కానుక. బాగా జరుపుకోండి కాని తండ్రితో మిలనము చేస్తూ జరుపుకోండి. కేవలం మనోరంజన రూపంలో కాదు, మన్మనాభవగా ఉంటూ మనోరంజనాన్ని జరుపుకోండి. అలౌకిక విధి ద్వారా అలౌకిక మనోరంజనం అవినాశిగా అయిపోతుంది. సంగమయుగ దీపావళి జరుపుకునే విధానము - పాత ఖాతాను సమాప్తం చేయడం. ప్రతి సంకల్పము, ప్రతి ఘడియ కొత్తది అనగా అలౌకికంగా ఉండాలి. పాత సంకల్పాలు, సంస్కారాలు, స్వభావాలు, నడవడికలు - ఇవన్నీ రావణుని అప్పులు. వీటిని దృఢ సంకల్పముతో సమాప్తము చేయండి.

స్లోగన్‌ :- '' మాటలను చూచేందుకు బదులు స్వయాన్ని మరియు తండ్రిని చూడండి ''

No comments:

Post a Comment