Monday, October 21, 2019

Telugu Murli 22/10/2019

22-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - రావణుని నియమము ఆసురీ మతము, అసత్యము చెప్పడం. తండ్రి నియమము - శ్రీమతము, సత్యము చెప్పడం. ''

ప్రశ్న :- ఏ విషయాలు ఆలోచిస్తూ పిల్లలు ఆశ్చర్యపడాలి ?
జవాబు :- ఈ అనంతమైన అద్భుతమైన నాటకము గురించి. 1. ఒక్కొక్క సెకండు ఏ పాత్ర్ర జరిగిపోయిందో అది మళ్లీ ఉన్నదున్నట్లు పునరావృతము

ఓంశాంతి. ఆత్మిక తండ్రి అయిన శివుడు కూర్చుని తన ఆత్మిక పిల్లలకు, సాలిగ్రామాలకు అర్థం చేయిస్తున్నారు. ఏం అర్థం చేయిస్తున్నారు? సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇలా అర్థం చేయించేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. మిగిలిన ఆత్మలు లేక సాలిగ్రామాలందరి శరీరాలకు పేర్లు ఉన్నాయి. పోతే స్వంత శరీరమే లేని వారు పరమాత్మ ఒక్కరే. ఆ పరమాత్మ పేరు శివుడు. వారినే పతితపావన పరమాత్మ అని అంటారు. వారే పిల్లలైన మీకు ఈ మొత్తం విశ్వం ఆదిమధ్యాంతాల రహస్యమును అర్థం చేయిస్తూ ఉన్నారు. పాత్రను అభినయించేందుకు అందరూ ఇక్కడకు వస్తారు.
విష్ణువుకు రెండు రూపాలని కూడా అర్థం చేయించారు. శంకరునికైతే ఇక్కడ ఏ పాత్రా లేదు. ఇవన్నీ ఆ తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఎప్పుడు వస్తారు? నూతన సృష్టి స్థాపన, పాత సృష్టి వినాశనము జరగాల్సినప్పుడు వస్తారు. పిల్లలకు నూతన ప్రపంచములో ఆదిసనాతన దేవీ దేవతా ర్మ స్థాపన జరుగుతుందని తెలుసు. ఇది పరమపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ చేయలేరు. ఆయన ఒక్కరే పరమ - ఆత్మ. వారిని పరమాత్మ అని అంటారు. వారి పేరు శివుడు. వారి పేరు శరీరానిది కాదు. మిగిలిన వారందరి పేర్లు శరీరాలవి. ముఖ్యమైన వారంతా వచ్చేశారని కూడా మీకు తెలుసు.
డ్రామా చక్రము తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు చివరికి వచ్చేసింది. చివరి సమయములో ఆ తండ్రే రావాలి. ప్రపంచం పరివర్తన అవ్వాల్సినప్పుడు వారి జయంతి కూడా జరుపుకుంటారు. గాఢాంధకారము నుండి గొప్ప ప్రకాశము అవుతుంది అనగా దు:ఖధామము నుండి సుఖధామంగా అవుతుంది. పాత ప్రపంచ వినాశము, నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు పురుషోత్తమ సంగమ యుగములో ఒక్కసారి మాత్రమే పరమపిత పరమాత్మ వస్తారని పిల్లలకు తెలుసు. ముందు నూతన ప్రపంచ స్థాపన జరిగిన తర్వాత పాత ప్రపంచము వినాశమవుతుంది. చదువుకుని మనము వివేకవంతులమై దైవీగుణాలు కూడా ధారణ చేయాలని పిల్లలకు తెలుసు. ఆసురీ గుణాలను మార్చుకోవాలి. దైవీ గుణాలు, ఆసురీ గుణాల వర్ణన చార్టులో చూపించాలి. ఎవ్వరినీ విసిగించడం లేదు కదా ? అసత్యమాడుట లేదు కదా ? శ్రీమతానికి విరుద్ధంగా నడవడం లేదు కదా ? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. అసత్యము చెప్పడం, ఇతరులకు దు:ఖమివ్వడం, విసిగించడం - ఇవన్నీ రావణుని నియమాలు. అవి రాముని నియమాలు. శ్రీమతము మరియు ఆసురీ మతాల
గాయనము కూడా ఉంది. అర్ధకల్పము ఆసురీ మతము నడుస్తుంది. దీని వలన మనుష్యులు అసురులు, దు:ఖితులు, రోగులుగా అవుతారు. పంచ వికారాలు ప్రవేశిస్తాయి. తండ్రి వచ్చి శ్రీమతమునిస్తారు. శ్రీమతము ద్వారా మనకు దైవీగుణాలు లభిస్తాయని పిల్లలైన మీకు తెలుసు. ఆసురీ గుణాలను పరివర్తన చేసుకోవాలి. ఆసురీ గుణాలు అలాగే ఉండిపోతే పదవి తగ్గిపోతుంది. జన్మ-జన్మాంతరాల పాప భారము తల పై ఉంది. అది నెంబరువారు పురుషార్థానుసారము తేలికైపోతుంది. ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగమని కూడా మీకు తెలుసు. తండ్రి ద్వారా ఇప్పుడు దైవీగుణాలు ధారణ చేసి నూతన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కావున పాత ప్రపంచము తప్పకుండా సమాప్తమవ్వనే అవుతుందని ఋజువవుతుంది.
బ్రహ్మకుమార-కుమారీల ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. మీకిది కూడా పక్కాగా నిశ్చయముంది అందువలన సేవలో లగ్నమై ఉన్నారు. ఎవరో ఒకరి కళ్యాణము చేసే శ్రమ చేస్తూ ఉంటారు.
మన సోదరీ-సోదరులు ఎంత సేవ చేస్తున్నారో కూడా మీకు తెలుసు. అందరికీ తండ్రి పరిచయమిస్తూ ఉంటారు. మొదట కొంతమందికి మాత్రమే తండ్రి పరిచయము లభిస్తుంది. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక్క బ్రహ్మ ద్వారా ఎంతోమంది బ్రహ్మాకుమారులుగా అవుతారు. బ్రాహ్మణ కులమైతే తప్పకుండా అవసరము కదా. మనమంతా బి.కెలము, శివబాబా పిల్లలము, అందరూ సోదరులమని మీకు తెలుసు. వాస్తవానికి మనమంతా సోదరులము. ప్రజాపిత బ్రహ్మ వారిగా అయిన తర్వాత సోదరీ-సోదరులుగా అవుతాము. తర్వాత దేవతా కులములోకి వెళ్లిన తర్వాత సంబంధాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ సమయంలో బ్రహ్మకు పుత్రులు, కూతుర్లు అనగా ఒకే కులానికి చెందినవారు. దీనిని వంశమని అనరు. కౌరవులకూ రాజ్యము లేదు, పాండవులకూ రాజ్యము లేదు. రాజా-రాణులు నంబరువారుగా సింహాసనము పై ఆసీసులైనప్పుడు వంశము ఏర్పడ్తుంది. ఇప్పుడైతే ప్రజల పై ప్రజా రాజ్యముంది. ప్రారంభము నుండి పవిత్ర వంశము, అపవిత్ర వంశాలు నడుస్తూ వచ్చాయి. దేవతలది పవిత్ర వంశము. 5 వేల సంవత్సరాల క్రితము స్వర్గము అనగా పవిత్ర వంశముండేదని పిల్లలకు తెలుసు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. మందిరాలు ఎంతో శోభాయమానంగా నిర్మింపబడి ఉన్నాయి. ఈ దేవతలకు మాత్రమే చాలా మందిరాలున్నాయి. ఇతరులెవ్వరికీ లేవు.
ఇతరుల శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. శివుని పేరొక్కటే మారకుండా ఉంటుందని పిల్లలకు అర్థం చేయించారు. శివభగవానువాచ - ఏ దేహధారినీ భగవంతుడని అనరు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ వారి పరిచయమివ్వలేరు. ఎందుకంటే వారికి తండ్రి ఎవరో తెలియనే తెలియదు. తండ్రినెలా స్మృతి చేయాలో తెలియని వారిక్కడ కూడా చాలామంది ఉన్నారు. తండ్రినెలా స్మృతి చేయాలని తికమకపడుతూ ఉంటారు. ఇంత చిన్న బిందువు, వారినెలా స్మృతి చేయాలని అంటారు. శరీరమేమో పెద్దది. దానినే స్మృతి చేస్తూ ఉంటారు. భృకుటి మధ్య ప్రకాశించే నక్షత్రము అని మహిమ కూడా ఉంది అనగా ఆత్మ నక్షత్రము వలె ఉంది. ఆత్మను సాలిగ్రామమని అంటారు. శివలింగమును కూడా పెద్ద రూపములో పూజిస్తారు. ఎలాగైతే ఆత్మను చూడలేరో శివబాబా కూడా ఎవరి కనులకూ కనిపించరు. భక్తిమార్గములో బిందువునెలా పూజించాలి. ఎందుకంటే మొట్టమొదట శివబాబా అవ్యభిచారి పూజ ప్రారంభమవుతుంది కదా. కనుక పూజించేందుకు తప్పకుండా పెద్దది కావాలి. సాలిగ్రామాలను కూడా పెద్ద అండము వలె తయారు చేస్తారు. ఒకవైపు అంగుష్టాకారమని అంటారు, మళ్లీ నక్షత్రమని కూడా అంటారు. ఇప్పుడు మీరైతే ఒక్క మాట పై నిలవాలి. అర్ధకల్పము పెద్ద వస్తువులను పూజించారు. ఇప్పుడు మళ్లీ బిందువని భావించడంలో శ్రమ కూడా ఉంది. చూడలేరు, బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. శరీరములో ఆత్మ పవ్రేశిస్తుంది, తర్వాత మళ్లీ వెళ్లిపోతుంది. ఎవ్వరూ చూడలేరు. పెద్ద వస్తువైతే కంటికి కూడా కనిపిస్తుంది. తండ్రి కూడా అలాంటి బిందువే, కానీ వారు జ్ఞానసాగరులు. ఇతరులెవ్వరినీ జ్ఞానసాగరులని అనరు. శాస్త్రాలైతే భక్తిమార్గానికి చెందినవి. ఇన్ని వేద శాస్త్రాలు మొదలైనవన్నీ ఎవరు తయారు చేశారు? వ్యాసుడని అంటారు. ఏసుక్రీస్తు ఆత్మ ఏ శాస్త్రమూ తయారు చేయలేదు. తర్వాత ఇవన్నీ మనుష్యులు కూర్చుని తయారుచేస్తారు. వారిలో జ్ఞానమే లేదు. ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానసాగరులు. శాస్త్రాలలో జ్ఞానము మాట గానీ, సద్గతినిచ్చే మాటలు గానీ లేవు. ప్రతి ధర్మము వారు తమ తమ ధర్మ స్థాపకులను స్మృతి చేస్తారు.
దేహధారులను స్మృతి చేస్తారు. ఏసుక్రీస్తు చిత్రము కూడా ఉంది కదా. అందరి చిత్రాలు ఉన్నాయి. శివబాబా పరమ ఆత్మ అయ్యారు. ఆత్మలంతా సోదరులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సోదరులలో జ్ఞానముండదు. వారు జ్ఞానమిచ్చి ఇతరులకు సద్గతినివ్వలేరు. సద్గతినిచ్చువారు ఒక్క తండ్రి మాత్రమే. ఈ సమయములో సోదరులూ ఉన్నారు, తండ్రి కూడా ఉన్నారు. తండ్రి వచ్చి విశ్వములోని ఆత్మలందరికి సద్గతినిస్తారు. విశ్వ సద్గతిదాత ఒక్కరే ఒక్కరు. శ్రీ శ్రీ 108 జగద్గురువు అనండి లేక విశ్వానికి గురువు అనండి అంతా ఒక్కటే. ఇప్పుడుండేది ఆసురీ రాజ్యము. సంగమ యుగములోనే తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు.
ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన జరుగుతోందని, పాత ప్రపంచము వినాశమవుతుందని మీకు తెలుసు. పతిత పావనుడు ఒక్క నిరాకార తండ్రేనని కూడా మీకు అర్థం చేయించారు. ఏ దేహధారి కూడా పతితపావనుడిగా అవ్వలేరు. పతితపావనులు పరమాత్మ ఒక్కరే. ఒకవేళ పతితపావన సీతారాం అన్నా భక్తికి ఫలమునిచ్చేందుకు భగవంతుడు వస్తారని తండ్రి అర్థం చేయించారు. కనుక సీతలంతా వధువులు, వరుడు అందరికీ సద్గతినిచ్చే రాముడొక్కడే. ఈ విషయాలన్నీ ఆ తండ్రే కూర్చుని స్వయంగా అర్థం చేయిస్తారు. డ్రామానుసారము మీరే మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత ఈ విషయాలన్నీ వింటారు. ఇప్పుడు మీరంతా చదువుకుంటున్నారు. పాఠశాలలో అనేకమంది చదువుకుంటారు. ఇదంతా డ్రామాలో తయారై ఉంది. ఏ సమయములో ఎవరు చదువుకుంటారో, ఏ నటన జరుగుతుందో అదే నటన మళ్లీ కల్పం తర్వాత ఉన్నదున్నట్లు జరుగుతుంది. ఇదే విధంగా 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ చదువుకుంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. చూస్తున్నదంతా సెకండు సెకండు కొత్త్రదిగానే కనిపిస్తుంది. చక్రము తిరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త విషయాలు మీరు చూస్తూ ఉంటారు. ఇది 5 వేల సంవత్సరాల డ్రామా అని ఇప్పుడు మీకు తెలుసు. ఇది నడుస్తూనే ఉంటుంది. దీని విస్తారము చాలా ఉంది. ముఖ్యమైన విషయాలు అర్థం చేయిస్తారు. ఉదాహరణానికి పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. కానీ తండ్రి నేను సర్వవ్యాపిని కానని అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని తమ రచన ఆదిమధ్యాంతాల పరిచయమును ఇస్తున్నారు. మనకు వారసత్వమునిచ్చేందుకు తండ్రి కల్ప-కల్పము వస్తారని మీరిప్పుడు తెలుసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా గాయనముంది. ఈ జ్ఞానము చాలా బాగుంది. విరాట రూపానికి కూడా తప్పకుండా అర్థముంటుంది కదా. కానీ తండ్రి తప్ప ఎప్పుడూ, ఎవ్వరూ అర్థం చేయించలేరు. చిత్రాలైతే అనేకమున్నాయి. కానీ ఒక్క చిత్రము గురించిన జ్ఞానము కూడా ఎవ్వరి వద్దా లేదు. ఉన్నతోన్నతులైనవారు శివబాబా. వారి చిత్రము కూడా ఉంది. కానీ వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత సూక్ష్మవతనముంది. దాని అవసరము లేదు వదిలేయండి. ఇక్కడి చరిత్ర-భూగోళాలను అర్థము చేసుకోవాలి. ఆ లోకము సాక్షాత్కారాలకు మాత్రమే. ఇక్కడ తండ్రి ఎలాగైతే ఇతనిలో కూర్చుని అర్థం చేయిస్తున్నారో అలా సూక్ష్మవతనములో కర్మాతీత శరీరములో కూర్చొని ఇతనితో కలుస్తారు లేక మాట్లాడ్తారు. అంతేకాని అచ్చట చరిత్ర-భూగోళము ఏదీ లేదు. హిస్టరి-జాగ్రఫీ ఇక్కడిదే.సత్యయుగములో దేవీ దేవతలు ఉండేవారని, 5 వేల సంవత్సరాలయ్యిందని పిల్లల బుద్ధిలో కూర్చున్నది. ఈ ఆది దేవీదేవతా సనాతన ధర్మము ఎలా స్థాపించబడిందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇతర ధర్మాల స్థాపన గురించి అయితే అందరికీ తెలుసు. పుస్తకాలు మొదలైనవి కూడా ఉన్నాయి. లక్షల సంవత్సరాల మాట ఉండేందుకు వీలే లేదు. ఇది శుద్ధ తప్పు. కానీ మానవుల బుద్ధి దేనికీ పనికి రాదు. ప్రతి విషయము తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! - బాగా ధారణ చేయండి. ముఖ్యమైనది తండ్రి స్మృతి, ఇది స్మృతి పరుగు. పరుగు పందెములుంటాయి కదా. కొంతమంది ఒంటరిగానే పరిగెడుతూ ఉంటారు. కొంతమంది కాలుకు కాలు కట్టుకుని ఇద్దరిద్దరు పరుగెడుతూ ఉంటారు. ఇక్కడున్న జంటలు కలిసి పరుగెత్తడం అభ్యాసము చేస్తున్నారు. సత్యయుగములో కూడా ఇదే విధంగా కలిసి జంటగా ఉండాలని అనుకుంటారు. భలే నామ-రూపాలైతే మారవచ్చు, అదే శరీరము లభించదు. శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటుదని భావిస్తారు. రూపురేఖలైతే వేరుగా ఉంటాయి. కానీ పిల్లలకు ఆశ్చర్యము కలగాలి - ఏ ముఖాలు, ఏ కర్తవ్యాలు, ఏ నటనలు, సెకండు సెకండు జరిగిపోయాయో అవే మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్‌ అవుతాయి. ఇది ఎంతో అద్భుతమైన నాటకము ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు. మనమంతా పురుషార్థము చేస్తామని మీకు తెలుసు. నెంబరువారుగానే అవుతారు. అందరూ కృష్ణులుగా
అవ్వలేరు. రూపు రేఖలు వేరు వేరుగా ఉంటాయి. ఇది ఎంతో అద్భుతమైన నాటకము. ఒకరి ముఖవైఖరి మరొకరితో కలవదు. జరిగిందే మళ్లీ ఉన్నదున్నట్లు రిపీట్‌ అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రే వచ్చి చదివిస్తున్నారు. జన్మ-జన్మాంతరాలుగా అయితే భక్తి మార్గములోని శాస్త్రాలు మొదలైనవన్నీ చదువుతూ వచ్చారు. సాధువులు మొదలైన వారి కథలు కూడా వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - భక్తి సమయము పూర్తయింది. ఇప్పుడు భక్తులకు భగవంతుని ద్వారా ఫలము లభిస్తుంది. భగవంతుడు ఏ రూపములో ఎప్పుడు వస్తారో తెలియదు. శాస్త్రాలు చదివితే భగవంతుడు లభిస్తారని అప్పుడప్పుడు అంటారు. ఒక్కొక్కసారి ఇక్కడకు వస్తారని అంటారు. శాస్త్రాలు చదివినందున భగవంతుడు లభించినట్లయితే ఇక భగవంతుడు వచ్చి ఏం చేస్తారు? అర్ధకల్పము మీరు ఈ శాస్త్రాలు చదువుతూ చదువుతూ తమోపధ్రానంగానే అవుతూ వచ్చారు. అందుకే పిల్లలకు సృష్టి చక్రము గురించి కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. దైవీ నడవడిక కూడా అవసరమే. ఎవ్వరికీ దు:ఖమివ్వరాదు. అలాగని ఎవరైనా విషమడిగితే, అది ఇవ్వకుంటే వారికి దు:ఖమిచ్చినట్లు భావించరాదు. తండి అలా చెప్పడం లేదు. కొంతమంది బుద్ధిహీనులు ఎవ్వరికీ దు:ఖమివ్వరాదని బాబా చెప్పినారు కదా, అందువలన వారు విషమడిగితే వారికివ్వాల్సిందే, ఇవ్వకుంటే వారికి దు:ఖము ఇచ్చినట్లు కదా అని అంటారు. ఇలా అనుకునే మూఢమతులు కూడా ఉన్నారు. తండ్రి ప్రతి రోజు పవిత్రంగా తప్పకుండా అవ్వాలని చెప్తున్నారు. ఆసురీ నడవడిక, దైవీ నడవడిక గురించి కూడా తెలుసుకోవాలి. మనుష్యులకు ఇది కూడా తెలియదు. వారు ఆత్మ నిర్లేపమని, ఏమైనా చేయండి, ఏమైనా తినండి-తాగండి, వికారాలకు వశమవ్వండి ఏమీ పర్వాలేదని అంటారు. ఈ విధంగా నేర్పేవారు కూడా ఉన్నారు. ఎంతోమందిని పట్టుకుని తీసుకొస్తారు. బయట కూడా చాలామంది శాఖాహారులున్నారు. ఇది చాలా మంచిది. కాబట్టే శాఖాహారులుగా అవుతారు. అన్ని జాతులలో వైష్ణవులు ఉంటారు. వారు ఛీ-ఛీ వస్తువులు భుజించరు. కానీ తక్కువ మంది ఉంటారు. మీరు కూడా మైనారిటీవారే, ఈ సమయములో మీరు చాలా తక్కువ మందే ఉన్నారు. నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. పిల్లలకు ఇదే శిక్షణ లభిస్తుంది - దైవీగుణాలు ధారణ చేయండి. ఛీ-ఛీ వస్తువులు, ఎవరి చేతితోనూ తయారైనవి తినరాదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ చార్టులో చూసుకోవాలి - 1. శ్రీమతానికి విరుద్ధంగా నడవడం లేదు కదా? 2. అసత్యం చెప్పడం లేదు కదా ? 3. ఎవ్వరినీ విసిగించడం లేదు కదా?
2. చదువుతో పాటు దైవీ నడవడికలను ధారణ చేయాలి. పవిత్రంగా అయ్యే తీరాలి. ఛీ-ఛీ వస్తువులేవీ భుజించరాదు. పూర్తి వైష్ణవులుగా అవ్వాలి, పరుగు

వరదానము :- '' సేవ ద్వారా సంతోషము, శక్తి మరియు సర్వుల నుండి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే పుణ్య ఆత్మా భవ ''
సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషము మరియు శక్తి లభిస్తుంది. సేవ చేస్తూ ఆత్మలను తండ్రి వారసత్వానికి అధికారులుగా చేయడం పుణ్య కార్యము. ఎవరైతే

స్లోగన్‌ :- ''మనసా, వాచాల శక్తి ద్వారా విఘ్నాల పర్దాను తొలిగిస్తే లోపల కళ్యాణకర దృశ్యము కనిపిస్తుంది''

No comments:

Post a Comment